కుంభకర్ణుడు ఆరునెలలు ఎందుకు నిద్రపోయేవాడు ?

By Swathi

గంటల తరబడి నిద్రపోయినా.. గాఢనిద్రలో నుంచి తేరుకోకపోయినా.. అందరికీ గుర్తొచ్చేది కుంభకర్ణుడు. అలాగే.. కుంభాలు కుంభాలు తిన్నా.. పరిమితికి మించి ఎక్కువగా ఆహారం తీసుకున్నా.. కుంభకర్ణుడితో పోలుస్తారు. మితిమీరిని ఆహారం, నిద్రపోయే వాళ్లను కుంభకర్ణుడితో పోల్చడాన్ని సరదాగా చూస్తూ ఉంటాం.

రామాయణంలో కుంబకర్ణుడి మరణం కథ..!

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరునెలలపాటు కుంభకర్ణుడు నిద్రపోతాడని మన పురాణాల్లో చెబుతూ వివరిస్తున్నాయి. పురాణాల్లో విషయమే అయినా.. మనకు ఆశ్చర్యంగా, వింతగా ఉంటుంది. కుంభకర్ణుడి పాత్ర మొత్తం చాలా విడ్డూరంగా, నమ్మలేనివిధంగా అనిపిస్తుంది. అయితే కుంభకర్ణుడు ఎందుకు ఆరునెలలు నిద్రపోతాడు ? ఇది అతనికి పుట్టికతో వచ్చిన గుణమా ? శాపమా ? వరమా ?

Unknown Facts about Kumbhakarna

కుంభకర్ణుడు రావణుడి సోదరునిగా మనందరికీ తెలుసు. కైకసి, విశ్రవసునకు పుష్పోత్కటము నందు కుంభకర్ణుడు పుట్టాడు. పుట్టగానే, దొరికిన జంతువులను పట్టుకుని మింగే ప్రయత్నం చేసాడట. అప్పుడు దేవతల రాజు ఇంద్రుడు బాణాలు వేసి కుంభకర్ణుడిని తరిమినా, అతని చేష్టలకు భయపడి బ్రహ్మతో చెప్పుకున్నాడట. కుంభకర్ణుడు రావణునితో వెళ్లి బ్రహ్మకోసం ఘోరమైన తపస్సు చేశాడట. రావణుడి కంటే ఎక్కువగా తపస్సు చేయడంతో దేవతలందరూ భయపడి.. బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లారు. ఈ తపస్సు వల్ల కుంభకర్ణుడు ఎలాంటి విద్యలు సాధిస్తాడో అని ఆందోళనగా తమను కాపాడమని బ్రహ్మను వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మ అజ్ఞ ప్రకారం సరస్వతి కుంభకర్ణుడి నాలుక మీద నిలబడి ఆరు నెలలు నిద్ర, ఒక రోజు భోజనం కావాలి అని పలికించిందట. అడిగిన వరమే యిచ్చాడు బ్రహ్మ.

Unknown Facts about Kumbhakarna

అందుకే కుంభకర్ణుడి కోసం ప్రత్యేక భవనం, ప్రత్యేక భోజన సౌకర్యం కల్పించారట. కుంభకర్ణుడు నిద్రలో తీసే గురకకు చెవులు చిల్లులు పడేవని మన పురాణ కథలు చెబుతాయి. కుంభకర్ణుడి నోటి నుంచి వచ్చే గాలికి సైనికులు విసిరేసినట్టు పడేవారట. అందుకే రామ, రావణ యుద్ధం సమయంలో కుంభకర్ణుని నిద్ర లేపడం చాలా కష్టమయింది. ఈ సన్నివేశాలు మనం సినిమాల్లో చూసే ఉంటాం. మేళ తాళాలు, ముక్కుల్లో గునపాలు గుచ్చినా కుంభకర్ణుడు మాత్రం నిద్రలో నుంచి బయటకురాలేదు.

రామాయణంలో రావణుని భార్య యొక్క ఆశ్చర్యమైన కథ

Unknown Facts about Kumbhakarna

ఆఖరికి కుంభకర్ణుడు నిద్ర లేచినా ఆకలి ఆకలి అని అరవడంతో.. వెయ్యిమందికి సరిపడే ఆహారం ఒక్కడే ఆరగించేశాడు. ఆ తర్వాత రావణుడి కోరికతో.. రాముడితో యుద్ధానికి కుంభకర్ణుడి వెళ్లాడు. కానీ కుంభకర్ణుడు యుద్ధంలో రామలక్ష్మణులతో పోటీపడలేక బలహీనుడయ్యాడు. ఇదంతా ముందు జన్మశాపం కారణంగా కుంభకర్ణుగా అవతరించాడని పురాణాలు చెబుతాయి.

Story first published: Thursday, January 7, 2016, 16:30 [IST]
Desktop Bottom Promotion