Latest Updates
-
మీ శరీరంలో ప్రోటీన్ లోపం ఉందని చెప్పే 5 ముఖ్యమైన సంకేతాలివే! -
డీప్ఫేక్ సెక్స్టార్షన్ ఉచ్చులో పడ్డారా? మీ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే! -
కిడ్నీ రాళ్లను ఇట్టే కరిగించే ఉలవలతో టేస్టీ వడలు..తయారీ విధానం ఇదే! -
తెలంగాణ-ఏపీలో ఎండల తీవ్రత: గర్భిణీలకు పొంచి ఉన్న ముప్పు ఇదే! -
ఇడ్లీ,దోశల్లోకి బెస్ట్ కాంబినేషన్ కరివేపాకు కొబ్బరి చట్నీ..మామూలు చట్నీల కంటే 100 రెట్లు రుచి! -
వేసవిలో బరువు తగ్గాలా? అయితే మజ్జిగలో ఈ చిన్న పొడి కలిపి తాగితే, మీ పొట్టలోని కొవ్వు మంచులా కరిగిపోతుంది! -
విజయ్–త్రిష వెడ్డింగ్ వీడియో.. సోషల్ మీడియాలో రచ్చ! అసలు నిజం ఇదేనా? -
ఓట్స్ అంటే ఇష్టం లేదా? ఇలా గంజిలా చేసి చూడండి..బరువు తగ్గడంతో పాటు రుచీ మీ సొంతం! -
పప్పుల పొడి బోర్ కొట్టిందా? అయితే ఈ ఘాటైన ఆంధ్రా చికెన్ కారప్పొడి ట్రై చేయండి! -
పీరియడ్స్ ఆలస్యం అవ్వడానికి అసలు కారణం ఇదేనట!
నాలుగు యుగాలుగా మనం దీపావళిని చేసుకుంటున్నాం, ఈ రోజు అక్కడ సీసా పెడితే చాలా ప్రయోజనం
లక్ష్మీ దేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన దివాళి రోజున ఉప్పుతో నింపిన ఒక సీసాను ఇంటిలో ఏదైనా ఒక మూలలో, లేదంటే బాత్రూమ్ లో పెడితే ఇంట్లోని దుష్టశక్తులు మొత్తం పోతాయట. నరకాసురుడు కోరిక మేరకు మనం ఈ పండుగను చ
వెలుగులు తెచ్చే పండుగ దివాళి.. దీపావళి. సాధారణంగా అందరూ అమావాస్య రోజునే దీపావళి నిర్వహించుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం దీపావలిని ముందుగానే చేసుకుంటూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అమవాస్య రోజే దీపావలి జరుపుకోవడం ఆనవాయితీ.

కుబేర వ్రతాన్ని ఆచరిస్తే
దీపావళి రోజు లక్ష్మీ దేవి కుబేర వ్రతాన్ని ఆచరిస్తే మంచిది. దీంతో స్త్రీలు సుమంగళిగా ఉంటారు. అలాగే వెండి దివ్వెలలో ఆవునెయ్యి వేసి వెలిగిస్తే సంపద కలుగుతుంది. దీపావళిని ఇప్పుడే కాదు గతంలో నాలుగు యుగాల్లోను నిర్వహించుకునేవారు.

బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కి
విష్ణుమూర్తి కృత యుగంలో బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కి వేయడం వల్ల అప్పుడు దివాళి చేసుకున్నారు. ఇక త్రేతా యుగంలో రాముడు రావణుడిని చంపి అయోధ్యలో అడుగుపెట్టిన రోజును దీపావళిగా చేసుకున్నారు.
ద్వాపర యుగం లో నరకాసురుడిని చంపిన రోజును దీపావళిగా చేసుకున్నారు.

అలా నాలుగు యుగాలుగా
కలియుగంలో విక్రమార్కుడు పట్టాభిషేకం నిర్వహించుకున్న రోజును దీపావళిగా చేసుకున్నారు. అలా నాలుగు యుగాలుగా దీపావళిని చేసుకుంటూనే ఉన్నారు. నరకాసురుడిని సత్యభామ వధించింనందుకు సూచికగా.. చెడుపై మంచి సాధించినవిజయానికి గుర్తుగా అమవాస్య రోజు తెలుగు రాష్ట్రాల్లో దీపావళి చేసుకుంటాం.

ఉప్పుతో నింపిన ఒక సీసాను
లక్ష్మీ దేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన దివాళి రోజున ఉప్పుతో నింపిన ఒక సీసాను ఇంటిలో ఏదైనా ఒక మూలలో, లేదంటే బాత్రూమ్ లో పెడితే ఇంట్లోని దుష్టశక్తులు మొత్తం పోతాయట. నరకాసురుడు కోరిక మేరకు మనం ఈ పండుగను చేసుకుంటున్నాం.

వేలాది దీపాలు వెలిగిస్తాం
నరకాసురుడు చనిపోయే ముందు తాను మరణించిన రోజును ప్రజలంతా ఎంతో సంతోషంగా పండుగ చేసుకోవాలని క్రిష్ణుడిని కోరడం వల్లే మనం దీపావళిని చేసుకుంటున్నాం. చీకటిని పారద్రోలి వెలుగును ఆహ్వానించినందుకు ప్రతీకగానే మనం ఈ రోజు వేలాది దీపాలు వెలిగిస్తాం. టపాసులు కాలుస్తాం. దీపావళి సంబరాలు నార్త్ ఇండియాలో ఎక్కువగా జరుగుతాయి.



Click it and Unblock the Notifications