Latest Updates
-
అన్నం, పప్పు,పరాఠా, రోటీల్లోకి బెస్ట్ కాంబినేషన్..రాజస్థానీ స్పెషల్ వెల్లుల్లి ఎర్ర మిరప చట్నీ -
ఉగాది స్పెషల్..ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ క్రంచీ బేబీ కార్న్ 65..వాహ్ అనిపించే బెస్ట్ స్టార్టర్! -
గుంటూరు కారం పొడి, చిట్టి ఇడ్లీ..ఇలా చేస్తే ప్లేట్లు ఖాళీ అవ్వాల్సిందే! -
నో గ్యాస్, నో స్టవ్.. నిమిషాల్లో తయారయ్యే కమ్మని పల్లెటూరి రోటి పెరుగు పచ్చడి..ప్లేట్ అన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
రోజూ తినే పప్పు బోర్ కొట్టిందా? అయితే ఈ ధాబా స్టైల్ దాల్ తడ్కా ట్రై చేయండి..గిన్నెలు గిన్నెలు లేపేస్తారు! -
తెలుగువారి తొలి పండుగ: ఉగాది 2026 తేదీ, పేరు, ఆచారాలు, సంప్రదాయాలు -
కేవలం 10 నిమిషాల్లో దూదిలాంటి టమాటో సెట్ దోశ.. పప్పు నానబెట్టే పనే లేదు..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్! -
భాగస్వామి సంతృప్తిలో అట్టడుగు స్థానంలో భారత్..మూసిన తలుపుల వెనుక అసలు కథ! -
ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు.. ఇలా చేస్తే పర్ఫెక్ట్ గా వస్తాయి..నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతూ అమృతమే! -
పండిన అరటిపండ్లతో సింపుల్ అండ్ సూపర్ స్వీట్..హెల్తీ బనానా బర్ఫీ ఎలా చేసుకోవాలంటే..
నాలుగు యుగాలుగా మనం దీపావళిని చేసుకుంటున్నాం, ఈ రోజు అక్కడ సీసా పెడితే చాలా ప్రయోజనం
లక్ష్మీ దేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన దివాళి రోజున ఉప్పుతో నింపిన ఒక సీసాను ఇంటిలో ఏదైనా ఒక మూలలో, లేదంటే బాత్రూమ్ లో పెడితే ఇంట్లోని దుష్టశక్తులు మొత్తం పోతాయట. నరకాసురుడు కోరిక మేరకు మనం ఈ పండుగను చ
వెలుగులు తెచ్చే పండుగ దివాళి.. దీపావళి. సాధారణంగా అందరూ అమావాస్య రోజునే దీపావళి నిర్వహించుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం దీపావలిని ముందుగానే చేసుకుంటూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అమవాస్య రోజే దీపావలి జరుపుకోవడం ఆనవాయితీ.

కుబేర వ్రతాన్ని ఆచరిస్తే
దీపావళి రోజు లక్ష్మీ దేవి కుబేర వ్రతాన్ని ఆచరిస్తే మంచిది. దీంతో స్త్రీలు సుమంగళిగా ఉంటారు. అలాగే వెండి దివ్వెలలో ఆవునెయ్యి వేసి వెలిగిస్తే సంపద కలుగుతుంది. దీపావళిని ఇప్పుడే కాదు గతంలో నాలుగు యుగాల్లోను నిర్వహించుకునేవారు.

బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కి
విష్ణుమూర్తి కృత యుగంలో బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కి వేయడం వల్ల అప్పుడు దివాళి చేసుకున్నారు. ఇక త్రేతా యుగంలో రాముడు రావణుడిని చంపి అయోధ్యలో అడుగుపెట్టిన రోజును దీపావళిగా చేసుకున్నారు.
ద్వాపర యుగం లో నరకాసురుడిని చంపిన రోజును దీపావళిగా చేసుకున్నారు.

అలా నాలుగు యుగాలుగా
కలియుగంలో విక్రమార్కుడు పట్టాభిషేకం నిర్వహించుకున్న రోజును దీపావళిగా చేసుకున్నారు. అలా నాలుగు యుగాలుగా దీపావళిని చేసుకుంటూనే ఉన్నారు. నరకాసురుడిని సత్యభామ వధించింనందుకు సూచికగా.. చెడుపై మంచి సాధించినవిజయానికి గుర్తుగా అమవాస్య రోజు తెలుగు రాష్ట్రాల్లో దీపావళి చేసుకుంటాం.

ఉప్పుతో నింపిన ఒక సీసాను
లక్ష్మీ దేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన దివాళి రోజున ఉప్పుతో నింపిన ఒక సీసాను ఇంటిలో ఏదైనా ఒక మూలలో, లేదంటే బాత్రూమ్ లో పెడితే ఇంట్లోని దుష్టశక్తులు మొత్తం పోతాయట. నరకాసురుడు కోరిక మేరకు మనం ఈ పండుగను చేసుకుంటున్నాం.

వేలాది దీపాలు వెలిగిస్తాం
నరకాసురుడు చనిపోయే ముందు తాను మరణించిన రోజును ప్రజలంతా ఎంతో సంతోషంగా పండుగ చేసుకోవాలని క్రిష్ణుడిని కోరడం వల్లే మనం దీపావళిని చేసుకుంటున్నాం. చీకటిని పారద్రోలి వెలుగును ఆహ్వానించినందుకు ప్రతీకగానే మనం ఈ రోజు వేలాది దీపాలు వెలిగిస్తాం. టపాసులు కాలుస్తాం. దీపావళి సంబరాలు నార్త్ ఇండియాలో ఎక్కువగా జరుగుతాయి.



Click it and Unblock the Notifications











