Just In
- 1 hr ago ఈ 4 రాశులకు శుక్రుడు, రాహువు కలయిక గొప్ప ఫలితాలిస్తాయి, ఏప్రిల్లో డబ్బు వర్షం కురుస్తుంది
- 3 hrs ago First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- 6 hrs ago నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- 8 hrs ago ఈ అలవాట్లు ఉన్నవారికి తీవ్ర కడుపులో అల్సర్ వచ్చే అవకాశం ఉంది...వెంటనే బయటపడండి...!
కృష్ణుడు తన మేనమామ కంసుడిని ఎందుకు చంపాడో తెలుసా? ఆమె పాలు, రక్తాన్నంతా తాగేస్తాడు కృష్ణుడు
రేపల్లెలో దొరికిన ప్రతి పసిగుడ్డును చంపుతాడు. అంతేకాదు ఒక అందమైన స్త్రీని కూడా పంపుతాడు. ఆమె ప్రతి ఇంటిలో చిన్నపిల్లలకు విషం కలిసిన పాలు ఇచ్చి చంపేసి ఉంటుంది. అయితే కృష్ణుడు దగ్గరకు ఆమె వచ్చినప్పుడు..
కంసుడి పేరు అందరూ వినే ఉంటారు. ఈయన ఉగ్రసేనుడి కొడుకు. ఇతను రాక్షస అంశం ద్వారా పుట్టాడు. దుర్మార్గం ద్వారా మధురకు రాజు అవుతాడు కంసుడు. జరాసంధుడికి ఇద్దరు కుమర్తెలుంటారు. వారే ఆస్తి, పాస్తి.వారిద్దరినీ కంసుడికిచ్చి పెళ్లి చేస్తాడు జరాసంధుడు.
ఇక తన చెల్లెలని వసుదేవునికిచ్చి పెళ్లి చేస్తాడు జరాసంధుడు. అయితే ఆకాశవాణి ఇలా చెబుతుంది. నీ చెల్లెలు దేవకీకి పుట్టే ఎనిమిదో సంతానం వల్ల నీకు మరణం ఉంటుంది అని ఒక స్వరం జరాసంధుడికి వినపడుతుంది.
చెల్లెలిని చంపడానికి ప్రయత్నిస్తాడు
దాంతో వెంటనే చెల్లెలిని చంపడానికి ప్రయత్నిస్తాడు. అయితే వసుదేవుడు అడ్డుకుంటాడు. ఎనిమిదో బిడ్డ వల్ల కదా నీకు మరణం మాకు పుట్టే ప్రతి బిడ్డను నీకేం ఇస్తాం ప్రాణాలతో వదిలిపెట్టు అని కోరుతాడు వసుదేవుడు, ఆయన భార్య. దీంతో వారిద్దరినీ ఒక చోట బంధించి వారు కాపురం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు జరాసంధుడు.
ఎనిమిదో సారి ఆడబిడ్డ పుట్టగానే
ఇక వారిద్దరికీ పుట్టిన బిడ్డలందరినీ చంపేస్తాడు జరాసంధుడు. అయితే ఎనిమిదో సారి ఆడబిడ్డ పుట్టగానే చంపడానికి ప్రయత్నిస్తున్న జరాసంధుని అతని చెల్లి అడ్డగిస్తుంది. అన్నా ఆడపిల్ల నిన్ను ఏం చేస్తుందిలే అని చెప్పినా కూడా వినడు. అయితే జరాసంధుని చేతిలోని ఆ అమ్మాయి ఒక శక్తిలాగా మారుతుంది.
రేపల్లె మొత్తంలో రాక్షసులను దింపుతాడు
నీ మేనల్లుడు శ్రీకృష్ణుడు పుట్టగానే రేపల్లెకు చేరాడు. అతని నుంచి నీ చావును ఎవరూ అడ్డుకోలేరు అంటూ ఆమె మాయమైపోతుంది. దీంతో కంసుడు రేపల్లె మొత్తంలో రాక్షసులను దింపుతాడు. అంతా వెతుకుతాడు కానీ లాభం ఉండదు.
ఆమె శరీరంలో ఉన్న రక్తాన్నంతా తాగేస్తాడు
రేపల్లెలో దొరికిన ప్రతి పసిగుడ్డును చంపుతాడు. అంతేకాదు ఒక అందమైన స్త్రీని కూడా పంపుతాడు. ఆమె ప్రతి ఇంటిలో చిన్నపిల్లలకు విషం కలిసిన పాలు ఇచ్చి చంపేసి ఉంటుంది. అయితే కృష్ణుడు దగ్గరకు ఆమె వచ్చినప్పుడు ఆమె పాలతో పాటు ఆమె శరీరంలో ఉన్న రక్తాన్నంతా తాగేస్తాడు. దీంతో ఆమె చనిపోతుంది. మొత్తానికి కంసుడికి దొరక్కుండానే క్రిష్ణుడు పెద్దవాడు అయిపోతాడు.
ఫలితం ఉండదు.
పెరిగిపెద్దవాడైన శ్రీకృష్ణుడిని కంసుడు తన రాజ్యానికి ఆహ్వానిస్తాడు. శ్రీకృష్ణుడు బలరాముడితో కలిసి వెళ్తాడు. వాళ్లను చంపడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఉంటాడు కంసుడు. కానీ ఫలితం ఉండదు.
మామవి అని ఇన్నాళ్లు ఊరుకున్నాను
చివరకు శ్రీకృష్ణుడు.. నువ్వు నా మామవి అని ఇన్నాళ్లు ఊరుకున్నాను. నీ అఘాయిత్యాలను నేను ఇక సహించను అంటాడు. కానీ ఇప్పుడు మాత్రం ఊరుకునేది లేదంటూ కంసుడ్ని చంపేస్తాడు శ్రీకృష్ణుడు.