Latest Updates
-
ఉగాది పచ్చడి ఎందుకు తినాలి? ఎన్ని రోజులు తినాలి? ఈ రహస్యం మీకు తెలుసా? -
ఉగాది సంప్రదాయ వంటకాలు: జస్ట్ 20 నిమిషాల్లో సజ్జ బూరెలు, కొబ్బరి బూరెలు..ఎలా చేసుకోవాలంటే. -
రాగి పూరీ-ఉల్లిపాయ మసాలా..లెక్కలేకుండా తినేయడం గ్యారెంటీ! -
అన్నం, పప్పు,పరాఠా, రోటీల్లోకి బెస్ట్ కాంబినేషన్..రాజస్థానీ స్పెషల్ వెల్లుల్లి ఎర్ర మిరప చట్నీ -
ఉగాది స్పెషల్..ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ క్రంచీ బేబీ కార్న్ 65..వాహ్ అనిపించే బెస్ట్ స్టార్టర్! -
గుంటూరు కారం పొడి, చిట్టి ఇడ్లీ..ఇలా చేస్తే ప్లేట్లు ఖాళీ అవ్వాల్సిందే! -
నో గ్యాస్, నో స్టవ్.. నిమిషాల్లో తయారయ్యే కమ్మని పల్లెటూరి రోటి పెరుగు పచ్చడి..ప్లేట్ అన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
రోజూ తినే పప్పు బోర్ కొట్టిందా? అయితే ఈ ధాబా స్టైల్ దాల్ తడ్కా ట్రై చేయండి..గిన్నెలు గిన్నెలు లేపేస్తారు! -
తెలుగువారి తొలి పండుగ: ఉగాది 2026 తేదీ, పేరు, ఆచారాలు, సంప్రదాయాలు -
కేవలం 10 నిమిషాల్లో దూదిలాంటి టమాటో సెట్ దోశ.. పప్పు నానబెట్టే పనే లేదు..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్!
కౌరవుల్లోనూ మంచివాడున్నాడు, ధృతరాష్టుడు చెలికత్తెతో కన్న కొడుకే అతను, దుర్యోధనుడికి దీటైనా వాడు
గాంధారికి మొదట పిల్లలు పుట్టరు. కానీ ఆమెకు వందమంది పిల్లలు పుట్టే అవకాశం ఉందని ధృతరాష్టుడు తెలుస్తుంది. కానీ వాళ్లు పుడతారో లేదో అని ధృతరాష్టుడికి అనుమానం కలుగుతుంది.ధృతరాష్టుడు చెలికత్తె.
మహా భారతంలో కౌరవులంతా కూడా చండశాసనులు అని అనుకుంటాం. కానీ కౌరవుల్లో కొందరు మంచి వారు కూడా ఉన్నారు. కౌరవుల వంశానికి చెందిన యుయుత్సుడు పాండవుల పక్షాన నిలబడి అధర్మానికి వ్యతిరేకంగా పోరాడాడు.
గాంధారికి మొదట పిల్లలు పుట్టరు. కానీ ఆమెకు వందమంది పిల్లలు పుట్టే అవకాశం ఉందని ధృతరాష్టుడు తెలుస్తుంది. కానీ వాళ్లు పుడతారో లేదో అని ధృతరాష్టుడికి అనుమానం కలుగుతుంది. దీంతో ధృతరాష్టుడు చెలికత్తె ద్వారా సంతానం పొందాలనుకుంటాడు.

చెల్లికత్తె వల్ల పుట్టాడు
ఆ చెల్లికత్తె పేరు సుఖద. ధృతరాష్టుడు ఆమెకు విషయం చెప్పగానే ఆమె ఒప్పుకుంటుంది. దీంతో వారిద్దరూ కలిసి యుయుత్సుడు అనే బిడ్డకు జన్మినిస్తారు. అయితే గాంధారికి కరెక్ట్ గా దుర్యోధనుడు జన్మించినప్పుడు ధృతరాష్టుడికి సుఖద వల్ల యుయుత్సుడు కూడా పుడతాడు.

దుర్యోధనుడు సోదరుడిగా భావించలేదు
ధృతరాష్టుడు దుర్యోధనుడిని ఒక్కటే కోరుతాడు. రాజ్యంపై నీతో పాటు యుయుత్సుడునికి కూడా సమాన అధికారం ఉంటుందని చెబుతాడు. అయితే దుర్యోధనుడు ఎప్పుడు కూడా యుయుత్సుడున్ని తన సోదరుడిగా భావించలేదు. అంతేకాదు తన సోదరులందరికీ కూడా యుయుత్సుడునికి దూరంగానే ఉండమని చెబుతాడు. దీంతో అందరూ అతన్ని ఒక దాసికి పుట్టిన వాడిగానే చూస్తారు.

దుర్యోధనుడికి దీటుగా రాటుదేలుతాడు
కానీ యుయుత్సుడు మాత్రం యుద్ధ విద్యల్లో దుర్యోధనుడికి దీటుగా రాటుదేలుతాడు. కౌరవులకు సంబంధించిన ప్రతి విషయం యుయుత్సుడునికి తెలుసు. కానీ వారివైపు ఏనాడు నిలబడలేదు. ధర్మాన్నే నమ్మాడు.

పాండవుల పక్షానే యుద్ధం చేస్తాడు
ఇక కురుక్షేత్రంలో కౌరవులు పాండువులపై పన్నిన కుట్రలు మొత్తం పాండవులకు చెబుతాడు యుయుత్సుడు. తర్వాత పాండవుల పక్షానే యుద్ధం చేస్తాడు. పాండవులకు తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పోరాడుతాడు.

యుయుత్సుడు మాత్రం బతుకుతాడు
అయితే ధర్మం పక్కనే నిలబడడంతో కురుక్షేత్రంలో కౌరవులంతా మరణించినా యుయుత్సుడు మాత్రం బతుకుతాడు. కురక్షేత్రం మొత్తం పూర్తయ్యాక ప్రాణాలతో బయటపడ్డ పన్నెండు మందిలో యుయుత్సుడు కూడా ఉన్నాడు.

చాలా తక్కువ మందికి తెలుసు.
యుద్ధం పూర్తయ్యాక పాండువులు స్వర్గానికి వెళ్తారు. అయితే ఇక్కడ పాలించే బాధ్యతలను పరీక్షితుడికి అప్పగిస్తారు. అతనికి తోడుగా యుయుత్సుడు కూడా ఉంటాడు. అలా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న యుయుత్సుడి గురించి చాలా తక్కువ మందికి తెలుసు.



Click it and Unblock the Notifications











