Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
మిమ్మల్ని.. మీరే చంపుకోవద్దు???

టీ తాగొద్దు: భోజనం చేసిన వెంటనే 'టీ' తాగకూడదు, టీ వల్ల కుడుపులో వ్యాప్తి చెందే 'ఆసిడ్' మీరు తిన్న ఆహారాన్ని జీర్ణం కాకుండా చేస్తుంది.
ధూమపానానికి దూరంగా ఉండండి: భోజనం చేసిన తరువాత ధూమపానం చేస్తే క్యాన్సర్ వచ్చే అవకాశాలు భేషుగ్గా ఉంటాయట. ముఖ్యంగా పొగరాయుళ్లు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
నిద్రపోకండి: చాలా మందికి భోజనం చేసిన వెంటనే నిద్రపోవటం అలవాటు. తినగానే పవళించటం వల్ల ఆహారం అరగక 'గ్యాస్ట్రిక్' ఇబ్బందులు తలెత్తుతాయట. అంతేకాదు పొట్టకూడా పెరుగుతుందట. అయితే భోజనం అనంతరం నిద్రను 15 నిమిషాల్లోపు ముగించుకుంటే ఎటువంటి ప్రమాదం ఉండదని వైద్యులు సూచిస్తున్నారు.
పళ్లు తినకండి: బో్జనం చేసిన వెంటనే చాల మందికి పండ్లను తినే అలవాటు ఉంటుంది. అయితే ఈ అలవాటు మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. భోజనం తీసుకున్న వెంటనే పళ్లను ఆరగించటం వల్లన కడుపు మొత్తం గాలితో నిండిపోతుంది. పళ్లు తినే అలవాటున్న వారు భోజనానికి రెండు గంటలు ముందుగాని, చేసిన రెండు గంటల తరవాత గాని తినటం మంచింది.
తిన్న వెంటనే స్నానం చేయ్యేద్దు: భోజనం పూర్తి చేసిన వెంటనే స్నానం చెయ్యకండి. తిన్న వెంటనే స్నానం చేయ్యటం వల్ల పొట్ట భాగంలో రక్త ప్రసరణ తగ్గి జీర్ణ వ్యవస్థ సామర్ధ్యం నశిస్తుంది.



Click it and Unblock the Notifications











