Latest Updates
-
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి
మిమ్మల్ని.. మీరే చంపుకోవద్దు???

టీ తాగొద్దు: భోజనం చేసిన వెంటనే 'టీ' తాగకూడదు, టీ వల్ల కుడుపులో వ్యాప్తి చెందే 'ఆసిడ్' మీరు తిన్న ఆహారాన్ని జీర్ణం కాకుండా చేస్తుంది.
ధూమపానానికి దూరంగా ఉండండి: భోజనం చేసిన తరువాత ధూమపానం చేస్తే క్యాన్సర్ వచ్చే అవకాశాలు భేషుగ్గా ఉంటాయట. ముఖ్యంగా పొగరాయుళ్లు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
నిద్రపోకండి: చాలా మందికి భోజనం చేసిన వెంటనే నిద్రపోవటం అలవాటు. తినగానే పవళించటం వల్ల ఆహారం అరగక 'గ్యాస్ట్రిక్' ఇబ్బందులు తలెత్తుతాయట. అంతేకాదు పొట్టకూడా పెరుగుతుందట. అయితే భోజనం అనంతరం నిద్రను 15 నిమిషాల్లోపు ముగించుకుంటే ఎటువంటి ప్రమాదం ఉండదని వైద్యులు సూచిస్తున్నారు.
పళ్లు తినకండి: బో్జనం చేసిన వెంటనే చాల మందికి పండ్లను తినే అలవాటు ఉంటుంది. అయితే ఈ అలవాటు మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. భోజనం తీసుకున్న వెంటనే పళ్లను ఆరగించటం వల్లన కడుపు మొత్తం గాలితో నిండిపోతుంది. పళ్లు తినే అలవాటున్న వారు భోజనానికి రెండు గంటలు ముందుగాని, చేసిన రెండు గంటల తరవాత గాని తినటం మంచింది.
తిన్న వెంటనే స్నానం చేయ్యేద్దు: భోజనం పూర్తి చేసిన వెంటనే స్నానం చెయ్యకండి. తిన్న వెంటనే స్నానం చేయ్యటం వల్ల పొట్ట భాగంలో రక్త ప్రసరణ తగ్గి జీర్ణ వ్యవస్థ సామర్ధ్యం నశిస్తుంది.



Click it and Unblock the Notifications











