Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
వయస్సుతో ముడిపెట్టలేని అందచందాలు...!

అందంలో ముఖ్య పాత్రను పోషించేది చర్మం. వయస్సుని తొందరగా గుర్తు పట్టేలా చేసేది చర్మం. చర్మపు ముడుతలవల్లే నిగారింపు, యవ్వనం, అందం మటు మాయమౌతాయి. వయస్సుతో సంబంధం లేకుండా కేవలం తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లే ఇలా జరుగుతుంటుంది. కొంతమందిని కొన్ని సందర్భాల్లో చూసి వాళ్ళు అమ్మ, కూతుళ్ళా లేకా అక్కా చెల్లెళ్ళా అని అనుకుంటారు. దానికి కారణం అందానికి తగినటువంటి కేర్ తీసుకోవడమే. ఆ జాగ్రత్తలు మీరు తీసుకుంటే మీరూ అందంగా...ఆకర్షనీయంగా కనిపిస్తుంటారు.
1. పచ్చటి పైనాపిల్ జ్యూస్ను, ఆపిల్ జ్యూస్ ను తీ సుకోవాలి. మొదట పైనాపిల్ జ్యూస్ ను తీసుకొని ఫేస్ కు అప్లయ్ చేయాలి. తర్వాత ఆపిల్ జ్యూస్ అప్లయ్ చేసి పావుగంట ఉంచి కడగితే చర్మం పై ముడుతలు, పగుళ్ళు మటుమాయం అవుతాయి.
2. ముఖం మీద ముడుతలున్నవారు, గింజలు లేని ద్రాక్షను తీసుకొని రెండు భాగాలుగా చేసి వాటిని వేళ్ళతో నలిపి ముడుతలు ఉన్న చోట రాయాలి. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటిలో ముఖాన్ని కడిగి, బాగా గాలికి ఆరనిచ్చి తర్వాత మార్పును ఇట్టే గుర్తించవచ్చు.
3. కొన్ని రకాల మచ్చలు, గుంటలు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా పోగొట్టుకోవచ్చు. అయితే ప్లాస్టిక్ సర్జరీకి ఖర్చు ఎక్కువ కాబట్టి ఇంట్లో వస్తువులను ప్రయత్నించి చూడండి..నిమ్మరసం, బార్లీ పిండి, మినపపిండి కలిపి రాసుకుంటే మచ్చులు, గుంటలు తగ్గుతాయి.
4. కొత్తిమీర, పుదీనా మెత్తగా నూరి చర్మానికి రాస్తే నల్లమచ్చలు పోతాయి. అలాగే తేనె, నిమ్మరసం సమపాళ్ళల్లో తీసుకొని బాగా మిక్స్ చేసి చర్మంపై మచ్చలు, గుంటలు తగ్గుతాయి.
5. కోడిగుడ్డు తెల్లసొన, ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి రాసి పూర్తిగా ఆరిపోయిన తరువాత గోరువెచ్చని నీళ్లలో దూది ముంచి నెమ్మదిగా కడుక్కొంటే ముఖం నునుపుదేలుతుంది.
6. బంగాళదుంప ఉడికించి తొక్కు తీసి పాలతోగాని, పుల్లటి పెరుగుతో గాని ముఖానికి పట్టించి పావుగంట తరువాత కడిగేసుకుంటే ముడతలు, మచ్చలు మటుమాయమవుతాయి.



Click it and Unblock the Notifications











