Latest Updates
-
ఎండల దెబ్బకు పీసీఓఎస్, పీరియడ్స్ సమస్యలు పెరుగుతున్నాయా? ఈ జాగ్రత్తలు మీకోసమే! -
ఎండల మంటల్లో పెళ్లిళ్లు.. వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే ఈ మార్పులు తప్పనిసరి! -
జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటే వడదెబ్బ తగలదా? -
సూరత్లో దారుణం: భార్యను సిమెంట్ బాక్సులో దాచిన భర్త.. బంధాల్లో ఈ 'రెడ్ ఫ్లాగ్స్' కనిపిస్తే జాగ్రత్త! -
షుగర్ ఫ్రీ పుదీనా లస్సీ.. వేసవిలో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం! -
వేసవి తాపాన్ని తగ్గించే సత్తు లడ్డూ.. ఈ ఎండలకు బెస్ట్ స్వీట్ ఇదే! -
NEET UG 2026 అడ్మిట్ కార్డులు వచ్చేసాయి.. పరీక్షలో విజయం సాధించాలంటే ఈ చివరి నిమిషం జాగ్రత్తలు తప్పనిసరి! -
పాలు వద్దు, పంచదార వద్దు.. పటిక బెల్లంతో 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ రవ్వ లడ్డు! -
ఏప్రిల్ 27 రాజయోగం: ఈ రాశుల వారికి ధన యోగం.. ఇక తిరుగులేదు! -
ఈ చేప మగాళ్లకు సర్వరోగ నివారిణి..ఒకేసారి బలం,ఓపిక వచ్చేస్తుంది!
వయస్సుతో ముడిపెట్టలేని అందచందాలు...!

అందంలో ముఖ్య పాత్రను పోషించేది చర్మం. వయస్సుని తొందరగా గుర్తు పట్టేలా చేసేది చర్మం. చర్మపు ముడుతలవల్లే నిగారింపు, యవ్వనం, అందం మటు మాయమౌతాయి. వయస్సుతో సంబంధం లేకుండా కేవలం తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లే ఇలా జరుగుతుంటుంది. కొంతమందిని కొన్ని సందర్భాల్లో చూసి వాళ్ళు అమ్మ, కూతుళ్ళా లేకా అక్కా చెల్లెళ్ళా అని అనుకుంటారు. దానికి కారణం అందానికి తగినటువంటి కేర్ తీసుకోవడమే. ఆ జాగ్రత్తలు మీరు తీసుకుంటే మీరూ అందంగా...ఆకర్షనీయంగా కనిపిస్తుంటారు.
1. పచ్చటి పైనాపిల్ జ్యూస్ను, ఆపిల్ జ్యూస్ ను తీ సుకోవాలి. మొదట పైనాపిల్ జ్యూస్ ను తీసుకొని ఫేస్ కు అప్లయ్ చేయాలి. తర్వాత ఆపిల్ జ్యూస్ అప్లయ్ చేసి పావుగంట ఉంచి కడగితే చర్మం పై ముడుతలు, పగుళ్ళు మటుమాయం అవుతాయి.
2. ముఖం మీద ముడుతలున్నవారు, గింజలు లేని ద్రాక్షను తీసుకొని రెండు భాగాలుగా చేసి వాటిని వేళ్ళతో నలిపి ముడుతలు ఉన్న చోట రాయాలి. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటిలో ముఖాన్ని కడిగి, బాగా గాలికి ఆరనిచ్చి తర్వాత మార్పును ఇట్టే గుర్తించవచ్చు.
3. కొన్ని రకాల మచ్చలు, గుంటలు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా పోగొట్టుకోవచ్చు. అయితే ప్లాస్టిక్ సర్జరీకి ఖర్చు ఎక్కువ కాబట్టి ఇంట్లో వస్తువులను ప్రయత్నించి చూడండి..నిమ్మరసం, బార్లీ పిండి, మినపపిండి కలిపి రాసుకుంటే మచ్చులు, గుంటలు తగ్గుతాయి.
4. కొత్తిమీర, పుదీనా మెత్తగా నూరి చర్మానికి రాస్తే నల్లమచ్చలు పోతాయి. అలాగే తేనె, నిమ్మరసం సమపాళ్ళల్లో తీసుకొని బాగా మిక్స్ చేసి చర్మంపై మచ్చలు, గుంటలు తగ్గుతాయి.
5. కోడిగుడ్డు తెల్లసొన, ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి రాసి పూర్తిగా ఆరిపోయిన తరువాత గోరువెచ్చని నీళ్లలో దూది ముంచి నెమ్మదిగా కడుక్కొంటే ముఖం నునుపుదేలుతుంది.
6. బంగాళదుంప ఉడికించి తొక్కు తీసి పాలతోగాని, పుల్లటి పెరుగుతో గాని ముఖానికి పట్టించి పావుగంట తరువాత కడిగేసుకుంటే ముడతలు, మచ్చలు మటుమాయమవుతాయి.



Click it and Unblock the Notifications