Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
గులాబీ రేకులతో చర్మానికి నిగారింపు!
రోజ్ వాటర్లో వుండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చర్మంలోని కణాలని పరిపుష్టం చేయడంతోపాటు చర్మంలో వుండే టిష్యుల పునరుత్పత్తికి ఉపయోగపడతాయి.
రోజ్ , ఈ పేరు తెలియని వారుండరు. ఎందుకంటే ఎన్నో ప్రేమలకు ఇది ప్రత్యక్ష సాక్షి. ఇది లేకండా లవ్ వికసించదు అని ఎవ్వరన్నా అంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఈ పువ్వుతో తయారయిన వాటర్ వల్ల మన అందానికి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి.
రోజ్ వాటర్లో వుండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చర్మంలోని కణాలని పరిపుష్టం చేయడంతోపాటు చర్మంలో వుండే టిష్యుల పునరుత్పత్తికి ఉపయోగపడతాయి.

రోజ్ వాటర్లో వుండే మాయిశ్చరైజింగ్ లక్షణం చర్మ సౌందర్యానికి మేలు చేస్తుంది. కళ్లచుట్టూ వుండే నల్లటి చారికలు, మచ్చలు తొలగించుకోవడానికి నిత్యం కొద్దిపాటి రోజ్ వాటర్తో శుభ్రం చేస్తే ఫలితం కనిపిస్తుంది.
మండు వేసవిలో ఎండ వేడిమి కారణంగా వచ్చే చర్మ రోగాలకి రోజ్ వాటర్ చక్కటి ఔషదం. మనకు మార్కెట్ లో కూడా రోజ్ వాటర్ విరివిరిగా దొరుకుతుంది. ఇక పోతే రోజ్ వాటర్ వల్ల మన అందానికి కలిగే బెనిఫిట్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

ముఖం తాజాగా మెరుస్తుంది:
గులాబీ రేకల్ని కాసేపు నీటిలో ఉంచాలి. తరవాత ముద్దలా చేసి ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాలయ్యాక చన్నీళ్లతో కడిగేసుకోవాలి. దీనివల్ల ముఖం తాజాగా మెరుస్తుంది.

డ్రై స్కిన్ నివారిస్తుంది:
పొడి చర్మం ఉన్నవారికి గులాబీ రేకల్లోని సహజ నూనెలు కావాల్సిన తేమను అందిస్తాయి. రెండు గులాబీపువ్వుల రేకలకు కాస్త తేనె, రెండు చెంచాల పాలు కలిపి ముద్దలా చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకుని పావుగంట తరవాత కడిగేయాలి. మృతకణాలు పోవడంతోపాటూ చర్మం మృదువుగా ఉంటుంది.

మొటిమలను నివారిస్తుంది:
గుప్పెడు గులాబీరేకల్ని మెత్తగా చేసుకుని ఆ మిశ్రమానికి కాస్త గులబీ నీరూ, తేనె కలిపి ముఖం, మెడకూ పట్టించాలి. పావుగంట తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. మొటిమల సమస్య తగ్గి.. చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది.

సన్ ట్యాన్ నివారిస్తుంది:
ఎండ ప్రభావం వల్ల చర్మం నల్లగా మారిందా..? పెద్ద చెంచాడు గులాబీ ముద్దలో రెండు చెంచాల చందనం, ఒకటిన్నర చెంచా నిమ్మరసం, చిటికెడు పసుపు వేసి కలపాలి. దీన్ని ముఖానికి రాసి ఆరాక కడిగేయండి. ఇది నలుపుదనాన్ని తొలగించడంతోపాటూ చర్మాన్ని తాజాగా మార్చేస్తుంది.

ముడుతలు తగ్గుతాయి:
రోజ్ వాటర్ లో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి రోజ్ వాటర్ చుక్కలను చల్లటినీటిలో వేసి ముఖాన్ని కడగటం వల్ల వయసు కారణంగా వచ్చే ముడతలూ, వలయాలూ దరిచేరకుండా ఉంటాయని బ్యూటీషియన్లు చెబుతున్నారు.

శరీరం మీద మంచి వాసన:
శరీరం దుర్వాసనగా అనిపిస్తుంటే కొన్ని రోజ్ వాటర్ చుక్కలను శరీరానికి అప్లై చేయటం వల్ల దుర్వాసన తగ్గి, సువాసన వ్యాపిస్తుంది.



Click it and Unblock the Notifications











