Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
ఫిలింఫేర్ అవార్డ్స్ 2018 వేడుకలో రాకుమారిలా ప్రీతిజింటా
ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ - 2018 కార్యక్రమంలో బాలీవుడ్ నటి ప్రీతీ జింతా స్టైల్ చాలా డిఫరెంట్ స్టైల్ లో వేడుకకు వచ్చింది. రెడ్ కార్పెట్ పై తనదైన స్టైల్ లో సందడి చేసింది ప్రీతి జింతా.
ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ - 2018 కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. . ముంబయిలోని వర్లీలో తాజాగా జరిగిన వేడుకలకు బాలీవుడ్కు చెందిన అతిరథ మహారథులు హాజరై సందడి చేశారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ బాద్షా షారుఖ్ఖాన్, దర్శక నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించి సందడి చేశారు.

ప్రీతిజింటా స్టైల్ డిఫరెంట్
ఈ కార్యక్రమంలో ప్రజాదరణ పొందిన చిత్రాలు, నటులు, ఇతర విభాగాలకు అవార్డులు అందజేశారు. ఈ వేడుకలో సెలెబ్రిటీల సందడి అందరినీ ఆకట్టుకుంది. బాలీవుడ్ సెలెబ్రిటీలు తమదైన స్టైల్ లో ఈ అవార్డు వేడుకకు విచ్చేశారు. వారందరిలో, బాలీవుడ్ నటి ప్రీతీ జింతా స్టైల్ చాలా డిఫరెంట్ స్టైల్ లో వేడుకకు వచ్చింది. రెడ్ కార్పెట్ పై తనదైన స్టైల్ లో సందడి చేసింది ప్రీతి జింతా.

రాకుమారిలా
అందమైన ఫ్లోరల్ లేస్ ఎంబ్రాయిడరీ కలిగిన పౌడర్ పింక్ టుల్లే గౌన్ వేసుకుంది. ఈ స్ట్రాప్లెస్ గవున్ లో తన ప్యాలస్ నుంచి ఈ అవార్డు ఫంక్షన్ కి విచ్చేసిన అందమైన రాకుమార్తెలా కనిపించింది ప్రీతీ జింతా. తన అట్టైర్ కి తగిన యాక్ససరీస్ ని ధరించి కుందనపు బొమ్మలా మెరిసింది. చాలాకాలం తరువాత, ప్రీతీ మళ్ళీ ఇంత స్టన్నింగ్ గా కనిపించిందని అంటున్నారు ఆమె అభిమానులు.

విద్యాబాలన్
బెస్ట్ ఫీమేర్ యాక్టర్గా విద్యాబాలన్ అవార్డు అందుకున్నారు. 63వ జియో ఫిల్మ్ఫేర్ అవార్డు వేడుకలో ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేశారు. ‘తుమ్హారీ సులు'లో నటనకు గాను విద్యాబాలన్కు బెస్ట్ ఫీమేల్ యాక్టర్ అవార్డు వరించింది.

షారూక్ ఖాన్
ఈ అవార్డు వేడుకకు బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా రేఖ అవార్డును అందజేశారు. ‘బద్రీనాథ్కి దుల్హానియా'లో బెస్ట్ లీడింగ్ రోల్ చేసినందుకు అలియాభట్కూ, ‘మామ్' సినిమాలో నటనకుగాను శ్రీదేవికి ఈ అవార్డు దక్కింది. ఇంకా భూమి పెడ్నేకర్ (శుభ్ మంగళ్ సావ్ధాన్), సబా ఖమర్ (హిందీ మీడియం), జైరా వాసిమ్ (సీక్రెట్ సూపర్ స్టార్)లు కూడా ఎంపిక అయ్యారు.



Click it and Unblock the Notifications











