Latest Updates
-
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే
బ్రేక్ఫాస్ట్ మానేసి పండ్లే తింటున్నారా? లాభాలు, నష్టాలు తెలుసుకున్నాకే తినండి
ఉదయం పూట అల్పాహారం చేయడం, చేయకపోవడంపై భిన్నమైన వాదనలు వినిపిస్తుంటాయి. కొందరు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ చేయాలని అంటారు. మరికొందరేమో బరువు తగ్గడానికి అల్పాహారం మానేయాలని చెబుతుంటారు.
కొందరు ఉదయం అల్పాహారానికి బదులు ఆరోగ్యకరమైనవే కదా అని పండ్లు తినేస్తుంటారు. బ్రేక్ఫాస్ట్కు బదులు రకరకాల పండ్లు తినేస్తుంటారు. అయితే ఇలా అల్పాహారానికి బదులు పండ్లు తినడం వల్ల లాభాలు, నష్టాలూ రెండూ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అల్పాహారానికి బదులు పండ్లు తినడం వల్ల ప్రయోజనాలు:
పుష్కలమైన పోషకాలు:
పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే పండ్లు తినడం ద్వారా ఈ పోషకాలు శరీరానికి అందుతాయి.
హైడ్రేషన్:
పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. పండ్లు తినడం వల్ల శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవచ్చు. పండ్లలోని పోషకాలు జీర్ణక్రియకు తోడ్పడతాయి.
తక్కువ కేలరీలు:
పండ్లలో కేలరీలు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. బరువు తగ్గడానికి, ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయడానికి పండ్లు గొప్ప ఎంపిక.

అల్పాహారం తినకపోవడం వల్ల నష్టాలు:
తక్కువ శక్తి:
అల్పాహారం తినకపోవడం వల్ల కార్బోహైడ్రేట్లు శరీరానికి అందవు. శరీరానికి శక్తిని ఇవ్వడంలో వీటి పాత్ర కీలకం.
ఆకలి పెరుగుతుంది:
అల్పాహారం తినకపోవడం వల్ల రోజంతా ఆకలి వేస్తుంది. దీని వల్ల పగటిపూట ఎక్కువ తినడం, బరువు పెరగడం జరుగుతుంది.
పోషకాహార లోపం:
అల్పాహారం మానేయడం వల్ల పోషకాల లోపం ఏర్పడుతుంది. పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకుంటే, పండ్లలో పోషకాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, అవి సమతుల్య ఆహారంలా అన్ని పోషకాలను అందించలేవు.
బ్లడ్ షుగర్ లెవల్స్ పడిపోతాయి:
సరైన అల్పాహారంలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, ఫైబర్, కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ అన్నీ ఉంటాయి. రాత్రి దాదాపు 7-9 గంటల ఉపవాసాన్ని బ్రేక్ చేస్తుంది. నిద్రలేచిన తర్వాత చేసే మొదటి భోజనం వల్ల రోజంతా యాక్టివ్ గా ఉండొచ్చు. ఉదయం పూట అల్పాహారం మానేసి పండ్లు మాత్రమే తింటే, రక్తంలో చక్కెర స్థాయిలు స్వల్పంగా తగ్గుతాయి. ఎందుకంటే శరీరానికి పిండి పదార్థాల నుండి వచ్చే గ్లూకోజ్ రాదు కాబట్టి.
బరువు పెరగడానికి దారితీస్తుంది:
ఉదయంపూట అల్పాహారం తినడం మానేసి కేవలం పండ్లు మాత్రమే తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు పెరుగుతాయి. ఉదయం పూట పండ్లు మాత్రమే తినడం వల్ల రోజంతా ఆకలిగా అనిపిస్తుంది. దీని వల్ల పగటి పూట లేదా రాత్రి పూట ఎక్కువగా తినేస్తుంటారు.
మలబద్ధకం రావొచ్చు:
పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అయితే అల్పాహారాన్ని వదిలేసి కేవలం పండ్లు మాత్రమే తినడం వల్ల మలబద్ధకం రావొచ్చు. కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు కడుపులో పెద్ద మొత్తంలో ఏర్పడటానికి దారితీస్తాయి. దీని వల్ల మలబద్ధకం సమస్య తలెత్తుతుంది.
Disclaimer: ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications











