Just In
- 1 hr ago ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- 3 hrs ago ఈ 4 రాశులకు శుక్రుడు, రాహువు కలయిక గొప్ప ఫలితాలిస్తాయి, ఏప్రిల్లో డబ్బు వర్షం కురుస్తుంది
- 5 hrs ago First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- 8 hrs ago నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
పర్యావరణ కాలుష్యంతో షుగర్ వ్యాధి!
ముఖ్యంగా కాలుష్యం బారిన పడే పది సంవత్సరాల వయసులోపలి చిన్నపిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా వస్తోందని వెల్లడించారు. వాహనాలనుంచి వెలువడే కాలుష్యం.. అంటే ఇంధనం, రబ్బరు సంబంధిత కాలుష్య రేణువులు చిన్నపిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీంతో యుక్త వయస్సు చేరుకునేసరికి వారిలో స్థూలకాయం, టైప్ 2 డయాబెటీస్ వంటి సమస్యలు తలెత్తుతున్నాయంటున్నారు.
పరిశోధకులు కాలుష్యమయమైన ప్రాంతంలో నివాసముండే చిన్నపిల్లలపైనా, కాలుష్య రహిత ప్రాంతంలో నివాసముండే పిల్లలపైనా పరిశోధనలు నిర్వహించారు. కాలుష్యమయమైన ప్రాంతంలో ఉన్న పిల్లల్లో అధికబరువుతోపాటు మధుమేహం టైప్ 2 వ్యాధి సమస్యలు తలెత్తడం గుర్తించారు. ఇక కాలుష్య రహిత ప్రాంతంలో ఉన్న పిల్లల్లో ఆరోగ్యవంతమైన ఎదుగుదలను గమనించారు. పర్యావరణ కాలుష్యం అనేక రోగాలనే కాదు... శరీర బరువులో తేడా కూడా తీసుకురావడంపైనా ప్రభావం చూపుతుందని, దీని కారణంగా పిల్లలకు చిన్నతనంలోనే ఊబకాయం కలుగుతోందని తేల్చారు.