వెజిటబుల్స్ ఎన్ని సార్లు కడిగినా.... తొలగని క్రిములు!

By B N Sharma

Germs in Vegetables
రోజూ ఆహారంలో తీసుకునే కూరగాయల్లోనూ రోగకారక క్రిములు ఉన్నట్టు అమెరికా శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ఇటీవలికాలంలో ఐరోపా తదితర దేశాలను వణికించిన ఇ-కొలి, సల్మోనెలా క్రిములు కూరగాయల్లో తిష్టేసుకుని ఉన్నాయని వారు హెచ్చరిస్తున్నారు. కూరగాయలను ఎన్నిమార్లు నీళ్లల్లో కడిగినా ఈ క్రిములను తొలగించడం సాధ్యం కాదన్నది శాస్త్రవేత్తల వాదనగా ఉంది.

అంటువ్యాధులు సోకడానికి దారితీసే ఈ క్రిములు పరోక్షంగా ఇన్‌ఫెక్షన్‌ సోకడానికి మూలకారణం అవుతున్నాయని అమెరికాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయానికి చెందిన సెలవిస్తున్నారు. ఇ-కొలై కలిగించే దుష్ఫలితాలు ఎంతగా ఉంటాయో విదితమే.

ప్రధానంగా చిక్కుడుకాయ (బీన్స్) రకాల్లో ఈ ఇ-కొలై, వేరుశెనగకాయలో సల్మోనెలా ఉంటుందని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. మొక్కల్లో న్యూట్రిషన్లను రవాణా చేసే కణాల్లోనూ ఈ క్రిములు చొచ్చుకుపోగలుగుతాయని అధ్యయన సహ పరిశోధకుడు డాక్టర్‌ ఆమండ డీరింగ్‌ తెలిపారు.

ఈ అధ్యయనం తాలూకు కథనాన్ని ఫుడ్‌ ప్రొటెక్షన్‌, ఫుడ్‌ రీసెర్చ్‌ ఇంటర్నేషనల్‌ జర్నల్‌ తాజా సంచికలో ప్రచురించారు. కూరగాయ మొక్కల్లోకి చేరిన క్రిములను గుర్తించడం ఓ సవాల్‌గా మారింది. ఇలాంటి ప్రమాదకర క్రిములున్న కూరగాయలను వండి తినేముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలని వీరు తెలిపారు. క్రిములను హరించే ఉష్ణోగ్రతలో కూరలను వండాలని తెలిపారు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Monday, August 22, 2011, 12:47 [IST]
Desktop Bottom Promotion