Latest Updates
-
డేటింగ్ యాప్స్లో కొత్త రకం మోసం.. వీడియో కాల్ చేశారా? మీ పరువు గంగలో కలిసినట్టే! -
మోదీ, మెలోని క్రేజ్.. ఇంట్లోనే 10 నిమిషాల్లో మెలోడీ చాక్లెట్ ఎలా చేసుకోవాలంటే..! -
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. సేఫ్టీకి ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
Egg Burger: కొంచెం క్రంచీగా, మరింత సాఫ్టీగా.. చిన్నారుల కోసం స్పెషల్ ‘ఎగ్ బర్గర్’ -
బంగారం కూడా దీని ముందు పనికిరాదు..ప్రపంచంలో అత్యంత ఖరీదైన టీ ఇదే! -
ప్రేమ పేరుతో ప్రాణాలు తీసేంతలా మారాడా? హైదరాబాద్ స్పా హత్య వెనుక ఉన్న భయంకరమైన నిజం ఇదే! -
అచ్చం రెస్టారెంట్ రుచితో రిచ్ చికెన్ కోఫ్తా కర్రీ.. ఇలా చేస్తే ఇంట్లో వాళ్లు ఫిదా అవ్వాల్సిందే! -
బయట తిన్నదానికంటే టేస్టీగా వైట్ సాస్ పాస్తా ఇంట్లోనే..! ఈ ఒక్క తప్పు మాత్రం చేయొద్దు! -
International Tea Day: అలసిన శరీరానికి కప్పు ‘టీ’తో ఎనలేని ఉత్సాహం.. ‘చాయ్’ స్పెషల్ స్టోరీ.! -
బీహారీ స్టైల్ మామిడికాయ పచ్చడి..ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
శరీర లోపలి భాగాలు సహజంగా శుభ్రపడాలంటే!

నల్లని మిరియాలు - వీటికి యాంటీ సెప్టిక్ గుణం వుంది. శరీరంలోని విష పదార్ధాలను తొలగిస్తాయి.వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణవ్యవస్ధను కాపాడతాయి. వ్యాధులు రాకుండా చేస్తాయి. జీర్ణక్రియ మెరుగవుతుంది. డయోరియా వంటి వ్యాధులు నయమవుతాయి. ఫుడ్ పాయిజన్ జరిగితే మిరియం వాడండి. పొట్ట వ్యాధులకు ఇంటి చిట్కా.
వెల్లుల్లి - గుండె జబ్బుల రోగులకు మంచి పోషక సుగంధ ద్రవ్యం. వాసన వదిలేయండి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు చాలాబాగా పనిచేస్తాయి.శరీరలోపలి భాగాలు శుభ్రం చేయటమే కాక, ఈ వెల్లుల్లి కేన్సర్, ఇతర వ్యాధులు రాకుండా చేస్తుంది.
పసుపు - సాధారణంగా ఏ వంటకం చేసినా పసుపు వేస్తారు. వంటకం పసుపు రంగులో ఆకర్షణీయంగా కనపడుతుంది. పసుపు చర్మ కాంతిని మెరుగు చేస్తుంది. శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. కడుపులో మంట తగ్గించి జీర్ణక్రియ మెరుగుచేస్తుంది. వైరల్, ఫంగల్ వ్యాధులనుండి కాపాడుతుంది.
అల్లం - అల్లపు రసం జీర్ణక్రియకు ఒక టానిక్. శరీర లోపలిభాగాలను బాగా శుభ్రం చేస్తుంది. మంటను తగ్గిస్తుంది. యాంటాసిడ్ మరియు విరేచనాన్ని కలిగించే పదార్ధాలున్నాయి. అజీర్ణం తగ్గించాలంటే, చిన్న అల్లం ముక్క తింటే చాలు. పొట్టవ్యాధులు తగ్గిస్తుంది. తలనొప్పి తగ్గాలంటే, మీరు తాగే టీ లో కొద్దిపాటి అల్లం వేస్తే చాలు మంచి రిలీఫ్ వస్తుంది. జలుబు, దగ్గు వంటివి తగ్గాలంటే, వెల్లుల్లి తోకలిపి తింటే సత్వర ఫలితాలుంటాయి.
దాల్చిన చెక్క - మీరు తాగే టీలో లేదా తినే కూరల్లో దాల్చిన చెక్క వేస్తే, మంచి రుచి వస్తుంది. జీర్ణక్రియను బలపరుస్తుంది. దాల్చిన చెక్క పొడితో రక్తంలోని షుగర్ స్ధాయిలను కూడా నియంత్రించవచ్చు.
ఎర్ర మిర్చి లేదా కారం - ఇది తింటే మంట. ఎంతో వేడి చేస్తుంది. మంట తగ్గాలంటే నీరు తాగటమే మార్గం. శరీరంలోని మలినాలను తేలికగా విసర్జిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications