Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
భోజనం మధ్యలో నీరు తాగకండి!

మరి అసలు మన శరీరానికి తగినంత నీరు తాగుతున్నామా? అనే అంశం ఎలా తెలుసుకోవాలి? అందుకు సూచనగా మీకు దాహం వేస్తుంది. కనుక మీరు ఎంత దాహం భావిస్తున్నారనేది ముందుగా పరిశీలించుకోండి. అలాగని మీరు భోజనం చేసే సమయంలో గ్లాసులకొద్ది నీటిని తాగేయటం సరికాదు. నీరు ఆహారం తీసుకునేటపుడు తాగరాదు.
మన భారతీయులలో చాలామందికి భోజనం వద్ద పెద్ద చెంబు లేదా గ్లాసులతో నీరు పెట్టుకొని భోజనం మధ్యలో తాగే అలవాటు వుంది. ఈ రకంగా భోజనం మధ్యలో నీరు తాగితే, మీరు తినే ఆహారాన్ని అది కడిగేస్తుంది. ఇది చాలా చెడ్డ విధానమని గుర్తించండి. జీర్ణక్రియకు చెడు కలిగిస్తుంది. అజీర్ణం సమస్యలు కలిగిస్తుంది. మరిన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వుంటాయి. నీరు తాగితే పలుచనైన ఆ ఆహారాన్ని జీర్ణం చేయాలంటే, మీ పొట్టలో మరోమారు అవసరమైన జీర్ణరసాలు ఘాటుగా ఊరాలి. అందుకు సమయం పడుతుంది. కనుక తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు.
మన పొట్టలకు మనం ఆహారం ఎపుడు తింటామో అపుడు జీర్ణ రసాలను ఉత్పత్తి చేయాలనేది బాగా తెనలుసు. అదే సమయంలో మీరు నీరు తాగితే, మీరు అది ఉత్పత్తి చేసే జీర్ణ రసాలను మరింత పలుచబడేస్తున్నారు. కనుక అవి మీరు తినిన ఆహారాన్ని జీర్ణం చేసి చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టలేదు.
ఆహారం తీసుకునే సమయంలో కొద్దిపాటి నీరు తాగటం సరైనదే అయినప్పటికి, గ్లాసుడు నీరు తాగరాదని అది జీర్ణక్రియకు ఆటంకం అని రీసెర్చి చెపుతోంది. భోజనానికి ఒక గంట ముందుగా లేదా భోజనం తర్వాత రెండు గంటల తర్వాత తాగే నీరు జీర్ణక్రియకు సహకరించి పోషకాలు శరీరంలోని బాగా పీల్చేలా చేస్తాయని రీసెర్చర్లు కనుగొన్నారు.
భోజనం మధ్యలో తాగే నీరు మీ పేగు గోడలు పీల్చేసుకుంటాయి. అక్కడ ఊరే ఘాటైన యాసిడ్లు పలుచబడిపోతాయి. ఆహారం జీర్ణమయ్యేటందుకు అవసరమైన జీర్ణ రసాలు వుండవు. ఫలితంగా తిన్నది జీర్ణం కాక, మరోమారు వెలుపలికి కూడా వచ్చి గుండె, గొంతు మంటలను కలిగిస్తుంది. ఇన్సులిన్ స్ధాయిలు పెరిగి అవి మీ రక్తంలోకి వదలబడి, కొవ్వును పెంచుతాయి.
మరి భోజనం మద్యలో నీరు తాగకుండా వుండేందుకుగాను మీరు తినే ఆహారం మరింత ఉప్పగాను, లేదా కారంగాను లేకుండా చూడండి. నీరు అవసరపడని ఆహారంగా వుండాలి. త్వర త్వరగా తినకండి. మీరు ఆహారం మింగేస్తే నీరు అవసరం అవుతుంది. అందుకని బాగా నమిలి తినండి. ఎంత బాగా నమిలితే, అంతబాగా ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











