Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
భోజనం మధ్యలో నీరు తాగకండి!

మరి అసలు మన శరీరానికి తగినంత నీరు తాగుతున్నామా? అనే అంశం ఎలా తెలుసుకోవాలి? అందుకు సూచనగా మీకు దాహం వేస్తుంది. కనుక మీరు ఎంత దాహం భావిస్తున్నారనేది ముందుగా పరిశీలించుకోండి. అలాగని మీరు భోజనం చేసే సమయంలో గ్లాసులకొద్ది నీటిని తాగేయటం సరికాదు. నీరు ఆహారం తీసుకునేటపుడు తాగరాదు.
మన భారతీయులలో చాలామందికి భోజనం వద్ద పెద్ద చెంబు లేదా గ్లాసులతో నీరు పెట్టుకొని భోజనం మధ్యలో తాగే అలవాటు వుంది. ఈ రకంగా భోజనం మధ్యలో నీరు తాగితే, మీరు తినే ఆహారాన్ని అది కడిగేస్తుంది. ఇది చాలా చెడ్డ విధానమని గుర్తించండి. జీర్ణక్రియకు చెడు కలిగిస్తుంది. అజీర్ణం సమస్యలు కలిగిస్తుంది. మరిన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వుంటాయి. నీరు తాగితే పలుచనైన ఆ ఆహారాన్ని జీర్ణం చేయాలంటే, మీ పొట్టలో మరోమారు అవసరమైన జీర్ణరసాలు ఘాటుగా ఊరాలి. అందుకు సమయం పడుతుంది. కనుక తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు.
మన పొట్టలకు మనం ఆహారం ఎపుడు తింటామో అపుడు జీర్ణ రసాలను ఉత్పత్తి చేయాలనేది బాగా తెనలుసు. అదే సమయంలో మీరు నీరు తాగితే, మీరు అది ఉత్పత్తి చేసే జీర్ణ రసాలను మరింత పలుచబడేస్తున్నారు. కనుక అవి మీరు తినిన ఆహారాన్ని జీర్ణం చేసి చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టలేదు.
ఆహారం తీసుకునే సమయంలో కొద్దిపాటి నీరు తాగటం సరైనదే అయినప్పటికి, గ్లాసుడు నీరు తాగరాదని అది జీర్ణక్రియకు ఆటంకం అని రీసెర్చి చెపుతోంది. భోజనానికి ఒక గంట ముందుగా లేదా భోజనం తర్వాత రెండు గంటల తర్వాత తాగే నీరు జీర్ణక్రియకు సహకరించి పోషకాలు శరీరంలోని బాగా పీల్చేలా చేస్తాయని రీసెర్చర్లు కనుగొన్నారు.
భోజనం మధ్యలో తాగే నీరు మీ పేగు గోడలు పీల్చేసుకుంటాయి. అక్కడ ఊరే ఘాటైన యాసిడ్లు పలుచబడిపోతాయి. ఆహారం జీర్ణమయ్యేటందుకు అవసరమైన జీర్ణ రసాలు వుండవు. ఫలితంగా తిన్నది జీర్ణం కాక, మరోమారు వెలుపలికి కూడా వచ్చి గుండె, గొంతు మంటలను కలిగిస్తుంది. ఇన్సులిన్ స్ధాయిలు పెరిగి అవి మీ రక్తంలోకి వదలబడి, కొవ్వును పెంచుతాయి.
మరి భోజనం మద్యలో నీరు తాగకుండా వుండేందుకుగాను మీరు తినే ఆహారం మరింత ఉప్పగాను, లేదా కారంగాను లేకుండా చూడండి. నీరు అవసరపడని ఆహారంగా వుండాలి. త్వర త్వరగా తినకండి. మీరు ఆహారం మింగేస్తే నీరు అవసరం అవుతుంది. అందుకని బాగా నమిలి తినండి. ఎంత బాగా నమిలితే, అంతబాగా ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications