పండ్లు తినే విధానం ఎలా?

By B N Sharma

The Right Way to Eat Fruits!
చాలామంది పండ్లను ఎపుడు పడితే అపుడు, ఎలా పడితే అలా తినేస్తూ వుంటారు. స్ట్రాబెర్రీలు తినేస్తారు. వెంటనే పెరుగు తింటారు లేదా డిన్నర్ చేస్తారు. లేదా మాంసంతో కలిపి పుచ్చకాయ వంటిది తినేస్తారు. పండ్లను తరచుగా తినటం సరిపోతుందా? లేక అవి తినటానికి ఏదైనా ఒక పద్ధతి వుందా? భోజనం తర్వాత పండ్లు తినవచ్చా? మొదలైన ప్రశ్నలకు పోషకాహార నిపుణులు కొన్ని సూచనలు ఇచ్చారు అవి ఏమిటి? మరి పండ్లు ఎలా తింటే మీకు పూర్తి ఫలితాలనిస్తాయి అనేది పరిశీలించండి.


పండ్లు నేను ఎపుడు తినాలి? పండ్లను తినటానికి మంచి సమయం అంటే, ఉదయం వేళ ఒక గ్లాసు నీరు తాగిన తర్వాత. పండ్లను భోజనం తర్వాత తినటమనేది సరియైనదికాదు. భోజనం తర్వాత వెంటనే తింటే అవి సరిగా జీర్ణం కావు. వాటిలోని పోషకాలు సరిగా జీర్ణవ్యవస్ధ చే పీల్చబడవు.
మీ భోజనానికి ఒక పండు తినటానికి కనీసం 30 నిమిషాల వ్యవధి వుండాలి. లేదా భోజనానికి ఒక గంట ముందు లేదా ఎసిడిటీ, డయాబెటీస్ వంటి సమస్యలున్నవారైతే భోజనం తర్వాత రెండు గంటలకు తినాలి. ఎందుకంటే డయాబెటీస్ తో కొన్ని జీర్ణ క్రియ సమస్యలుంటాయి.

నేను పండ్లను ఇతర ఆహారాలతో కలిపి తినవచ్చా? అజీర్ణం లేదా ఎసిడిటీ వంటివి లేకుంటే మీరు పండ్లను పెరుగు తో కలుపుకొని తినవచ్చు. పైన్ ఆపిల్, ఆరెంజ్, పుచ్చకాయ, దానిమ్మ వంటివి పెరుగుతో మీరిష్టపడితే, తప్పక తినవచ్చు. బెర్రీలు, డ్రై ఫ్రూట్స్ కూడా పెరుగుతో తినవచ్చు. సాధారణంగా ఇతర ఉడికించిన ఆహారాలకంటే కూడా పండ్లు త్వరగా జీర్ణం అయిపోతాయి. వీలైనంతవరకు పండ్లను ఉడికించిన ఆహారాలమధ్య తినరాదు.

పండ్లు ఎంత తాజాగా వుండాలి? అరటిపండు మూడు రోజులలోపు, ఆపిల్ ఒక వారంలోపు, రేగిపండు అయిదు లేదా ఆరు రోజులు, బొప్పాయి, పండిన రెండు లేదా మూడు రోజులలోపు, సపోటాలు పండిన రెండు రోజులలోపు తినాలి. ఇతర పండ్లు, చాలావరకు మూడు రోజులవరకు రిఫ్రిజిరేటర్ లో పెట్టుకొని తినవచ్చు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Tuesday, April 24, 2012, 8:54 [IST]
Desktop Bottom Promotion