Latest Updates
-
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
నెలసరి సమయంలో ఇబ్బందులా? మీ భార్యతో ఇలా చేయించండి, కడుపునొప్పి, రక్తస్త్రావాన్ని తగ్గించే చిట్కాలు
చాలామంది మహిళలు పీరియడ్స్ సమయంలో బాగా కడుపునొప్పితో ఇబ్బందిపడుతుంటారు. ఆ నొప్పి తట్టుకోలేకపోతారు. నొప్పి తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తారు.
నెలసరి ఆడవాళ్ల సమస్య.. మగవాళ్లకు దాంతో అస్సలు సంబంధం లేదనుకోకండి. మగాళ్లు కూడా ఆడవాళ్లు పీరియడ్స్ లో పడే ఇబ్బందుల గురించి తెలుసుకోవాలి. ప్రతి భార్య పీరియడ్స్ సమయంలో తన భర్త నుంచి కాసింత ప్రేమను కోరుకుంటుంది.
ఆ సమయంలో తనకు కాస్త ఉపశమనం కలిగేలా కాస్త నిమ్మకాయ నీరు తాగించి తనను తనను ఒడిలో పడుకోబెట్టుకోవాలని కోరుకుంటుంది. అందుకే ప్రతి భర్త నెలసరి సమయంలో భార్య ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కనీసం కొన్ని జాగ్రత్తలు అయినా తెలుసుకోవాలి. ఆమెకు సూచించాలి.

పీరియడ్స్ సమయంలో
చాలామంది మహిళలు పీరియడ్స్ సమయంలో బాగా కడుపునొప్పితో ఇబ్బందిపడుతుంటారు. ఆ నొప్పి తట్టుకోలేకపోతారు. నొప్పి తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తారు.

కొన్ని రకాల టీలు తాగితే
అయితే ఆ సమయంలో మహిళలు కొన్ని రకాల టీలు తాగితే తక్షణమే ఉపశమనం లభిస్తుంది. జింజర్ టీ, యాలకుల టీ, లెమన్ లేదా గ్రీన్ టీతో ఏదైనా హెర్బల్ టీ తాగితే చాలా ఉపశనమనం కలుగుతుంది.

కాఫీ ఎట్టి పరిస్థితుల్లోనూ తాగరాదు
అయితే పీరియడ్స్ అప్పుడు కాఫీ ఎట్టి పరిస్థితుల్లోనూ తాగరాదు. అలాగే ఈ సమయంలో కనీసం పది గ్లాసుల నీరు తాగాలి. అల్లం తయారు చేసే పదార్థాలు తీసుకుంటే మంచిది. అల్లంతో తయారు చేసిన టీ తాగడం చాలా మంచిది.

ఆసనాలు
ఇక రక్తస్రావం అధికంగా అయ్యే మహిళలు రోజూ కొన్ని రకాల ఆసనాలు వేస్తూ ఉండడడం మంచిది. గుప్త పద్మాసనం బాగా పని చేస్తుంది.

పద్మాసనం
పద్మాసనంలో కూర్చుని బాడీని కాస్త పైకి లేపాలి. తర్వాత కాస్త ముందుకు జరగాలి. బాడీని పైకి లేపి ముందుకు అలాగే పడుకోవాలి. హ్యాండ్స్ ను వీపు మీదకు తీసుకెళ్లాలి.

ధనురాసనం
ధనురాసనం కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ రెండు ఆసనాలు క్రమంగా వేస్తే పీరియడ్స్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. పీరియడ్స్ కూడా సక్రమంగా వస్తాయి. ఆ సమయంలో పెయిన్ కూడా కాస్త తగ్గుముఖం పడుతుంది.



Click it and Unblock the Notifications











