Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
ఉదయం అల్పాహారం ఎక్కువగా తీసుకుంటే, నాజూకుగా తయారయ్యే అవకాశాలు ఎక్కువ!
మీ నడుము చుట్టూ ఉన్న కొవ్వు ని కరిగించాలని మీరు అనుకుంటున్నారా ? అలా అయితే మీరు ప్రొదున్నే తీసుకునే ఆహారం, మిగతా రోజులో తీసుకునే ఆహరం కంటే ఎక్కువగా తీసుకోగలిగితే మీ శరీర బరువుని తగ్గించుకొని, మీ శరీరాకృతిని మీకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు. ఒక అధ్యయనం ప్రకారం, ఒక రోజులో ఎవరైతే మూడు సార్లు కంటే ఎక్కువగా ఆహారం తీసుకుంటారో, రాత్రిపూట తినే భోజనం మిగతా రోజులో తీసుకునే ఆహారం కంటే ఎక్కువగా ఉంటుందో, అలాంటి వ్యక్తుల యొక్క శరీరతత్వం ఉండవలసిన దానికంటే అధికంగా ఉంటుంది. అంతే కాకుండా ఇలాంటి వ్యక్తులు అనేక రకాలైన వ్యాధుల భారినపడే అవకాశం ఎక్కువ.

ప్రొదున్నే అల్పాహారం తీసుకోవడం, మధ్యాహ్నం భోజనం చేయడం, రాత్రిపూట భోజనం అస్సలు చేయకపోవడం, చిరు తిండ్లకు దూరంగా ఉండటం, ప్రొదున్నపూట అల్పాహారం ఎక్కువ తీసుకోవడం మరియు రాత్రిపూట భోజనం చేయకుండా 18 గంటల పాటు ఉపవాసం ఉండటం అనే ఈ చర్య బరువు నిర్వహణ వ్యూహంలో ఒక భాగం అని చెబుతున్నారు కాలిఫోర్నియా లోని ఒక విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు.
వీళ్ళు చెప్పేది పురాతన కాలంలో చెప్పిన సామెతను నిజం చేస్తుంది. అదేమిటంటే " ఒక రాజులాగా ప్రొదున్న అల్పాహారం తీసుకో, ఒక రాకుమారుడులాగా మధ్యాహ్నం భోజనం చేయి, రాత్రిపూట ఒక బిచ్చగాడిలా భుజించు ."
ఈ అధ్యయనంలో దాదాపు 50 వేల మంది పాల్గొన్నారు.

ఈ అధ్యయనంలో పాల్గొన్న వ్యక్తుల భోజనం తీసుకునే క్రమం ఎలా ఉన్నా, సగటున వారి యొక్క వయస్సు 60 సంవత్సరాలు చేరే వరకు ప్రతి సంవత్సరం వారి బరువు పెరుగుతూనే ఉంది. 60 యేళ్లు దాటిన తర్వాత వాళ్ళ బరువు సంవత్సర సంవత్సరానికి తగ్గిపోతోంది అనే విషయాన్ని అధ్యయనంలో గుర్తించారు.
60 యేళ్ళ కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు ప్రొదున్నపూట తీసుకునే ఆహరం వల్ల బరువు పెరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని గుర్తించారు. ఇదే విషయమై, 60 సంవత్సరాలు దాటిన వారిని గనుక గమనిస్తే సగటున కోల్పోయే బరువు కంటే కూడా ఎక్కువ బరువును కోల్పోతున్నారు.
"కొన్ని సంవత్సరాలు ఈ మొత్తం ప్రభావం అనేది ఇలానే ఉండటం చాలా ముఖ్యం" అని చెబుతున్నారు పరిశోధకులు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications