Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్నెస్పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
సీసాలలో దొరికిన వింత, రహస్య సందేశాలు!
ప్రపంచంలో ఎవరో ఒకరు చదువుతారనే నమ్మకంతో. జనాలు కాగితం మీద సందేశాలు రాసి సీసాల్లో పెట్టి సముద్రంలో కి విసిరేసేవారు సీసా దొరికి అందులో సందేశాలు చదివి జీవితాలు అనుకూలంగా మారిన వాళ్ళు అద్రుష్టవంతులే ,కానీ కొన్ని సార్లు చదివిన సందేశాలు కొందరిని జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి.
పంపిన సందేశాలు అన్ని చాలావరకు నిజాలే అయినప్పటికీ కొన్ని సరదాకి కూడా పంపిస్తారు. సీసాలో కనిపించే సందేశాలు మంచి వార్తలు లేక చెడు వార్తలే కాకుండా కొన్ని చివరి దాక ఉండే ప్రేమ, స్నేహం లాంటి భావాలు ప్రకటించేవి కూడా ఉంటాయి. అవి ఆశ్చర్యాన్ని, ఆసక్తిని కలిగిస్తాయి.
కనుక గతంలో సీసాలో దొరికిన కొన్ని సందేశాలని మేము ఇక్కడ పంచుకోడానికి వచ్చాం,ఈ కింద చదవండి.....

టైటానిక్ నుంచి సందేశం:
టైటానిక్ నుంచి సందేశాలు పంపేంత సమయం కానీ సమయస్పూర్తి కానీ ఉందా, అని చాలామంది ఆశ్చర్యపోతారు.ఈ మధ్య కాలంలో,బోస్టన్ లో ఉన్న తన కుటుంబాన్ని కలవడానికి తన చెల్లి తో ప్రయాణించిన ఒక యువ ఐరిష్ దేశస్తుడు చావు బ్రతుకుల మధ్య రాసిన సందేశం దొరికింది.తను ఇంటికి చేరుకోలేకపోవడం వల్ల ఆ సందేశం మునిగిపోయిన పడవలోనే ఉంది. ఆ సందేశం ఎంటంటే:
"టైటానిక్ నుంచి, అందరికి వీడుకోలు,బుర్కే ఆఫ్ గ్లాన్మిర్ , కార్క్."
మునిగిపోతున్న నావ నుంచి వచ్చిన సందేశం..
ఆయనకి,కాగితం మీద రాసి,దాని భద్రంగా చుట్టి, సీసాలో పెట్టి సముద్రంలో సరిగ్గా పడేయడానికి సరిపోయేంత సమయం లేదని గ్రహించాడు.అందుకే ఈ సందేశం అసంపూర్ణం గా ఉంది.
"డెక్ మీద కొందరు మనుషులతో ఉన్నా. చివరాఖరి పడవలు మాత్రమే ఉన్నాయి.చాలా తొందరగా మునిగిపోతున్నాము.నా దగ్గర ఉన్న కొందరు మనుషులు దేవుడ్ని ప్రార్ధిస్తున్నారు.అంతం దగ్గర పడింది.బహుశ ఈ సందేశం..."

అప్రసిద్ధమైన నాజి కాన్సెంట్రేషన్ కాంప్ నుంచి దొరికిన సీసా
కొన్ని సందేశాలు పొందుపరిచి ఉన్న సీసాలు నీళ్ళలోనే కాకుండా నేల మీద కూడా దొరికాయి.ఒక సందేశం ఉన్న సీసా సెప్టెంబర్ 9,1944 న రాయబడి ఉంటే, 2009 లో కనుగొన్నారు.అది ఒక అసహాయంగా ఉన్న క్యాంప్ వ్యక్తి , 7 పురుషుల బందీల గుడారాల సంఖ్యలు మరియు వారి సొంత ఊర్ల వివరాలు రాసాడు.

ఆఖరి సందేశం:
థామస్ హ్యూజ్స్ అనే ఒక యువ బ్రిటీష్ సైనికుడు విధిలో ఉండగా తన భార్య కి ఎంతో అందమైన సందేశం రాసాడు.అది అతను సముద్రంలో కి విసిరేసాడు కానీ,తన భార్య కి మాత్రం చేరలేదు.

థామస్ ఈ సందేశం రాసిన రెండు రోజులకే చనిపోయాడు.ఆ సందేశం ఏంటంటే :
"ప్రియమైన భార్యకి, నేను ఈ సందేశం నీకు చేరుతుందో లేదో చూడటానికి ముందే దీన్ని సముద్రంలో పడేస్తున్నాను.ఇది కనుక చేరితే,ఈ లేఖ కుడి చివర భాగంలో నీ పేరు, ఇది చేరిన తేది, నీ సంతకం చేసి పొందుపర్చుకో . ఇప్పటికి సెలవు ప్రియా..నీ భర్త."

రోదిస్తున్న తల్లి ఇచ్చిన సందేశం:
"మౌరీస్" అనే యువతి తన పదమూడేళ్ళ కొడుకుని పోగుట్టుకుంది.ఆ భాధని అధిగమించడానికి, ఆమె ఒక సందేశం రాసి, సముద్రంలో పడేసింది.ఆ సందేశం ఏమిటంటే:
"నీ అదృశ్యం తో నాకు కలిగిన కోపానికి నన్ను క్షమించు.నేను ఇంక ఏదో తప్పు జరిగి ఉంటుందనే నమ్ముతున్నాను. దాన్ని దేవుడు సరి చేసేదాకా నిరీక్షిస్తూ ఉంటాను...నిన్ను చావు నుంచి ఎలా కాపాడుకోవాలో తెలియనందుకు నన్ను క్షమించు.నువ్వు నా చేతుల నుంచి జారిపోతున్నపుడు ఏం మాట్లాడాలో తెలియనందుకు నన్ను క్షమించు."



Click it and Unblock the Notifications