Latest Updates
-
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు! -
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్లో పడిపోతారు.! -
త్వరగా ప్రెగ్నెన్నీ రావాలంటే..భార్యాభర్తలు తప్పక తినాల్సిన ఫ్రూట్ ఏది? -
వర్షాకాలంలో ఇంట్లో ఆ వాసన పోవాలంటే.. ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి.!
మన కరెన్సీ నోట్ల పై గాంధీజీ బొమ్మ ఉండటం వెనుక అసలు కారణం ఇదే...!
మీకెప్పుడైనా మన కరెన్సీ నోట్ల పై గాంధీజీ బొమ్మ ఎందుకు ఉంది అనే అనుమానం వచ్చిందా ? గాంధీజీ బొమ్మను మాత్రమే అన్ని నోట్ల పై ఎందుకు ముద్రించారో తెలుసా ?
దాని వెనుక ఓ చరిత్ర దాగి ఉంది. అసలు గాంధీజీ బొమ్మనే అన్ని కరెన్సీ నోట్ల పై ఎందుకు ముద్రించ వలసి వచ్చింది. అది కూడా గాంధీ నవ్వుతున్న ఆ ఒక్క బోమ్మనే ఎందుకు ముద్రించారో ఇప్పుడు తెలుసుకుందాం.
అసలు కల్మషం అనేదే లేకుండా ఎంతో స్వచ్ఛమైన మనస్సుతో నవ్వుతున్న ఆ గాంధీ బొమ్మ ఎక్కడి నుండి వచ్చిందో తెలిస్తే మీరు నిజం గా ఆశ్చర్య పోతారు. ఒక సరైన ప్రయోజనం కోసం, అంత పరిపూర్ణంగా, ఎంతో ముగ్దమనోహరంగా ఉన్న గాంధీ బొమ్మ ఎలా లభించింది?
గాంధీజీ వి ఎన్నో బొమ్మలు ఉండగా , ఆ ఒక్క బొమ్మని ఎందుకు అన్ని కరెన్సీ నోట్ల పై వాడుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆ ఫోటోను ఎవరు తీశారంటే :
1946 వ సంవత్సరంలో ఒక గుర్తు తెలియని ఫోటోగ్రాఫర్ గాంధీ గారి బొమ్మని తన కెమెరా లో బంధించాడు. కోల్ కత్తా లోని వైస్రాయ్ భవంతి లో, అప్పట్లో బ్రిటీష్ సెక్రటరీ అయిన లార్డ్ పతిక్ లారెన్స్ అనే వ్యక్తిని మహాత్మా గాంధీ 1946 వ సంవత్సరంలో కలవడానికి వెళ్లారు. ఆ సమయంలో ఈ ఫోటో తీసారట.
Image Source

ఆ చిత్రం గురించి మరిన్ని విశేషాలు :
ఆ ప్రత్యేక చిత్రాన్ని ఒకప్పుడు, అంటే 1946 లో వైస్రాయ్ భవనం గా ప్రసిద్ధి గాంచిన ప్రదేశం నుండి తీసుకున్నారు. దానినే ఇప్పుడు రాష్ట్రపతి భవనంగా పరిగణిస్తున్నాం. ఈ ఇతిహాస గాంధీ చిత్రాన్ని మన కరెన్సీ నోట్ల పై ముద్రించడానికి అనుగుణంగా మార్చుకొని మన నోట్ల పై ముద్రించడం ప్రారంభించారు.
Image Source

ఆ ప్రతిబింబ చిత్రాన్ని మొదట అప్పుడు వాడారు :
మహాత్మా గాంధీ యొక్క అసలు బొమ్మకు ప్రతిబింబ చిత్రాన్ని 1987 లో ముద్రించిన ఐదు వందల రూపాయల నోట్ల పై మొట్ట మొదటి సారిగా వాడారు. ఆ నోట్ల పై గాంధీ జీ చిత్రాన్ని నీటిగుర్తు గా వాడారు. ఆ నోట్లని గాంధీ శ్రేణి నోట్ల గా పిలవడం ప్రారంభించారు.

1996 లో నోట్లు రూపాంతరం చెందాయి :
గాంధీ జీ బొమ్మని ముద్రించబడ్డ కరెన్సీ నోట్లు 1996 వ సంవత్సరం నుండి చలామణిలోకి వచ్చాయి. అంతక ముందు నోట్ల పై అశోక స్తంభాన్ని ముద్రించేవారు. రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా నోట్లను రూపాంతరం చేయాలని భావించి ఇక అప్పటి నుండి ఐదు రూపాయల నోటు మొదలు కొని వెయ్యి రూపాయిల నోటు వరకు గాంధీ జీ చిత్రాన్ని వ్యాపార చిహ్నంగా ముద్రించడం ప్రారంభించింది.
ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు గాంధీ జీ చిత్రాన్ని అన్ని భారతీయ కరెన్సీ నోట్ల పై ముద్రించ బడుతూనే ఉంది.



Click it and Unblock the Notifications