Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఆంధ్రప్రదేశ్లో తప్పక చూడాల్సిన 5 బౌద్ధ వారసత్వ ప్రదేశాలు
ఆంధ్రప్రదేశ్లో బౌద్ధ మత ఆనవాళ్లు చాలా చోట్ల కనిపిస్తాయి. 5 ముఖ్యమైన బౌద్ధ వారసత్వ ప్రదేశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశం అనగానే గుర్తుకువచ్చేది భిన్నత్వంలో ఏకత్వం. ఇక్కడ ఎన్నో మతాలు, కులాలు ఉంటాయి. అందరూ కలిసిమెలిసి జీవిస్తుంటారు. ఎన్నో రకాల సంస్కృతులు, సాంప్రదాయాలు, వేష భాషలు భారత దేశంలో ఉంటాయి. భారత్లో అనేక మతాలకు స్థానం ఉంది. వాటిలో ఒకటి బౌద్ధమతం. ఒడిశా బౌద్ధమతానికి జన్మస్థలం కావడంతో దాని సరిహద్దు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, మత ప్రభావం యొక్క చరిత్ర ఆంధ్రప్రదేశ్లోనూ కనిపిస్తుంది.

బౌద్ధమతం ఆంధ్రప్రదేశ్లో 2 వేల సంవత్సరాలకు పైగా ఉందని చెబుతారు. చారిత్రక ఆనవాళ్లు 400BC నాటివి. అనేక బౌద్ధ వారసత్వ ప్రదేశాలు ఈనాటికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. బౌద్ధమతం చుట్టూ ఉన్న జీవితం మరియు సంస్కృతికి ఒక దృక్పథాన్ని అందిస్తాయి.
ఆంధ్రప్రదేశ్లో బౌద్ధ మత ఆనవాళ్లు చాలా చోట్ల కనిపిస్తాయి. 5 ముఖ్యమైన బౌద్ధ వారసత్వ ప్రదేశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అమరావతి:
అమరావతి అనగానే బౌద్ధమతం మదిలో మెదులుతుంది. ఇక్కడ ఉన్న స్తూపం, మఠం అశోకుని పాలనలో నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు. ఆ సమయంలో బౌద్ధులకు తీర్థయాత్రగా పవిత్ర అభ్యాసం కోసం ఈ ప్రదేశాన్ని ఉపయోగించేవారని చరిత్ర చెబుతోంది. బ్రిటీష్ పాలనలో ఇక్కడి నుండి ఎన్నో కళాఖండాలు, చారిత్రక సంపదను బ్రిటన్లోని మ్యూజియాలకు తరలించారని చరిత్ర కారులు చెబుతారు. అమరావతి విజయవాడకు అతిసమీపంలో ఉంటుంది. కేవలం 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

గుంటుపల్లి:
గుంటుపల్లి వద్ద ఉన్న గుహ స్మారక చిహ్నాలు మహారాష్ట్రలోని అజంతా మరియు ఎల్లోరా గుహలక కంటే పూరాతమైనవని చరిత్రకారులు భావిస్తున్నారు. 2వ లేదా 3వ శతాబ్దపు నాటివని నమ్ముతున్నారు. ప్రసిద్ధ భారతీయ తత్వవేత్త ఈ గుహల్లో ధ్యానం చేసినట్లు చెబుతారు. గుంటుపల్లి విజయవాడకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

కొడవలి:
(image:Wikimediacommons)
కొడవలిలో లభించిన చారిత్రక ఆనవాళ్లు 2,300 సంవత్సరాల క్రితం నాటవని తేలింది. కొడవలి బౌద్ధమతం యొక్క స్వర్ణ యుగాన్ని గుర్తు చేస్తుంది. కొడవలి ప్రాంతాన్ని 1880లో రాబర్ట్ సెవెల్ అలెగ్జాండర రియా కనుగొన్నట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడ బ్రాహ్మీ లిపిలో బౌద్ధ శిలా శాసనం మొదట కనుగొనబడింది. ఈ శాసనం 2వ శతాబ్దపు క్రీస్తు శకం నాటిదని నమ్ముతారు. విశాఖపట్నానికి కొడవలి 128 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

కొత్తూరు:
కొత్తూరులో బౌద్ధ స్తూపాలి, రాతి గుహలు ఉన్నాయి. కొత్తూరు ప్రాంతం శారదా నది ఒడ్డున కొలువై ఉంటుంది. ఇక్కడ జరిగిన తవ్వకాల్లో బౌద్ధ మతానికి చెందిన అనేక ఆనవాళ్లు బయట పడ్డాయి. ఈ ప్రాంతంలో తవ్వకాలు ఇంకా కొనసాగుతున్నాయి. చాలా బౌద్ధమత ఆనవాళ్లను కనుగొంటున్నారు. ఈ ప్రదేశంలోని రాతి గుహలను 1వ శతాబ్దం BC నాటి బౌద్ధ సన్యాసులు ఉపయోగించారని నమ్ముతారు. కొత్తూరు విశాఖపట్నానికి 179 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

సాలిహుండం:
(image:quora)
వంశధార నదికి దక్షిణ ఒడ్డున కుడివైపున ఉన్న కొండపై ఉంటుంది. సాలిహుండంలో బయటపడిన ఆనవాళ్లు 2వ శతాబ్దం AD నాటివని తేలింది. ఈ ప్రాంతాన్ని 1919వ సంవత్సరంలో గిగుడు వెంకటరామ మూర్తి కనుగొన్నట్లు చరిత్ర చెబుతోంది. సాలిహుండం అనేక శతాబ్దాలుగా ఉనికిలో ఉంది. సాలిహుండంలో బౌద్ధ మత మ్యూజియం ఉంటుంది. ఇందులో అనేక కళాఖండాలు ఉన్నాయి. సాలిహుండం ప్రాంతం విశాఖపట్నానికి 139 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.



Click it and Unblock the Notifications











