Just In
- 58 min ago వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- 1 hr ago ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- 2 hrs ago శనిదేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండే రాశులు ఇవే.. మీది కూడా ఈ రాశేనా..?
- 3 hrs ago ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
ఇండియన్ కరెన్సీ గురించి మీకు తెలియని కొన్ని సర్ ప్రైజింగ్ విషయాలు..!!
ప్రపంచం మొత్తాన్ని పచ్చనోటు పరుగులు పెట్టిస్తోంది. ఏదైనా నాతోనే అంటూ సవాల్ చేస్తోంది. అయితే ప్రతిదేశ కరెన్సీకి ఓ ప్రత్యేకత ఉంటుంది. దాని పుట్టుక, చలామణి వెనుక ఓక్కో దేశానికి ఒక్కో స్టోరీ ఉంటుంది.
మనదేశ కరెన్సీ విషయానికి వస్తే చాలా ప్రత్యేకతలున్నాయ్.. పాక్ తో మన కరెన్సీ సంబంధం, డాలర్ కన్నా ది బెటర్ స్టేజ్ లో ఉన్న మన రూపాయి గతం ఇలా అన్నింట్లో స్పెషాలిటీ ఉంది మన కరెన్సీకి.
ఇండియన్ కరెన్సీ గురించి కొన్ని ఆశ్చర్యకర విషయాలు..!
5000 మరియు 10,000 రూపాయల నోట్లు మనదేశంలో 1954 నుండి 1978 మధ్య కాలంలో వినియోగంలో ఉండేవి.
ఇండియన్ కరెన్సీ గురించి కొన్ని ఆశ్చర్యకర విషయాలు..!
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పాకిస్థాన్ దేశం, భారత నోట్లపై పాకిస్థాన్ స్టాంప్ ముద్రించుకొని, ఆ నోట్లనే ఉపయోగించేవారు.
ఇండియన్ కరెన్సీ గురించి కొన్ని ఆశ్చర్యకర విషయాలు..!
500 మరియు 1000 నోట్లు నేపాల్ లో నిషేధించబడ్డాయి.
ఇండియన్ కరెన్సీ గురించి కొన్ని ఆశ్చర్యకర విషయాలు..!
ఒకానొక సమయంలో 5 రూపాయల నాణేలను, బంగ్లాదేశ్ కు దొంగతనంగా రవాణా చేస్తూ క్షవరం చేసుకునే కత్తెరల తయారీకి వాడేవారట.
ఇండియన్ కరెన్సీ గురించి కొన్ని ఆశ్చర్యకర విషయాలు..!
10 రూపాయల నాణెం నమూనా చేయడానికి అయ్యే ఖర్చు రూ.6.10 పైసలు
ఇండియన్ కరెన్సీ గురించి కొన్ని ఆశ్చర్యకర విషయాలు..!
1917 లో డాలర్ కన్నా మన రూపాయికే విలువ ఎక్కువ. అప్పుడు 1 రూపాయి 13 డాలర్లతో సమానం.
ఇండియన్ కరెన్సీ గురించి కొన్ని ఆశ్చర్యకర విషయాలు..!
చాలావరకు నోట్లపై మనదేశానికి సంబంధించిన వాటినే ముద్రిస్తారు. ఒక్క రూ.20 నోటుపైనే అండమాన్ దీవుల ఆకారం ముద్రింపబడి ఉంటుంది.
ఇండియన్ కరెన్సీ గురించి కొన్ని ఆశ్చర్యకర విషయాలు..!
మీ దగ్గర ఉన్న నోటు చినిగిపోయి ఉంటే, ఆ నోటును బ్యాంక్ లో ఇస్తే కొత్త నోటును బ్యాంక్ అధికారులు తిరిగి ఇస్తారు.
ఇండియన్ కరెన్సీ గురించి కొన్ని ఆశ్చర్యకర విషయాలు..!
సున్నా నోట్లను నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, అవినీతికి వ్యతిరేకంగా ముద్రిస్తున్నాయి.
ఇండియన్ కరెన్సీ గురించి కొన్ని ఆశ్చర్యకర విషయాలు..!
కరెన్సీ ముద్రణ ‘‘మన దేశంలో 1770లో ఆరంభమైందని చెప్పుకోవచ్చును'' అంటారు.
ఇండియన్ కరెన్సీ గురించి కొన్ని ఆశ్చర్యకర విషయాలు..!
ప్రపంచ దేశాల కరెన్సీ గురించి, నకిలీ నోట్లను గుర్తించే పద్ధతి గురించి ప్రత్యేకంగా వివరించారు.
భారత కరెన్సీని ఏవిధంగా పిలుస్తారు..
భారత కరెన్సీని భారతీయ రూపాయి (ఐ.ఎన్.ఆర్.), నాణలను పైసలుగా పిలుస్తారు. ఒకరూపాయకు వందపైసలు ఉంటాయి.
కరెన్సీ యాజమాన్యంలో రిజర్వు బ్యాంకు పాత్ర
భారతదేశంలో కరెన్సీ నిర్వహణను రిజర్వు బ్యాంకు చేస్తుంది. రిజర్వ్ బ్యాంకు సలహాతో ప్రభుత్వం వివిధ సంజ్ఞలను నిర్ణయిస్తుంది. భద్రతాంశాలతో సహా బ్యాంకు నోట్ల నమూనా రూపకల్పనలో రిజర్వు బ్యాంకు ప్రభుత్వంతో సమన్వయం చేస్తుంది. సంజ్ఞల వారీగా నోట్ల పరిమాణం ఎంత అవసరం ఉంటుందో రిజర్వు బ్యాంకు అంచనా వేస్తుంది. వాటికి అనుగుణంగా భారత ప్రభుత్వం ద్వారా వివిధ ముద్రణాలయాలకు ఇండెంట్లను సమకూరుస్తుంది. ఈ ముద్రణాలయాలు సరఫరా చేసిన నోట్లను జారీ చేస్తూ, నిల్వలను ఉంచుకొంటుంది. బ్యాంకుల నుంచి మరియు కరెన్సీ చెస్టుల నుంచి వచ్చిన నోట్లను పరీక్షింపచేస్తుంది. చెలామణికి తగి ఉన్న నోట్లను తిరిగి జారీ చేస్తుంది. మిగిలిన వాటిని (నలిగిన, చినిగిన, ఇతరంగా పనికిరాని వాటిని) నశింప చేసి, చెలామణిలో నాణ్యతను స్థిరంగా ఉంచుతుంది. రిజర్వు బ్యాంకు చట్టం 1934 ప్రాతిపదికగా కరెన్సీ యాజమాన్య పాత్రను రిజర్వ బ్యాంకు నిర్వహిస్తుంది.
భారత ప్రభుత్వం పాత్ర ఏమిటి?
ఎప్పటికప్పుడు సవరించుకొంటూ వచ్చిన నాణల నిర్మాణ చట్టం 1906 ప్రాతిపదికన భారత ప్రభుత్వం తన నాణల నిర్మాణ బాధ్యతను నెరవేరుస్తూంటుంది. వివిధ సంజ్ఞలలో నాణల రూపకల్పన, తయారి భారత ప్రభుత్వం నిర్వహిస్తుంటుంది.
బ్యాంకు నోట్ల విలువ, వాటి ముద్రణను ఎవరు, ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారు?
బ్యాంకు నోట్ల విలువ, ముద్రణ పరిమాణాన్ని రిజర్వు బ్యాంకు నిర్ణయిస్తుంది. నిల్వల అవసరాలు, నలిగి/చిరిగిపోయిన నోట్ల భర్తీ, సాలుసరి బ్యాంకు నోట్ల చెలామణీ అవసరాలు మొ|| వాటి మీద విస్తుృతంగా ఆధారపడి బ్యాంకు నోట్ల ముద్రణ పరిమాణం నిర్దారితమవుతుంది.
నాణల పరిమాణాన్ని తయారికై ఎవరు నిర్ణయిస్తారు?
భారత ప్రభుత్వం నాణల పరిమాణం ఎంత అవసరమో నిర్ణయిస్తుంది.