ప్రపంచంలో దయ్యాలకు ఫేమస్ అయిన సిటీస్..!!

By Swathi

భయంకరమైన ప్రదేశాల గురించి వింటూ ఉంటాం. వాటి గురించి విన్నప్పుడు ఒళ్లంతా వణుకుపుట్టిస్తూ ఉంటుంది. దయ్యాలు, భయంకరమైన శబ్ధాలు వచ్చినా.. దెయ్యాల సినిమాలు చూసినా చాలా భయపడతాం. అలాంటిది.. దెయ్యాలకు కేరాఫ్ గా మారిన సిటీస్ పరిస్థితేంటో ఒక్కసారి ఆలోచించండి.

ఈ సిటీ పేర్లను వినే ఉంటాం. కానీ.. అక్కడ దెయ్యాలు ఎక్కువగా ఉంటాయని మాత్రం చాలామందికి తెలియకపోవచ్చు. ప్రపంచంలోనే ఎక్కువ భయంకరమైన సిటీస్ గురించి ఇప్పుడు మీకు వివరించబోతున్నాం. ఈ సిటీస్ లో ఎక్కువగా పర్సనల్ యాక్టివిటీస్ చోటు చేసుకుంటూ ఉంటాయి.

ఈ టౌన్స్ లో జనాలు ఎప్పుడూ యాక్టివ్ గా తిరుగుతూ ఉంటారు. కానీ.. కొన్ని కారణాల వల్ల.. స్థానికులు.. ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. దీనివల్ల ఆ ప్రదేశాలు మరింత.. స్కేరీగా మారాయి. కాబట్టి ఈ భూమ్మీద ఉన్న ఆసక్తికరమైన, భయంకరమైన ఈ ప్రదేశాల గురించి వింటే మీ కలలో ఈ రాత్రి వచ్చేస్తాయేమో జాగ్రత్త..!!

ఇటలీ

ఇటలీ

ఇటలీలోని క్రాకో అనే టౌన్ లో ఒకప్పుడు 1800 మంది ఉండేవాళ్లు. కానీ స్థానికులందరినీ.. 1963లో గవర్నమెంట్ వేరే ప్రాంతానికి తరలించింది. అప్పటి నుంచి.. ఈ ప్రాంతం.. అతీతమైన పనులకు కేరాఫ్ గా మారింది.

Image Courtesy

బ్రెజిల్

బ్రెజిల్

బ్రెజిల్ లోని ఫోర్డ్లేండియా టౌన్ ని హెన్రీ ఫోర్డ్ విలేజ్ అని పిలుస్తారు. కొన్ని దశాబ్ధాలుగా ఈ ప్రాంతాన్ని నిషేధించారు. ఎవరూ లేకపోవడంతో ఈ అందమైన ప్రాంతం కాస్త.. భయంకరంగా మారింది.

Image Courtesy

జపాన్

జపాన్

జపాన్ లోని హషిమా ఐలాండ్ లో ఒకప్పుడు బొగ్గు గనులు ప్రక్రియలు జరుగుతుండేవి. తర్వాత బిగ్గు ప్లేస్ ని.. ఆయిల్ భర్తీ చేయడంతో.. చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. వీళ్లంతా.. మరోప్రాంతానికి తరలివెళ్లారు. దీనివల్ల దీన్ని భయంకరమైన ప్రాంతంగా భావిస్తారు.

Image Courtesy

ఎథిపోయా

ఎథిపోయా

ఈ విశ్వంలోనే ఇది చాలా హాటెస్ట్ ప్లేస్. వాల్కనోల కారణంగా.. ఇక్కడ వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. దీనివల్ల ఇక్కడ ప్రజలంతా.. మరోప్రాంతానికి తరలివెళ్లారు. దీనివల్ల ఇది.. దెయ్యాల ప్రాంతంగా మారింది.

Image Courtesy

పెన్సిల్ వేనియా

పెన్సిల్ వేనియా

పెన్సిల్వేనియాలోని సెంట్రలియా అనేది కొన్ని దశాబ్ధాలుగా కాలిపోతూ ఉంది. భయంకరమైన గ్యాస్, మంటల కారణంగా.. ప్రతి ఒక్కరినీ భయపెడుతోంది ఈ టౌన్. దీనివల్ల ఈ ప్రాంతానికి ప్రజలను నిషేధించారు. దీంతో.. ఇది.. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ప్రదేశంగా మారింది.

Image Courtesy

ఇటలీ

ఇటలీ

మౌంట్ వెసువీస్ క్షీణించినప్పుడు.. ఈ ప్లేస్ ని నిషేధించారు. ఈ సమయంలో వేలాది మంది చనిపోయారు. చాలా మంది తప్పించుకున్నారు.. కానీ.. ఇప్పుడు గోస్ట్ టౌన్ గా పిలుస్తారు. మనుషులెవరూ లేకపోవడం వల్ల.. దీన్ని ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ప్లేస్ గా పిలుస్తారు.

Image Courtesy

Story first published: Wednesday, August 31, 2016, 16:00 [IST]
Desktop Bottom Promotion