Just In
- 2 hrs ago అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- 3 hrs ago Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- 5 hrs ago ఏప్రిల్ నెలలో లక్ష్మీ నారాయణ మరియు బుధాదిత్య రాజయోగంతో, ఈ రాశుల వారికి బంపర్ ప్రయోజనాలు లభిస్తాయి..!
- 8 hrs ago Today Horoscope 29 March 2024 :ఈరోజు ఈ రాశుల ఆర్థిక స్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది...
పంది కడుపున పిల్లవాడు అస్సలు నిజం కాదు, అది ఇటలీకి చెందిన ఒక బొమ్మ, వాస్తవం తెలుసుకోండి
అసలు విషయం ఏమిటంటే అదంతా కూడా అబద్దమే. ఇది ప్రపచం మొత్తం కూడా ఒక్కో చోట ఒక్కో రకంగా దుష్ప్రచారం అయ్యింది. పందికి మనిషి పుట్టాడని ప్రచారం చేశారుగానీ.. వాస్తవానికి అది ఒక బొమ్మ మాత్రమే. సిలికాన్ బొమ్మ.
కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం పిల్లలను కిడ్నాప్ చేసేవాళ్ల గురించి జోరుగు ప్రచారం సాగింది. అందంతా కూడా ఫేక్. ప్రస్తుతం పంది కడుపున మనిషి రూపంలో ఉన్న పిల్లవాడు పుట్టాడంటూ రూమర్లను కొందరు క్రియేట్ చేశారు. బ్రహ్మంగారు చెప్పిందే జరిగిందంటూ ప్రచారం చేశారు.
పందికి పిల్లవాడు ఫలానా ప్రాంతంలో జన్మించాడు రెండు తెలుగు రాష్రాల్లో పలు పర్యాటక ప్రాంతాల పేర్లను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేశారు. దీనిపై దారుణంగా దుష్ప్రచారం చేశారు. చాలా మంది జనాలు ఈ విషయంలో నిజానిజాలు తెలుసుకోకుండా దాన్ని అలాగే అందరికీ షేర్ చేస్తున్నారు.
బ్రహ్మంగారు చెప్పిందే నిజమైంది
మన రెండు రాష్ట్రాల పాటు ఈ ప్రచారం పక్క రాష్ట్రాలకు కూడా పాకింది. అందరూ కూడా నిజంగా బ్రహ్మంగారు చెప్పిందే నిజమైంది అని అనుకున్నారు. కొన్ని వెబ్, యూట్యూబ్ ఛానెల్స్ లలో కూడా ఇది నిజమంటూ ప్రచారం చేశారు.
అదంతా కూడా అబద్దమే
అసలు విషయం ఏమిటంటే అదంతా కూడా అబద్దమే. ఇది ప్రపచం మొత్తం కూడా ఒక్కో చోట ఒక్కో రకంగా దుష్ప్రచారం అయ్యింది. పందికి మనిషి పుట్టాడని ప్రచారం చేశారుగానీ.. వాస్తవానికి అది ఒక బొమ్మ మాత్రమే. సిలికాన్ తో అందమైన బొమ్మలను తయారు చేయడంలో మగానుకో లైరా అనే కళాకారిని దిట్ట. ఈమెది ఇటలీ.
వింత జీవి ఆకారంలోని బొమ్మను తయారు చేసి
ఈ క్రమంలోనే లైరా ఒక వింత జీవి ఆకారంలో ఉన్న బొమ్మను తయారు చేసింది. ఆ బొమ్మను ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టేందుకు గాను దాన్ని రకరకాలుగా ఫొటోలు తీసింది. పడుకున్న పంది పక్కన కూడా ఆ బొమ్మను పెట్టి ఫొటోలు తీసింది. అయితే ఈ ఫొటోలు నెట్ లోకి రావడంతో కొందరు ఆకతాయిలు దానిపై దుష్ర్పచారం చేశారు.
ఒక్కొక్కరు ఒక్కోరకంగా
కొందరు ఈ సంఘటన యాదాద్రిలో జరిగిందని, మరికొందరు తిరుపతిలో జరిగిందని, ఇలా ఒక్కొక్కరు వారికి ఏ ఊరు దగ్గర ఉంటే ఆ పేరు పెట్టి సోషల్ మీడియాలో ఈ ఫొటోలను అందరికీ పంపారు. ఇలాంటి విషయాలను చదువుకున్న వారు కూడా నమ్మేస్తున్నారు.
తెలుసుకుని షేర్ చేయండి
కాబట్టి సోషల్ మీడియాలో ఏదైనా ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు దాని గురించి కాస్త తెలుసుకుని తర్వాత ఇతరులకు షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వాటి వల్ల కొన్ని సందర్భాల్లో అమాయకులు బలి అయిపోతున్నారు. కొన్నాళ్ల క్రితం పిల్లలను ఎత్తుకుని వెళ్లేవారు వచ్చారని జోరుగా ప్రచారం సాగడంతో ఆ సమయంలో చాలా మంది అమాయకుల ప్రాణాలు తీసేశారు.