Latest Updates
-
విడివిడిగా కాదు.. ఒకే గిన్నెలో క్రీమీ ముద్దపప్పు ఆవకాయ అన్నం..స్వర్గానికి నిచ్చెన వేసే అద్భుతమైన రెసిపీ! -
హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో విజిట్ చేసే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్.. ఒక్కో వీకెండ్కి ఒక్కో ఎక్స్పీరియన్స్ -
బొటనవేలుపై ఈ గుర్తు ఉన్నోళ్లు ప్రపంచాన్ని జయించగలరు! -
ముక్కల్లేకుండా బిర్యానీ మజా.. అచ్చం రెస్టారెంట్ స్టైల్ కుష్కా ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి! -
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే! -
నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్! -
ఈ అలవాటు మానేస్తే తిన్నాక కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు! -
చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు! -
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.!
సిద్ధ న్యాచురోపతితో కరోనాకు చెక్ పెట్టొచ్చు... అదెలాగో తెలుసుకోండి...
న్యాచురోపతి ద్వారా కరోనావైరస్ కు చెక్ పొట్టొచ్చన్న సంగతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
విశ్వవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు కోటి మార్కును దాటిపోయాయి. ఇప్పటికీ ఏ ఒక్కరూ కరోనా విరుగుడుకు సరైన మందును కనిపెట్టలేకపోయారు.

మన దేశంలోని కొందరు తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చే లేదా ముందు జాగ్రత్త నివారణ మందులనే అందుబాటులోకి తెచ్చారు తప్ప ఈ వ్యాధి పూర్తిగా నయమయ్యే మందును మాత్రం తీసుకురాలేకపోయారు.

ఈ నేపథ్యంలోనే మరోసారి ఆయుర్వేదం.. హోమియోపతి, న్యాచురోపతి వంటి సహజ వైద్యం మరోసారి తెరపైకి వచ్చింది. రావడమే కాదు ఇంగ్లీష్ మందులకన్నా మన సహజసిద్ధమైన వైద్య పద్ధతులతో కరోనావైరస్ కు చెక్ పెట్టొచ్చని నిరూపించింది.

మన దేశంలోని సంప్రదాయ వైద్యాన్ని ప్రోత్సహించడంలో కేరళ రాష్ట్రం ఎప్పుడూ ముందుంటుంది. అక్కడ కరోనా మహమ్మారి విరుగుడుకు దీన్ని ప్రోత్సహిస్తున్నారు. అయితే మనం ఇప్పుడు చెప్పుకునేది తమిళనాడు ప్రయోగాల గురించి.

ఎందుకంటే ఆ రాష్ట్రం ఇటీవలే కరోనా విషయంలో కొంత విజయం సాధించింది. సుమారు 30 మంది కరోనా లక్షణాలున్న వారికి చికిత్స అందించడంలో సక్సెస్ సాధించింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

రోగనిరోధకశక్తి పెరుగుదల..
కరోనా వైరస్ లక్షణాలకు చికిత్స చేయడమంటే, మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడమే. ఏ కొత్త వైరస్ ను ఎదుర్కోవాలన్న మనకు ఇదే చక్కటి మార్గం.

సంప్రదాయ వైద్యం..
ఇటీవలే తమిళనాడు ప్రభుత్వానికి వివిధ సంప్రదాయాల వైద్య విధానాలకు చెందిన ఎనిమిది ప్రతినిధులు ఆయుర్వేద, హోమియాపతి, యునాని, న్యాచురోపతి వంటి విధానాల్లో తాము ఏమేం చేయగలమో అనే విషయాలను వివరించారు.

జూన్ 10 నాటికి..
ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో కరోనా వైరస్ ను తగ్గించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే తమిళనాడు ప్రభుత్వం ఇదంతా వీడియో రికార్డు చేయాలని చెప్పింది. ఏయే సెంటర్లలో ఏయే రోగులకు చికిత్స చేయాలో సూచించింది. జూన్ 10 నాటికి 3146 మంది రోగులకు న్యాచురోపతి సంప్రదాయ వైద్యాన్ని మొదలుపెట్టారు.

కరోనా కేర్ సెంటర్లలో..
తమిళనాడు రాజధాని చెన్నైలో Stanley.Omandurara Hospitals, Loyola.DG Vaishnav, Jawahar కళాశాలల్లోని కేర్ సెంటర్లలో ఈ సిద్ధ ప్రయోగాలు ప్రారంభించారు. ముందుగా 30 మందికి చికిత్సను అందించారు. వారందరూ కరోనా నుండి పూర్తిగా విముక్తి పొందడంతో వారిని డిశ్చార్జ్ చేశారు.

మరో 100 మందికి..
వీరితో పాటు మరో 100 మందికి చికిత్స దాదాపు పూర్తి కావచ్చినట్లు తమిళనాడు హెల్త్ సెక్రెటరీ జె.రాధాక్రిష్ణన్ తెలిపారు. వీరందరికీ ఎగ్జిట్ టెస్టులు చేసి, నెగిటివ్ వచ్చిన వెంటనే వీరందరినీ అతి త్వరలోనే డిశ్చార్జ్ చేయబోతున్నట్లు చెప్పారు.

ఆశాజనకంగా ఫలితాలు..
State Development Policy Council(SPDC) ఉపాధ్యక్షుడు పొన్నయ్యన్ దీని గురించి మాట్లాడుతూ ‘‘ఇది చాలా ఆశాజనకంగా ఉంది. ఇప్పటికే పలుచోట్ల కరోనా రోగులతో ప్రాణాయామం, యోగ చేయిస్తున్నాం. దీంతో పాటు ఉప్పుతో కలిపిన నులివెచ్చని నీటి పుక్కిలింత.. ఆవిరి పట్టడం వంటి చర్యలతో పూర్తిగా కరోనా నెగిటివ్ రావడం ఆశాజనకరంగా మరియు ప్రోత్సాహకరంగా ఉంది'' అని అన్నారు.

ఇంకా తేలాల్సి ఉంది..
అయితే ఈ సహజ సిద్ధమైన ఈ వైద్యం వల్లే కోలుకున్నారా? లేదా వారిలో సహజసిద్ధంగా రోగనిరోధక శక్తి పెరిగి కోలుకున్నారా అనేది ఇంకా తేలాల్సి ఉంది. అయితే ఆనందించాల్సిన విషయమేమిటంటే.. ఈ చికిత్స తీసుకున్న వారిలో ఏ ఒక్కరూ ఇబ్బంది పడలేదు.

ఇంకా పెంచుతాం..
కేరళ రాష్ట్రంలోని సంప్రదాయ వైద్యం మాదిరిగానే తమిళనాడులో కూడా న్యాచురల్ ట్రీట్ మెంట్ మంచి ఫలితాలను ఇస్తుండటంతో, ఈ చికిత్సను మరింత మందికి పెంచబోతున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనాపై యుద్ధంలో ఏది ఉత్తమ ఫలితంగా నిలుస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.



Click it and Unblock the Notifications