Just In
- 47 min ago
ఆ కార్యంలో కలకాలం కచ్చితంగా సక్సెస్ కావాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి...
- 1 hr ago
డయాబెటిస్ ఉంటే పిల్లలు పుట్టే అవకాశం లేదా? మరి పరిష్కారం ఏంటి?
- 3 hrs ago
నిలబడి తినడం ఆరోగ్యానికి మంచిదా? కాదా? మీ సందేహానికి సమాధానం ఇక్కడ ఉంది
- 3 hrs ago
2019లో ఎక్కువ మంది చేసిన ట్వీట్లు.. ఏమోజీలు, హ్యాష్ ట్యాగులేంటో తెలుసా...
Don't Miss
- News
అత్యాచారానికి ఉరిశిక్ష... ఏపి దిశ చట్టానికి క్యాబినెట్ ఆమోదం
- Sports
కారణం తెలియదు!: చెన్నైలో కమల్ హాసన్ను కలిసిన డ్వేన్ బ్రావో
- Movies
నాగబాబు చేసిన పనితో ఆ నటుడి కోసం వెతుకుతున్న జబర్ధస్త్ టీమ్.. రీప్లేస్ చేయనిది అందుకే.!
- Technology
బేసిక్ రీఛార్జ్ రూ.49 ప్లాన్ను తొలగించించిన జియో
- Finance
అన్నీ ఇచ్చాం: ఆంధ్రప్రదేశ్కు కేంద్రం షాక్, కొత్త పథకాలతో రెవెన్యూ లోటు పెంచారు!
- Automobiles
కియా సెల్టోస్ ముంబైలోని డీలర్షిప్ యొక్క మొదటి అంతస్తునుండి పడిపోయిన వీడియో
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
వీరి ప్రేమ కారణంగా భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తత తగ్గుతుందా?
ప్రేమ, ప్యార్, మోహబ్బాత్, ఇష్క్ ఇలా ఏ పేరుతో పిలిచిన ప్రేమికుల మనసు పులకరిస్తుంది. ఈ ప్రేమకు హద్దులు, సరిహద్దులు లేనే లేవు. అది మరోసారి నిజమని నిరూపించింది ఓ జంట. ప్రతిరోజూ ఏదో ఒక జంట ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకుంటారు. కాకపోతే కొంతమంది పెద్దలను ఒప్పించి చేసుకుంటారు. ఇంకొందరు తమ ఇష్టప్రకారమే పెళ్లి చేసుకుంటారు. ఇలాంటి కథలెన్నో మనం ఇంతకుముందు చూశాం. ఇప్పుడు చూస్తున్నాం. కానీ ఇప్పుడు మీరు వినబోయే కథ మాత్రం ఎవ్వరూ కలలో కూడా ఊహించనటువంటిది. వారిద్దరి ప్రేమ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించేందుకు ఉపయోగపడుతుందని చాలా మంది చెబుతున్నారు. ఇంతకీ వారిద్దరు ఎవరో తెలుసా.. వారేమిటో తెలియాలంటో ఈ స్టోరీని పూర్తిగా చదవాల్సిందే.
ప్రేమ ఎప్పుడు పుడుతుందో తెలియదు. ఎవరి మీద పుడుతుందో తెలియదు. ఎందుకు పడుతుందో కూాడా తెలియదు. కానీ ఆ ప్రేమకు ఎంతో శక్తి ఉంది. అనేక వివాదాలకు తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది. అంతే కాదు రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతను కూడా తగ్గిస్తుందని ప్రేమికులు చెబుతున్నారు. ఇందుకు సాక్ష్యంగా భారత్ - పాకిస్థాన్ లెస్బియన్ (స్వలింగ సంపర్కులు) జంటను చూపుతున్నారు.
కాలిఫోర్నియాలో ఇటీవల ఓ అద్భుత వివాహం జరిగింది. సాధారణంగా వివాహమంటే పెళ్లికూతురు మెడలో పెళ్లి కొడుకు మూడు ముళ్లు వేస్తారు. కానీ అక్కడ మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది. భారత్-పాక్ లెస్బియన్స్ బియాంకా మరియు సైమా ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు. ఇంకో విశేషమేమిటంటే ఇది కూడా కులాంతర వివాహం. బియాంకా మైలీ కొలంబియన్-ఇండియన్ క్రిస్టియన్ కాగా సైమా పాకిస్థాన్ దేశానికి ముస్లిం మహిళ.
View this post on InstagramLife is sweeter with you. 4.20.19 💍 Photos by @sennaahmad Outfits by @bhkazimov
A post shared by 𝔩𝔞 𝔫𝔢𝔫𝔞 𝔡𝔢 𝔪𝔦𝔢𝔩 🇨🇴🇮🇳 (@biancamaieli) on Aug 25, 2019 at 6:43pm PDT
వీరిద్దరూ తొలిసారి అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో కలుసుకున్నారు. అప్పటి నుండి వీరి ప్రేమ షురూ అయ్యింది. ఆ తర్వాత వివాహానికి సిద్ధమయ్యారు. అంతే వారి కుటుంబ సభ్యులను సైతం ఒప్పించారు. అందంగా ముస్తాబయ్యారు. బియాంకా తన భారీ ఎంబ్రాయిడరీ ఐవరీ చీరతో పాటు ముత్యాల హారం, గాజులతో తళుక్కున మెరిసింది. సైమా గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ ఉన్న బ్లాక్ షెర్వానీ ధరించి ముత్యాల హారం, కలర్ ఫుల్ గా కనిపించే ఎంబ్రాయిడరీ ఉన్న మ్యాచింగ్ స్టోల్ తో తన రూపాన్ని అందంగా రూపు దిద్దుకుంది.
కొత్తగా పెళ్లి చేసుకున్న ఈ జోడీ అందమైన చిత్రాలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. కొందరు సోషల్ మీడియా యూజర్లను
ఇవి బాగా ప్రేరేపించాయి. ''లైఫ్ మీతో మధురంగా ఉంది..'' అని క్యాప్షన్ తో ఉన్న వారి ఫొటోను బియాంకా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. చాలా మంది యూజర్లు వీరిద్దరి కలయిక, వివాహంపై రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది ''అందమైన దేవుడు మీ ఇద్దరినీ ఆశీర్వదిస్తాడు'' కామెంట్ చేశారు. దీని తర్వాత మరో కామెంట్ కాస్త భిన్నంగా వచ్చింది. 'అందమైన', 'అద్భుతమైన', 'ఒక రాణి'ని కనిపెట్టారు! అని, అందమైన జంట 'చిత్రం'పై దంపతులకు లెక్కలేనన్ని ఆశీర్వాదాలు అని కామెంట్లు వచ్చాయి. ప్రేమ చేదు వాతావరణంలో కూడా జీవించగలదని ఈ జంట నిరూపించింది.