Latest Updates
-
వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు ఈ 'దేశీ' చిట్కాలు పాటించండి.. ఎండల నుంచి ఉపశమనం ఎలా? -
మండే ఎండలకు చెక్.. ఇంట్లో ఉండే పండ్లతోనే చల్లటి, క్రీమీ ఐస్ క్రీమ్ తయారీ! -
మీ చుట్టూ ఉన్న తేనె పూసిన కత్తులను ఎలా గుర్తించాలి? -
నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డులు వచ్చేస్తున్నాయి.. డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
జిమ్ వద్దు, కఠిన డైట్ వద్దు..3 నెలల్లో 12 కిలోలు తగ్గిన డాక్టర్ సీక్రెట్ ఇదే! -
రవి యోగం, సిద్ధ యోగం కలయిక.. ఏప్రిల్ 26న ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు! -
వేళ్లు కూడా నాకి నాకి తినే కొత్తిమీర పన్నీర్ కర్రీ..రోటీ, నాన్ లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
సండే స్పెషల్: పుల్లపుల్లగా, కారంకారంగా మామిడికాయ మటన్ కర్రీ.. టేస్ట్ కిర్రాక్! -
ఎండలు మండిపోతున్నాయా? వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకునే అద్భుతమైన చిట్కాలు ఇవే! -
మోహినీ ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే పారణ సమయాలు, నియమాలు తప్పక తెలుసుకోండి!
వీరి ప్రేమ కారణంగా భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తత తగ్గుతుందా?
ప్రేమ ఎప్పుడు పుడుతుందో తెలియదు. ఎవరి మీద పుడుతుందో తెలియదు. ఎందుకు పడుతుందో కూాడా తెలియదు. కానీ ఆ ప్రేమకు ఎంతో శక్తి ఉంది.
ప్రేమ, ప్యార్, మోహబ్బాత్, ఇష్క్ ఇలా ఏ పేరుతో పిలిచిన ప్రేమికుల మనసు పులకరిస్తుంది. ఈ ప్రేమకు హద్దులు, సరిహద్దులు లేనే లేవు. అది మరోసారి నిజమని నిరూపించింది ఓ జంట. ప్రతిరోజూ ఏదో ఒక జంట ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకుంటారు. కాకపోతే కొంతమంది పెద్దలను ఒప్పించి చేసుకుంటారు. ఇంకొందరు తమ ఇష్టప్రకారమే పెళ్లి చేసుకుంటారు. ఇలాంటి కథలెన్నో మనం ఇంతకుముందు చూశాం. ఇప్పుడు చూస్తున్నాం. కానీ ఇప్పుడు మీరు వినబోయే కథ మాత్రం ఎవ్వరూ కలలో కూడా ఊహించనటువంటిది. వారిద్దరి ప్రేమ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించేందుకు ఉపయోగపడుతుందని చాలా మంది చెబుతున్నారు. ఇంతకీ వారిద్దరు ఎవరో తెలుసా.. వారేమిటో తెలియాలంటో ఈ స్టోరీని పూర్తిగా చదవాల్సిందే.
ప్రేమ ఎప్పుడు పుడుతుందో తెలియదు. ఎవరి మీద పుడుతుందో తెలియదు. ఎందుకు పడుతుందో కూాడా తెలియదు. కానీ ఆ ప్రేమకు ఎంతో శక్తి ఉంది. అనేక వివాదాలకు తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది. అంతే కాదు రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతను కూడా తగ్గిస్తుందని ప్రేమికులు చెబుతున్నారు. ఇందుకు సాక్ష్యంగా భారత్ - పాకిస్థాన్ లెస్బియన్ (స్వలింగ సంపర్కులు) జంటను చూపుతున్నారు.

కాలిఫోర్నియాలో ఇటీవల ఓ అద్భుత వివాహం జరిగింది. సాధారణంగా వివాహమంటే పెళ్లికూతురు మెడలో పెళ్లి కొడుకు మూడు ముళ్లు వేస్తారు. కానీ అక్కడ మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది. భారత్-పాక్ లెస్బియన్స్ బియాంకా మరియు సైమా ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు. ఇంకో విశేషమేమిటంటే ఇది కూడా కులాంతర వివాహం. బియాంకా మైలీ కొలంబియన్-ఇండియన్ క్రిస్టియన్ కాగా సైమా పాకిస్థాన్ దేశానికి ముస్లిం మహిళ.
వీరిద్దరూ తొలిసారి అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో కలుసుకున్నారు. అప్పటి నుండి వీరి ప్రేమ షురూ అయ్యింది. ఆ తర్వాత వివాహానికి సిద్ధమయ్యారు. అంతే వారి కుటుంబ సభ్యులను సైతం ఒప్పించారు. అందంగా ముస్తాబయ్యారు. బియాంకా తన భారీ ఎంబ్రాయిడరీ ఐవరీ చీరతో పాటు ముత్యాల హారం, గాజులతో తళుక్కున మెరిసింది. సైమా గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ ఉన్న బ్లాక్ షెర్వానీ ధరించి ముత్యాల హారం, కలర్ ఫుల్ గా కనిపించే ఎంబ్రాయిడరీ ఉన్న మ్యాచింగ్ స్టోల్ తో తన రూపాన్ని అందంగా రూపు దిద్దుకుంది.
కొత్తగా పెళ్లి చేసుకున్న ఈ జోడీ అందమైన చిత్రాలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. కొందరు సోషల్ మీడియా యూజర్లను
ఇవి బాగా ప్రేరేపించాయి. ''లైఫ్ మీతో మధురంగా ఉంది..'' అని క్యాప్షన్ తో ఉన్న వారి ఫొటోను బియాంకా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. చాలా మంది యూజర్లు వీరిద్దరి కలయిక, వివాహంపై రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది ''అందమైన దేవుడు మీ ఇద్దరినీ ఆశీర్వదిస్తాడు'' కామెంట్ చేశారు. దీని తర్వాత మరో కామెంట్ కాస్త భిన్నంగా వచ్చింది. 'అందమైన', 'అద్భుతమైన', 'ఒక రాణి'ని కనిపెట్టారు! అని, అందమైన జంట 'చిత్రం'పై దంపతులకు లెక్కలేనన్ని ఆశీర్వాదాలు అని కామెంట్లు వచ్చాయి. ప్రేమ చేదు వాతావరణంలో కూడా జీవించగలదని ఈ జంట నిరూపించింది.



Click it and Unblock the Notifications