Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
Garuda Purana: జీవితంలో చేసే ఈ తప్పులు బతికున్నా, చచ్చినా వెంటాడుతూనే ఉంటాయి
అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, దొంగతనం చేయడం, ఇతరులకు హాని తలపెట్టడం లాంటి చెడు పనుల ప్రభావం ప్రస్తుతం జీవితంపై, తర్వాతి జీవితంపై కూడా ప్రభావం చూపిస్తాయి.
గరుడ పురాణం ప్రకారం మనం జీవించి ఉన్నప్పుడు చేసే కొన్ని చెడు పనులు జీవించి ఉన్నప్పుడే కాదు, చనిపోయిన తర్వాత కూడా ప్రభావం చూపుతాయి. మనం చేసే కర్మలకు తప్పనిసరిగా ప్రతిఫలం ఉంటుందున్న భావన గురించి గరుడ పురాణంలో ప్రత్యేకంగా చెప్పబడింది. మన ఆలోచనలు, మాటలు, పనులు ప్రస్తుత జీవితంలో మరియు తర్వాతి జీవితంలో మన ఉనికి యొక్క స్వభావాన్ని నిర్ణయిస్తాయని గరుడ పురాణం పేర్కొంది.

అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, దొంగతనం చేయడం, ఇతరులకు హాని తలపెట్టడం లాంటి చెడు పనుల ప్రభావం ప్రస్తుతం జీవితంపై, తర్వాతి జీవితంపై కూడా ప్రభావం చూపిస్తాయి. నిజాయితీ, కరుణ, నిస్వార్థం వంటి మంచి పనుల ప్రభావం కూడా ప్రస్తుతం జీవితంతో పాటు మరణానంతరం కూడా ప్రభావం చూపిస్తాయని గరుడ పురాణం పేర్కొంటుంది.

ఇతరుల సొమ్ము దోచుకోవడం:
ఇతరుల నుండి మోసపూరితంగా డబ్బు లాక్కునే వారు, ఇతరులను మోసం చేసే వారు ఆ పాప ఫలితాన్ని కేవలం భూమిపై ఉన్నప్పుడు మాత్రమే కాకుండా చనిపోయిన తర్వాత కూడా అనుభవిస్తారని గరుడ పురాణం చెబుతోంది. ఈ పాపాలకు పాల్పడిన వారు తదుపరి జన్మలో పేదరికాన్ని, కష్టాలను ఎదుర్కొంటారని వివరిస్తోంది. మరణించిన తర్వాత ఈ పాపాలకు యమలోకంలో శిక్షలు అనుభవించాల్సిందేనని గరుడ పురాణంలో పేర్కొనబడింది.

జీవిత భాగస్వామిని మోసం చేయడం:
భర్త లేదా భార్యను మోసం చేసే వారు పెద్ద పాపం చేసినట్లే. మీతో జీవితం అనుకొని వచ్చిన వారిని మోసం చేయడం పెద్ద తప్పు. తల్లిదండ్రులనూ కూడా వదులుకుని వచ్చిన వారిని కంటికి రెప్పలా చూసుకోవాలి. జీవిత భాగస్వామిని మోసం చేయడం వల్ల వచ్చే పాపం బతికున్నప్పుడే కాకుండా చనిపోయాక కూడా బాధిస్తుంది.

జంతువులను హింసించడం:
జంతు హింస మహాపాపం. జంతువులను హింసించి చంపే వారికి పాపం చుట్టుకుంటుంటుంది. అలాంటి వారికి బతికున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని గరుడ పురాణం చెబుతోంది. అలాంటి వారికి దుఃఖం చుట్టుముడుతుంది. రోగాల బారిన పడతారు. వారిని యమలోకంలో వేడి నూనెలో వేయిస్తారని గరుడ పురాణం చెబుతోంది.

మహిళలు, పిల్లలపై శారీరక వేధింపులు:
స్త్రీలను, పిల్లలను చిత్రహింసలకు గురి చేసే వ్యక్తులు పాపం మూటగట్టుకుంటారు. వారు జీవించి ఉన్నప్పుడు భరించలేని బాధ దహించివేస్తుంది. తీవ్ర దుఃఖంతో సతమతం అవుతారు. వారిని చనిపోయాక కూడా ఈ పాపం వెంటాడుతుంది.

పెద్దలను అవమానించడం:
పెద్దలను అవమానించకూడదని మన సాంప్రదాయం నేర్పుతోంది. దానిని కాదని పెద్దలను అవమానించే వ్యక్తులు బతికున్నప్పుడు తీవ్ర అవమానాలను ఎదుర్కొంటారు. జీవిత చరమాంకంలో పేదరికంతో ఎన్నో ఇబ్బందులు పడతారు. మరణం తర్వాత కూడా వారిని ఈ పాపం వెంటాడుతూనే ఉంటుంది.
గరుడ పురాణం మన చర్యలకు ఈ జీవితంలో మరియు అంతకుమించి మనల్ని అనుసరించే పరిణామాలు ఉన్నాయని బోధిస్తుంది. ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడం, సానుకూల కర్మలను సృష్టించడం లేదా ప్రతికూల మార్గంలో కొనసాగడం, పరిణామాలను ఎదుర్కోవడం మన ఇష్టం. కర్మ సూత్రాలను అర్థం చేసుకోవడం, అనుసరించడం ద్వారా మనకు మన చుట్టూ ఉన్న వారికి మెరుగైన పరిస్థితులను సృష్టించవచ్చు.



Click it and Unblock the Notifications