Latest Updates
-
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..! - బుధవారం, 22 ఏప్రిల్ 2026 -
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా?
ఈ పూల మొక్కలు ఇంట్లో పెంచుకుంటే వాస్తు దోషం తొలగిపోయి మంచి జరుగుతుంది
తులసి, మనీ ప్లాంట్, లక్కీ బాంబూ ప్లాంట్ లాంటి కొన్ని మొక్కలతో పాటు కొన్ని రకాల పూల మొక్కలు ఇంట్లో పెంచుకోవడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎలాంటి పూల మొక్కలు పెంచితే వాస్తు దోషాలు
ఇంట్లో మొక్కలు పెంచుకోవడం, పూల మొక్కలు పెంచుకోవడం చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇళ్లంతా పచ్చగా కనిపిస్తే చూడ ముచ్చటగా ఉంటుంది. ఇళ్లైనా, ఆఫీస్ అయినా మొక్కలు కనిపిస్తే అందంగా కనిపిస్తుంది. పచ్చదనం కంటికి ఆహ్లాదకరంగా అనిపించడంతో పాటు మనసుకు హాయిగా అనిపిస్తాయి. జ్యోతిష్య ప్రకారం కూడా కొన్ని రకాల మొక్కలు ఇంట్లో పెంచుకోవడం మంచిది. కొన్ని మొక్కలు ఇంటికి అలంకరణతో పాటు జ్యోతిష్య ప్రయోజనాలను చేకూరుస్తాయి.

తులసి, మనీ ప్లాంట్, లక్కీ బాంబూ ప్లాంట్ లాంటి కొన్ని మొక్కలతో పాటు కొన్ని రకాల పూల మొక్కలు ఇంట్లో పెంచుకోవడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎలాంటి పూల మొక్కలు పెంచితే వాస్తు దోషాలు తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మల్లె:
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మల్లె మొక్కలు నాటుకోవచ్చు. ఇంట్లో, ఇంటి పరిసర ప్రాంతాల్లో మల్లె పెంచడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇంటి సభ్యుల మధ్య కలహాలు తగ్గుముఖం పడతాయి. దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. మల్లె వాసన చాలా మధురంగా ఉంటుంది. ఈ మత్తైన వాసన మనస్సును రిఫ్రెష్ చేస్తుంది. దీని వల్ల కోపం కూడా తగ్గుతుంది.

సంపంగి:
హిందూమతం ప్రకారం సంపంగికి ఎంతో ప్రాధాన్యత ఉంది. హిందూ సాంప్రదాయం ప్రకారం సంపంగిని పవిత్రమైన పువ్వుగా పరిగణిస్తారు. పూజలో సంపంగి పువ్వులను ఉపయోగించాలని చెబుతుంటారు. సంపంగి పువ్వు వాసన మధురంగా ఉంటుంది. ఇది మైండ్ ను రిఫ్రెష్ చేస్తుంది. దాంతో పాటు సంపంగి పూల వాసన వాతావరణాన్ని శుద్ధి చేయడానికి కూడా పని చేస్తుంది.

గులాబీ:
ముళ్లు ఉన్న మొక్కలు ఇంట్లో నాటకూడదని జ్యోతిష్య శాస్త్రం, వాస్తు శాస్త్రం చెబుతున్నాయి. అయితే వీటికి గులాబీ మొక్క మినహాయింపు. ఇంట్లో గులాబీ మొక్కలు నాటడం జ్యోతిష ప్రకారం మేలు చేస్తుంది. గులాబీలు చూడటానికి అందంగా ఉండటమే కాదు మంచి ప్రయోజనాలను అందిస్తాయి. వాస్తు దోషాలు తొలగిపోతాయి. గులాబీ పూలను చూస్తే మనస్సుకు ఆహ్లాదంగా అనిపిస్తుంది. పచ్చని చెట్టుకు ఎరుపు రంగులో కనిపించే పూలు ఎంతో అందంగా ఉంటాయి.

పారిజాతం:
వాస్తు ప్రకారం ఇంట్లో పారిజాతం పెంచుకుంటే మంచి జరుగుతుంది. ఇంటి సభ్యుల మధ్య కలహాలు దూరమవుతాయి. పారిజాతం చెట్లను ఇంట్లో పెంచుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం కూడా పారిజాతానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పురాణాల ప్రకారం, పాల సముద్రం నుండి బయటకు వచ్చిన పవిత్రమైన వస్తువులలో ఒకటి పారిజాత చెట్టు. ఈ చెట్టు మీద కాసే పువ్వులు ఎప్పుడూ మెరుస్తూనే ఉంటాయి. ఈ చెట్టును ఇంద్రుడు స్వర్గం తీసుకొచ్చినట్లు చాలా మంది నమ్ముతారు.
ఈ చెట్టు వయసు సుమారు 1000 నుండి 5000 సంవత్సరాల వరకు ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. ఈ చెట్టుకు ఉండే మరో విశేషం ఏంటంటే.. దీని ఆకులు గానీ, కొమ్మలు గానీ ఎప్పటికీ ఎండిపోయి రాలవు. ఇవి ఎప్పటికీ చాలా బలంగా ఉంటాయి. పురాణాల్లోనూ పారిజాతంకు ప్రత్యేక స్థానం ఉంది.



Click it and Unblock the Notifications











