Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
కరోనా ఎఫెక్ట్ : అక్కడ చేతులు కడుక్కుంటేనే బస్టాండులోకి ప్రవేశం...
కరోనా వైరస్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన మొట్టమొదటి జాగ్రత్త ఏంటంటే చేతులు శుభ్రపరచుకోవడం. రువాండా దేశంలో ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలంటే కచ్చితంగా చేతులు శుభ్రం చేసుకోవాల్సిందే.
ప్రస్తతుం కరోనా వైరస్ పేరు వింటే ప్రపంచం వణికిపోతోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఎన్నో దేశాల్లో.. ఎన్నో రంగాల్లో తీవ్ర ప్రభావం పడింది. ప్రపంచంలోని అగ్ర దేశాలతో పాటు మన దేశం కూడా ఈ వైరస్ బారిన పడింది.

ఇంతవరకు మన దేశంలో కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. అయితే తాజాగా మన తెలుగు రాష్ట్రాల్లో ఓ వ్యక్తి కరోనా బారిన పడి మరణించినట్లు వార్తలు వినిపించాయి. ఇప్పటివరకు ఈ రోగానికి మందు దొరకకపోవడంతో ప్రపంచంలోని దేశాలన్నీ తలలు పట్టుకుంటున్నాయి.

దీంతో అందరూ తెగ ఆందోళన పడుతున్నారు. అయితే ఈ కరోనా వైరస్ రాకుండా ఆఫ్రికా ఖండంలోని ఓ చిన్న దేశం తీసుకున్న జాగ్రత్తల గురించి మీరు ఔరా అనాల్సిందే. ఈ దేశం ప్రపంచంలోని అన్ని దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అన్ని దేశాల్లో శరవేగంగా వ్యాపించిన ఈ వైరస్ ఆ దేశంలోకి ఇప్పటివరకు కనీసం ఇప్పటివరకు అడుగు పెట్టలేకపోయింది. ఇప్పటికీ ఆ దేశంలో కరోనా జాడ కనిపించకపోవడంతో అక్కడ అందరూ సంతోషంగా జీవిస్తున్నారు. ఇదంతా ఎలా సాధ్యమయ్యిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే...
SEEN IN KIGALI: To prevent the risk of #Coronavirus outbreak, passengers at the Kigali Bus Park have to wash their hands before getting onto buses.#Rwanda has recorded NO case of the epidemic but the country has stepped up vigilance. pic.twitter.com/tb7cfUNj7K
— The New Times (Rwanda) (@NewTimesRwanda) March 9, 2020
ముందస్తు జాగ్రత్తలు..
ఆఫ్రికాలోని ఓ చిన్న దేశం రువాండా. ఆ దేశంలోకి కరోనా వైరస్ వ్యాపించకుండా వారు తీసుకున్న ముందు జాగ్రత్తలు.. ఆ దేశ ప్రజల అవగాహన వల్ల కరోనా వారి దరికి చేరలేదు. ఇంతకీ వారు ఏయే చర్యలు తీసుకున్నారో చూడండి...

ప్రతి బస్టాండులోనూ..
కరోనా వైరస్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన మొట్టమొదటి జాగ్రత్త ఏంటంటే చేతులు శుభ్రపరచుకోవడం. రువాండా దేశంలో ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలంటే కచ్చితంగా చేతులు శుభ్రం చేసుకోవాల్సిందే. అందుకోసం ప్రతి బస్టాండులోనూ ప్రత్యేకంగా పోర్టబుల్ వాష్ బేసిన్ లు ఏర్పాటు చేశారు. చేతులు కడుక్కుంటేనే బస్టాండులోకి ప్రవేశం లభిస్తుంది.

పరిశుభ్రత విషయంలో..
పచ్చదనం.. పరిశుభ్రత విషయంలో రువాండ దేశానికి మంచి రికార్డే ఉంది. 1994లో భయంకరమైన మారణహోమంతో అత్యంత తీవ్రంగా దెబ్బ తిన్న ఆ దేశం క్రమంగా పుంజుకుంటూ వచ్చింది.

వేగంగా మెరుగవుతున్న దేశాల్లో..
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నివేదికల ప్రకారం ఆఫ్రికాలో వేగంగా మెరుగైన ఫలితాలు సాధిస్తున్న దేశాల్లో రువాండా ఒకటిగా నిలిచింది.

స్వచ్ఛంగా శుభ్రపరుస్తారు..
ప్రతి నెలా చివరి శనివారం రువాండా ప్రజలు ‘ఉముగాండా‘ అనే కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటారు. ఆరోజు అందరూ కలిసి వీధులు, ఇతర బహిరంగ ప్రదేశాలను శుభ్రపరుస్తారు. అక్కడ ఇది ఒక చట్టంగా చేయబడింది.

ప్లాస్టిక్ బ్యాన్..
మన తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ప్లాస్టిక్ బ్యాన్ చేశారు. అయినా ఇది సక్రమంగా అమలు కావటం లేదు. అయితే ఇలాంటి ప్లాస్టిక్ బ్యాగుల నిషేధం అక్కడ పదేళ్ల క్రితం నుంచే అమల్లో ఉంది. ఈ దేశంతో ఆఫ్రికాలోనే పరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్.

పర్యావరణ పరిరక్షణలోనూ..
పర్యావరణ పరిరక్షణలోనూ రువాండ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. వన్యప్రాణులు, నేచర్ ను కాపాడుకునేందుకు అనేక రకాల కార్యక్రమాలు చేపడుతోంది.

సురక్షితమై దేశం..
అంతేకాదు ఆ దేశం ఆఫ్రికాలో అత్యంత సురక్షితమైన దేశంగా పేరు తెచ్చుకుంది. అక్కడ క్రైమ్ రేటు కూడా చాలా తక్కువగా ఉంది. కరోనా వైరస్ భయం వల్ల ముందస్తు చర్యల నేపథ్యంలో ఇప్పటికే చాలా దేశాలు విదేశీ పర్యాటకులపై నిషేధం విధించడం తెలిసిందే..

ఎలాంటి ఆంక్షలు లేవు..
ఈ రువాండ మాత్రం పర్యాటకులపై ఇప్పటివరకు ఎలాంటి ఆంక్షలు అనేదే విధించలేదు. అంతేకాదు తమ దేశానికి సంబంధించి పర్యాటకులకు సాధారణ సేవలు యధావిధిగా కొనసాగుతాయని కూడా ప్రకటించడం గమనార్హం.



Click it and Unblock the Notifications











