Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
స్నాక్స్ తింటే పిల్లల ఏకాగ్రత అధికం!

అయితే సైంటిస్టులు మాత్రం కొద్దిపాటిగా వీటిని ఇచ్చినప్పటికి ఫలితం బాగానే వుంటుందని చెపుతున్నారు. షుగర్ హైపర్ యాక్టివిటీనిస్తుందని ఎక్కడా రుజువు కాలేదని. ఇది పిల్లలలో మెమొరీని, ఏకాగ్రతలను పెంచుతుందని ప్రొఫెసర్ డెవిడ్ బెంటన్ చెప్పినట్లు టెలిగ్రాఫ్ పత్రిక ప్రచురించింది. అయిదు నుండి పదేళ్ళ లోపు పిల్లలకు పెద్దవారితోపోలిస్తే రెండింతల గ్లూకోజ్ కావాలని, అయితే, శరీరంలోని ఇతర అవయవాల మాదిరిగా కాక బ్రెయిన్ తనకవసరమైన గ్లూకోజ్ ను నిల్వ వుంచుకోలేదని, అది ఎప్పటికపుడు రక్తంలోనుండే తీసుకుంటుందని అధ్యయన కర్తలు చెపుతున్నారు.
పిల్లలకు కొద్ది మొత్తంలో ఎక్కువసార్లు తినిపించాలని, కాని నేడు వారికి అధికంగా ఒకే సారి తినిపిస్తూ వుండటం వలన అధిక బరువు సమస్యలు వస్తున్నాయని కూడా ఈ ప్రొఫెసర్ చెపుతున్నారు.
స్టడీలో, బెంటన్ 16 మంది 9 - 10 సంవత్సరాల పిల్లలకు గ్లూకోజ్ వున్న పండ్లరసాలను ఆర్టిఫిషియల్ డ్రింకులను ఇచ్చారు. వీరందరకు మెమొరీ పరీక్షలు పెడితే 10 శాతం మెమొరీ పెరిగినట్లు తేలింది.
తరగతిలో ఇచ్చే పనికి 11 నుండి 20 నిమిషాలు అధికంగా కూడా వీరు చేయగలిగినట్లు తేలింది.
అయితే, పిల్లలకు ఆర్టిఫిషియల్ డ్రింక్ లు కు బదులుగా తాజా పండ్ల రసాలవంటివి ఇవ్వాలని బెంటన్ ప్రతిపాదిస్తున్నారు.



Click it and Unblock the Notifications