Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
స్నాక్స్ తింటే పిల్లల ఏకాగ్రత అధికం!

అయితే సైంటిస్టులు మాత్రం కొద్దిపాటిగా వీటిని ఇచ్చినప్పటికి ఫలితం బాగానే వుంటుందని చెపుతున్నారు. షుగర్ హైపర్ యాక్టివిటీనిస్తుందని ఎక్కడా రుజువు కాలేదని. ఇది పిల్లలలో మెమొరీని, ఏకాగ్రతలను పెంచుతుందని ప్రొఫెసర్ డెవిడ్ బెంటన్ చెప్పినట్లు టెలిగ్రాఫ్ పత్రిక ప్రచురించింది. అయిదు నుండి పదేళ్ళ లోపు పిల్లలకు పెద్దవారితోపోలిస్తే రెండింతల గ్లూకోజ్ కావాలని, అయితే, శరీరంలోని ఇతర అవయవాల మాదిరిగా కాక బ్రెయిన్ తనకవసరమైన గ్లూకోజ్ ను నిల్వ వుంచుకోలేదని, అది ఎప్పటికపుడు రక్తంలోనుండే తీసుకుంటుందని అధ్యయన కర్తలు చెపుతున్నారు.
పిల్లలకు కొద్ది మొత్తంలో ఎక్కువసార్లు తినిపించాలని, కాని నేడు వారికి అధికంగా ఒకే సారి తినిపిస్తూ వుండటం వలన అధిక బరువు సమస్యలు వస్తున్నాయని కూడా ఈ ప్రొఫెసర్ చెపుతున్నారు.
స్టడీలో, బెంటన్ 16 మంది 9 - 10 సంవత్సరాల పిల్లలకు గ్లూకోజ్ వున్న పండ్లరసాలను ఆర్టిఫిషియల్ డ్రింకులను ఇచ్చారు. వీరందరకు మెమొరీ పరీక్షలు పెడితే 10 శాతం మెమొరీ పెరిగినట్లు తేలింది.
తరగతిలో ఇచ్చే పనికి 11 నుండి 20 నిమిషాలు అధికంగా కూడా వీరు చేయగలిగినట్లు తేలింది.
అయితే, పిల్లలకు ఆర్టిఫిషియల్ డ్రింక్ లు కు బదులుగా తాజా పండ్ల రసాలవంటివి ఇవ్వాలని బెంటన్ ప్రతిపాదిస్తున్నారు.



Click it and Unblock the Notifications











