Just In
- 23 min ago మీనరాశిలో కుజుడు-రాహువు కలయిక వల్ల అంగారక యోగం ఏర్పడుతుంది..జూన్ 1 వరకు ఈ రాశులకు కష్టాలు తప్పవు..జాగ్రత్త
- 4 hrs ago ఈరోజు రాశి ఫలాలు : గురువారం సాయిబాబా ఆశీస్సులతో ఏఏ రాశుల వారికి ఈ రోజు శుభకరం, ఎవరికి అశుభం
- 9 hrs ago Lazy Husband Signs: 4 సోమరిపోతు రాశులు, వీరిని పెళ్ళి చేసుకుంటే సంకనాకిపోతారు..అంతే..ఒక్కపనికి పనికిరారు
- 12 hrs ago పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
హాని కలిగించే బిడ్డపై ధ్యాస - శరీరంపై అశ్రధ్ధ!
సరి అయిన సలహాలు, ప్రణాళికలు లేకుండా మహిళలు తమ ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు. దీనికారణంగా డీహైడ్రేషన్ కు, విటమిన్ల లోపానికి, రక్త హీనతలకు గురవుతున్నారు. దీనినే మనం పోషకాహార లేమిగా చెపుతున్నాం. బిడ్డకు పాలు పడితే తల్లికి బాగా ఆకలి వేస్తుంది. ఏ ఆహారం పడితే ఆ ఆహారం తల్లి తినేకంటే, విటమిన్లు, ఖనిజలవణాలు కల ఆహారాన్ని సమృధ్ధిగా తీసుకుంటూ శరీరం నుండి బయటకు పోయిన శక్తిని తిరిగి పొందాలి. సాధారణంగా ఫోలిక్ యాసిడ్ లోపం వచ్చి తీవ్ర రక్తలేమికి గురవుతూంటారు మహిళలు. కనుక బిడ్డ పుట్టిన ఆరు నెలల వరకు మహిళలు విటమిన్లను కలిగిన పోషక విలువలు కల ఆహారాన్ని తీసుకుంటూనే వుండాలి. బిడ్డకు పాలు చాలటం లేదన్న లేదా ఇతర మనోవ్యధలు ఆహారం సరిగా తీసుకోనివ్వక తల్లిని పోషకాహార లేమికి గురిచేస్తాయి.
ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు సాధారణంగా కొంత బరువు పెరుగుతారు. అయితే పెరిగిన ఈ బరువును తగ్గించుకోవాలనే ఆందోళనలో సరి అయిన ఆహారం తీసుకోకపోవడం కూడా జరుగుతుంది. బరువు తగ్గించుకోడం అనేది నిదానమైన ప్రక్రియగా భావించాలి. ప్రసవించిన మహిళలకు తమ బేబీపై అధిక ధ్యాస వుండటంతో కనీసం రోజుకు అయిదు గంటలు కూడా నిద్రపోరు. నిద్ర లేమి ప్రభావం కూడా వీరిపై పడుతూంటుంది. బిడ్డ నిద్రిస్తున్న సమయంలోనే తల్లి కూడా నిద్రించే అలవాటు చేసుకోవాలి. డాక్టర్ లేదా పోషకాహార నిపుణులు ఇచ్చిన సలహా మేరకు ఆహారాన్ని ప్రసవించిన మహిళలు తీసుకుంటుండాలి. బిడ్డకు తల్లులకు సమస్యలు రాకుండా ఉండాలంటే, గర్భధారణ సమయంలోనే కాక, ప్రసవించిన ఆరు నెల కాలం వరకు మహిళ ఆహారం, నిద్రల పట్ల అధిక జాగ్రత్త వహించాలి.