Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
మహిళలు మెచ్చే సుగంధ ద్రవ్యాల స్నానం!
మహిళలు మెచ్చే సుగంధ ద్రవ్యాల స్నానం!

అయితే, ఈ నొప్పులు సహజంగా తగ్గించాలంటే సహజ విధానాలలో సుగంధ ద్రవ్యాల స్నానం ఒకటి. సుగంధ ద్రవ్యాల స్నానం అంటే అనేక రకాల వనమూలికలు, సుగంధ ద్రవ్యాలు, ఎసెన్సులు దీనిలో వాడతారు. దీనివల్ల శారీరక నొప్పులు తగ్గి ఎంతో హాయిగా వుంటుంది. ఒకటి లేదా రెండు స్నానాల తర్వాత సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. శరీరంలోని చెడు తొలగుతుంది. చెడు తరంగాలనుండి విముక్తి కలుగుతుంది. అవసరాలకనుగుణమైన సుగంధ ద్రవ్యాలను ఎంచుకుని ఉపయోగించాలి. దీనికై బాత్ టబ్ వాడవచ్చు లేదా మామూలుగా వాడే స్నాన పరికరాలు కూడా సరిపోతాయి.
ఇష్టమైన సుగంధ ద్రవ్యాలు ఎంచుకోవచ్చు. వాటిని వేడినీరు ఉన్న పాత్రలో ఉంచాలి. అపుడు ఆ నీరు ద్రవ్యాలలోని సారాన్ని గ్రహిస్తాయి. స్నాన పరికరాలు శుభ్రంగా వుండాలి. స్నానానికి సబ్బు, షాంపూ ఉపయోగించి రోజూవలెనే స్నానం చేయాలి. తర్వాత వనమూలికలు కలిపిన వేడి నీటిని టబ్, లేదా బకెట్ లో వున్న నీటికి చేర్చాలి. ఆ నీటితో తలతోపాటు శరీరమంతా తడిసేలా స్నానం చేయాలి. టవలుతో ఒళ్ళు తుడుచుకోవద్దు. ఒక పరిశుభ్రమైన గుడ్డ ఒంటికి చుట్టుకోవాలి.శరీరం గాలికి ఆరిపోతుంది. సుగంధ ద్రవ్యాల వాసన, ఒంటికి తగిలిన చల్లదనం ఆమెకు ఎంతో హాయినిస్తుంది.
ఈ రకంగా ఒళ్ళు సహజంగా ఆరే పద్దతి ముఖ్యం. పొడుగైన వెంట్రుకలున్నవారు తల తడుపుకోకుండా గుడ్డతో కవర్ చేయాలి. తరువాత 24 గంటలు స్నానం చేయవద్దు. కనీసం 12 గంటలైనా ఆగాలి. ఆ తర్వాత అవసరమనుకుంటే పరిశుభ్రమైన నులివెచ్చని నీటితో మరోమారు స్నానం చేస్తే శారీరక నొప్పులు మటుమాయం అవుతాయి.ఈ సుగంధ ద్రవ్యాల స్నానం మహిళ తన ప్రసవం తర్వాత వైద్యుల సలహాను బట్టి ఆచరించాలి. ఈ రకమైన స్నానం ఇంటివద్దే ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే, అనుభవం కల మహిళలు ఆమెకు సహకరించాలి. ఈ రకమైన స్నానం ఆమెకు శారీరక నొప్పులు తగ్గించి మంచి నిద్రను కూడా పట్టిస్తుంది. డెలివరీ తర్వాత మహిళ మానసికంగా కూడా ఆందోళనలో వుంటుంది. బిడ్డ కొరకై అధిక సమయం వెచ్చించాలని చూస్తుంది. కనుక, సహాయంగా వుండే మహిళలు ఈ ఏర్పాట్లు చేసి ఆమెకు సౌకర్యం కలిగించి ఆనందింపచేయాలి.



Click it and Unblock the Notifications











