Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
మహిళలు మెచ్చే సుగంధ ద్రవ్యాల స్నానం!
మహిళలు మెచ్చే సుగంధ ద్రవ్యాల స్నానం!

అయితే, ఈ నొప్పులు సహజంగా తగ్గించాలంటే సహజ విధానాలలో సుగంధ ద్రవ్యాల స్నానం ఒకటి. సుగంధ ద్రవ్యాల స్నానం అంటే అనేక రకాల వనమూలికలు, సుగంధ ద్రవ్యాలు, ఎసెన్సులు దీనిలో వాడతారు. దీనివల్ల శారీరక నొప్పులు తగ్గి ఎంతో హాయిగా వుంటుంది. ఒకటి లేదా రెండు స్నానాల తర్వాత సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. శరీరంలోని చెడు తొలగుతుంది. చెడు తరంగాలనుండి విముక్తి కలుగుతుంది. అవసరాలకనుగుణమైన సుగంధ ద్రవ్యాలను ఎంచుకుని ఉపయోగించాలి. దీనికై బాత్ టబ్ వాడవచ్చు లేదా మామూలుగా వాడే స్నాన పరికరాలు కూడా సరిపోతాయి.
ఇష్టమైన సుగంధ ద్రవ్యాలు ఎంచుకోవచ్చు. వాటిని వేడినీరు ఉన్న పాత్రలో ఉంచాలి. అపుడు ఆ నీరు ద్రవ్యాలలోని సారాన్ని గ్రహిస్తాయి. స్నాన పరికరాలు శుభ్రంగా వుండాలి. స్నానానికి సబ్బు, షాంపూ ఉపయోగించి రోజూవలెనే స్నానం చేయాలి. తర్వాత వనమూలికలు కలిపిన వేడి నీటిని టబ్, లేదా బకెట్ లో వున్న నీటికి చేర్చాలి. ఆ నీటితో తలతోపాటు శరీరమంతా తడిసేలా స్నానం చేయాలి. టవలుతో ఒళ్ళు తుడుచుకోవద్దు. ఒక పరిశుభ్రమైన గుడ్డ ఒంటికి చుట్టుకోవాలి.శరీరం గాలికి ఆరిపోతుంది. సుగంధ ద్రవ్యాల వాసన, ఒంటికి తగిలిన చల్లదనం ఆమెకు ఎంతో హాయినిస్తుంది.
ఈ రకంగా ఒళ్ళు సహజంగా ఆరే పద్దతి ముఖ్యం. పొడుగైన వెంట్రుకలున్నవారు తల తడుపుకోకుండా గుడ్డతో కవర్ చేయాలి. తరువాత 24 గంటలు స్నానం చేయవద్దు. కనీసం 12 గంటలైనా ఆగాలి. ఆ తర్వాత అవసరమనుకుంటే పరిశుభ్రమైన నులివెచ్చని నీటితో మరోమారు స్నానం చేస్తే శారీరక నొప్పులు మటుమాయం అవుతాయి.ఈ సుగంధ ద్రవ్యాల స్నానం మహిళ తన ప్రసవం తర్వాత వైద్యుల సలహాను బట్టి ఆచరించాలి. ఈ రకమైన స్నానం ఇంటివద్దే ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే, అనుభవం కల మహిళలు ఆమెకు సహకరించాలి. ఈ రకమైన స్నానం ఆమెకు శారీరక నొప్పులు తగ్గించి మంచి నిద్రను కూడా పట్టిస్తుంది. డెలివరీ తర్వాత మహిళ మానసికంగా కూడా ఆందోళనలో వుంటుంది. బిడ్డ కొరకై అధిక సమయం వెచ్చించాలని చూస్తుంది. కనుక, సహాయంగా వుండే మహిళలు ఈ ఏర్పాట్లు చేసి ఆమెకు సౌకర్యం కలిగించి ఆనందింపచేయాలి.



Click it and Unblock the Notifications