Latest Updates
-
నాన్వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.! -
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల
గర్భిణీ స్త్రీలు పచ్చి మాంసం తినడం, పిల్లులతో ఆడుకోవడాన్ని ఎందుకు మానుకోవాలి ?
గర్భిణీ స్త్రీ లు ఎందుకు పచ్చి మాంసం తినడాన్ని మానుకోవాలి ? వివిధ రకాలైన సూక్ష్మ క్రిములు వాటిలో ఉంటాయి. అవి చాలా మట్టుకు పరాన్నజీవులు అయి ఉంటాయి.
గర్భిణీ స్త్రీ లు ఎందుకు పచ్చి మాంసం తినడాన్ని మానుకోవాలి ? వివిధ రకాలైన సూక్ష్మ క్రిములు వాటిలో ఉంటాయి. అవి చాలా మట్టుకు పరాన్నజీవులు అయి ఉంటాయి. అవి మిగతా జంతువులూ లేదా మనుష్యులు పై ఆధారపడి బ్రతుకుతూ ఉంటాయి. అవి మనకంటికి కనపడవు. అందుమూలంగానే అవి మనపై ఆధారపడి బ్రతుకుతున్నా మనకు ఆ విషయం తెలీదు.
కానీ మనం తరచూ అనారోగ్యానికి గురౌతుంటే, మన ఆరోగ్యాన్ని పరాన్న జీవులు ప్రభావితం చేస్తున్నాయి అని గ్రహించాలి. మనం అనారోగ్యంపాలైతే, ఆ చిన్న రాక్షసులు మన ఆరోగ్యాన్ని దోచేస్తున్నాయని అర్ధం. అందునా గర్భినిగా ఉన్నప్పుడు ఈ పరాన్న జీవులను దూరం పెట్టడం చాలా ముఖ్యం.
ఒక అధ్యనం ప్రకారం "టాక్సోప్లాస్మా గోండి " అనే పరాన్నజీవులు గర్భిణీ స్త్రీలకు చాలా ప్రమాదకరం. వాటి గురించి మనకు తెలియని విషయాలు ఎన్నో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పాక్షికంగా ఉడికిన మాంసం గర్భిణీ స్త్రీలకు చాలా ప్రమాదకరం. అంతే కాకుండా వ్యాధి సోకిన పిల్లి విసర్జకాలు ఇంటి చుట్టుప్రక్కల ఉంటే కూడా అస్సలు మంచిది కాదు. ఎందుకంటే

టాక్సోప్లాస్మా గోండి :
ఈ టాక్సోప్లాస్మా గోండి అనే పరాన్నజీవి వల్ల పుట్టబోయే బిడ్డ లోపాలతో జన్మించే అవకాశం ఉంది. అంతేకాకుండా అకాల పుట్టుక సంభవించవచ్చు. మహిళలు ఈ రకమైన పరాన్నజీవులు వల్ల ఎలా వ్యాధి భారిన పడతారు ? పాక్షికంగా ఉడికిన మాంసం మరియు, పిల్లి విసర్జకాలు ఇంటి చుట్టుప్రక్కల ఉన్నప్పుడు వ్యాధి భారీన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది.

ఈ పరాన్నజీవి ఇంకా ఏమి చేయగలదు :
ఈ పరాన్నజీవులు వల్ల కలిగే మొదటి ప్రమాదం గర్భస్రావం. మరొక ప్రమాదం ఏమిటంటే, 9 నెలలు నిండక ముందే పిల్లలు జన్మించేస్తారు. మూడవ ప్రమాదం పుట్టబోయే బిడ్డ లోపాలతో పుడతాడు. ఆ లోపాలు మెదడు దెబ్బతినటం లేదా కళ్ళు దెబ్బ తినటం లాంటి విపరీత పరిస్థితులకు దారి తీస్తుంది.

ఈ పరాన్నజీవులు పెద్దలకు హానికరమా ?
మాములుగా మీలో రోగ నిరోధక శక్తి బాగుంటే, మిమ్మల్ని ఆ పరాన్నజీవి ఏమి చేయలేదు. కానీ మీరొక గర్భిని స్త్రీ అయ్యి ఉంటే గనుక ఖచ్చితంగా అనారోగ్యం భారిన పడతారు. మిగతా ఆరోగ్యకరమైన మనుష్యులు ఈ పరాన్నజీవి వల్ల ప్రభావితం అయినా వాళ్లకు కొన్ని రోజుల పాటు జలుబు లాంటి చిన్న చిన్న సమస్యలు వేధిస్తాయి.

వ్యాధి లక్షణాలు :
ఈ పరాన్నజీవి మన పై ప్రభావం చూపినప్పుడు జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి, ఆకలిలేకపోవటం, చెవి నొప్పి, పొత్తికడుపులో నొప్పి మీద పట్టేయడం, కలవర పడటం, దద్దుర్లు మరియు వికారంగా ఉండటం లాంటి లక్షణాలు ప్రస్ఫుటంగా కనపడతాయి.

ఈ పరాన్నజీవి గురించి మరిన్ని విషయాలు:
టాక్సోప్లాస్మా గోండి అనేది అతి సూక్ష్మ ఏక కణ పరాన్నజీవి. అవి మన కణాల లోపల కూడా జీవించగలవు. ఈ సూక్ష్మ జీవులు ప్రోటోజోవా రకానికి చెందినవి. ఒక అంచనా ప్రకారం, ప్రపంచంలోని సగం మంది ఈ పరాన్న జీవులను మోస్తున్నారు. అవును ఇది నిజం. చివరికి పిల్లులు కూడా వీటిని మోస్తున్నాయంటే ఆశ్చర్య పడనవసరం లేదు.

ఇవి మెదడుకి హాని చేస్తాయా :
ఈ సూక్ష్మ జీవుల వల్ల కలిగే సంక్రమణ వల్ల , మనిషి స్వభావం మారిపోతుందని నమ్ముతారు
(కొన్ని అధ్యయనాలు దీనిని ద్రువీకరించవలసి ఉంది) . ఇవి మెదడుకు హాని చేయటమే కాకుండా, మనిషిని ఉద్రేకానికి లోను చేస్తాయట.
వీటి వల్ల మనోవైకల్యానికి గురయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ విహాయాన్ని వైద్య నిపుణులు ద్రువీకరించ వలసి ఉంది. కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం పిల్లులకు దూరం గా ఉండాలి మరియు పాక్షికంగా ఉడికిన మాంసాన్ని తినడం పూర్తిగా నిషేధించాలి.



Click it and Unblock the Notifications