Latest Updates
-
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.!
గర్భధారణ సమయంలో ఆముదం తీసుకోవడం అనర్ధం అని తెలిపే ఐదు కారణాలు!
శతాబ్దాలుగా మంత్రసానులు గర్భవతుల ప్రసవానికై నొప్పులు రావడానికి ఆముదంని ఉపయోగిస్తున్నారు. కానీ ప్రసూతి నిపుణులు అయిన వైద్యులు మాత్రం ఈ విధంగా చేయటం వలన దుష్పరిణామాలు ఎదురవ్వడమే కాక తల్లి బిడ్డల ప్రాణాల
శతాబ్దాలుగా మంత్రసానులు గర్భవతుల ప్రసవానికై నొప్పులు రావడానికి ఆముదంని ఉపయోగిస్తున్నారు. కానీ ప్రసూతి నిపుణులు అయిన వైద్యులు మాత్రం ఈ విధంగా చేయటం వలన దుష్పరిణామాలు ఎదురవ్వడమే కాక తల్లి బిడ్డల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. అసలు ఆముదాన్ని నొప్పులు రావడానికి ఎందుకు వాడతారంటే- ఆముదం మంచి విరేచనకారి.ఆముదం ప్రేగులను బిగుతుగా చేస్తుంది. దీనివలన గర్భసంచిలో ఉండే కాండరాలలో అసౌకర్యం కలిగి నెప్పులు కలిగించే ప్రోస్టాగ్లాండిన్ స్రావాన్ని పెంచుతుంది. మంత్రసానులు అనవసరమైన ఈ పద్ధతిని పాటిస్తారు.

గర్భధారణ సమయంలో ఆముదం వాడకాన్ని గర్భిణిలు ఎందుకు నిరోధించాలంటే:

1. మెకోనియం గోల్ సిండ్రోమ్ ముప్పును పెంచుతుంది:
ప్రసవం కొరకు గర్భిణీ ఆముదం మింగినపుడు, నెప్పులు మొదలై అవి కడుపులో ఉండే బిడ్డను ఉత్తేజ పరుస్తుంది. ప్రసవానంతరం బిడ్డ మొదటి సారి చేసే ముదురు ఆకుపచ్చని జిగురు వంటి మల విసర్జనను మెకోనియం అంటారు. గర్భంలోనే కనుక బిడ్డ మలవిసర్జన చేస్తే అది ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతుంది. ఈ పరిస్థితి ఎదురైతే బిడ్డ ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది. నవజాత శిశువుల్లో ఊపిరి తీసుకోవడంలో సమస్యలు ఎదురవడానికి ఇది ఒక ముఖ్య కారణం.

2. తల్లికి డీహైడ్రేషన్ కలుగజేస్తుంది:
ఆముదం వలన తల్లికి డయేరియా కలుగుతుంది.దీనివలన తలెత్తే డీహైడ్రేషన్ వలన తల్లి శరీరంలో నీరు ఆర్చుకుపోతుంది.తల్లి ఆరోగ్యానికి డీహైడ్రేషన్ అత్యంత ప్రమాదకరం. బిడ్డకు జన్మనిచ్చిన తదనంతరం తల్లి డీహైడ్రేషన్ వలన చాలా నీరసించిపోతుంది. బిడ్డ యెడల సరైన సంరక్షణ తీసుకోలేదు. అంతేకాక ప్రసవానంతరం తల్లి కోలుకోవడం ఆలస్యమవుతుంది.

3. పాల సరఫరాను తగ్గిస్తుంది:
తల్లిపాలు బిడ్డకు సరైన పోషణను అందిస్తుంది. డీహైడ్రేషన్ వలన తల్లికి పాలిచ్చే సామర్థ్యం తగ్గిపోతుంది. బిడ్డకు కనుక తగినన్ని తల్లిపాలు అందకపోతే ఆరోగ్యం చెడిపోతుంది. బిడ్డలో కొత్త రకమైన సమస్యలు మొదలవుతాయి.

4. ప్రసవసమయంలో తీవ్రస్థాయిలో నొప్పులు:
గర్భిణిలు ఆముదం తీసుకోవడం వలన నొప్పితో కూడిన సంకోచాలు మొదలవుతాయి. ఆముదం తీసుకోని స్త్రీలతో పోలిస్తే తీసుకున్న వారిలో నొప్పులు తీవ్రస్థాయిలో భరించలేనివిగా ఉంటాయి.

5. ముందుస్తు ప్రసవం:
ఎట్టి పరిస్థితుల్లోనూ గర్భిణిలు నలభైయ్యవ వారానికి ముందుగా ఆముదం తాగరాదు. గర్భం యొక్క ముందుస్తు దశల్లో కనుక ఆముదం తాగితే ముందుగా ప్రసవం జరిగే ప్రమాదం ఉంది.ముందుస్తు ప్రసవం జరిగిన బిడ్డలో ఆరోగ్య సమస్యలు అధికం. వారిలో అవయవాలు లేక దేహం యొక్క అభివృద్ధి సంపూర్ణంగా జరగదు. కొన్నిసార్లు ఇది గర్భ విచ్చిత్తికి దారి తీయవచ్చు.



Click it and Unblock the Notifications