Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
ఆంధ్రా ఫేమస్ బిర్యానీ ఇదే..దీన్ని తినకుంటే జీవితమే వేస్ట్!
బిర్యానీ అంటే బోలెడు వెరైటీలు ఉంటాయి. అందులో ఉలవచారు బిర్యానీ ఒకటి. ఉలవచారు బిర్యానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందిన ఒక ప్రత్యేకమైన, రుచికరమైన వంటకం. ముఖ్యంగా దీనిని ఏపీ స్పెషల్ రెసిపిగా చెప్తుంటారు. ఇది ఉలవచారు,బిర్యానీ మసాలా దినుసులను ఉపయోగించి తయారు చేయబడుతుంది. ఈ వంటకం దాని ప్రత్యేకమైన రుచి, సువాసనతో ప్రజలను ఆకర్షిస్తుంది. ఇటీవల ఓ సందర్భంలో ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా తనకు ఇస్టమైన బిర్యానీ అంటే ఉలవచారు బిర్యానీనే అన్నారు. ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఓ సందర్భంలో ఉలవచారు బిర్యానీ విజయవాడ స్పెషల్ అని చెప్పారు.
ఉలవచారు బిర్యానీ రుచికరమైనదే కాకుండా ఆరోగ్యానికి కూడా బోలెడు ప్రయోజనాలు అందిస్తుంది. ఉలవచారు బిర్యానీని ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోవడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
ఉలవచారు బిర్యానీని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు
ఉలవచారు: 2 కప్పులు
బాస్మతి బియ్యం: 2 కప్పులు
టమోటాలు: 2
కారం: 1 టీస్పూన్
పసుపు: 1/2 టీస్పూన్
నూనె: 4 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడా
ఉల్లిపాయలు: 2
పచ్చిమిర్చి: 4
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 టీస్పూన్లు
బిర్యానీ మసాలా: 2 టీస్పూన్లు
కొత్తిమీర: కొద్దిగా
పుదీనా: కొద్దిగా
ఉలవచారు బిర్యానీ తయారీ విధానం
-ఉలవచారు బిర్యానీ తయారుచేయడానికి ముందుగా ఉలవలను శుభ్రంగా కడిగి కనీసం 6 గంటల పాటు నానబెట్టాలి.
-నానిన ఉలవలను కుక్కర్ లో వేసి తగినంత నీళ్లు పోసి 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి.
-ఉడికిన ఉలవలను చల్లారనిచ్చి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టాలి.
-ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలో ఆయిల్ వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
-తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
-ఇప్పుడు అందులో సన్నగా తరిగిన టమోటాలు, బిర్యానీ మసాలా, కారం, పసుపు, ఉప్పు వేసి ఆయిల్ పైకి తేలే వరకు వేయించాలి.
-ఇప్పుడు అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉలవల మిశ్రమాన్ని బాగా కలిపి నానబెట్టిన బాస్మతి బియ్యం, తగినంత నీరు పోసి మూత పెట్టి బియ్యం ఉడికే వరకు ఉడికించాలి.
-బియ్యం ఉడికిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి. అంతే ఉలవచారు బిర్యానీ రెడీ.
-వేడి వేడి ఉలవచారు బిర్యానీని రైతాతో కలిపి తింటే నోటికి స్వర్గాన్ని అందించినట్లే.
పెసరపప్పుతో హల్వా..మండుటెండల్లో తింటే శరీరానికి చలువ,ఎలా చేయాలంటే
ఉలవచారు బిర్యానీ ప్రయోజనాలు
ఉలవచారు బిర్యానీలో ఉలవలు ప్రధాన పదార్థం కాబట్టి, ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఉలవల్లో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉలవలు శరీరానికి శక్తిని అందిస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. శరీర బరువును తగ్గించడంలో సహాయపడతాయి. కిడ్నీలో రాళ్ళను కరిగించే గుణం ఉలవచారుకి ఉంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







