Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
Saggubiyyam Khichdi: ఉపవాసం స్పెషల్..ఒక్కసారి తింటే జన్మలో మర్చిపోలేని రుచి,ఎలా చేయాలంటే..
సగ్గుబియ్యంతో పాయసమే కాదు కిచిడీ కూడా చేసుకోవచ్చని మీకు తెలుసా? ఆరోగ్యానికి ఆరోగ్యంతో పాటు రుచి కూడా యమాగా ఉంటుంది. ఒక్కసారి టేస్ట్ చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంటది. ముఖ్యంగా ఉపవాస దీక్షలో ఉండేవాళ్లకు అనుకూలమైన అల్పాహారం ఇది. నార్త్ ఇండియాలో ఉపవాసాల సమయంలో తేలికగా తినే ఆహారాలలో సగ్గుబియ్యం కిచిడి ఒకటి. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఈ అల్పాహారం బరువు తగ్గాలనుకునేవారికి కూడా బెస్ట్ గా ఉంటుంది. సగ్గుబియ్యం కిచిడి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
సగ్గుబియ్యం కిచిడి తయారీకి కావాల్సిన పదార్థాలు
-సగ్గుబియ్యం
-ఆయిల్
-వేరుశెనగ పప్పు
-నిమ్మ రసం
-చక్కెర
-నల్ల మిరియాల పొడి
-కొత్తిమీర
-పచ్చిమిర్చి పేస్ట్
-బంగాళ దుంప ముక్కలు
-కరివేపాకు
-ఉప్పు
సగ్గుబియ్యం తయారీ విధానం
-1 కప్పు సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి అందులో అరకప్పు నీళ్లు పోసి 4 గంటల పాటు నాననివ్వాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి దాని మీద పావు కప్పు శెనగపప్పు వేసి ఎర్రగా వేయించి దాని పొట్టు తీసి కచ్చాపచ్చాగా దంచుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి అది వేడయ్యాక అందులో జీలకర్ర వేసి చిట్లనివ్వాలి. తర్వాత అందులోనే పొట్టు తీసి చిన్నగా కట్ చేసిన అరకప్పు బంగాళదుంప ముక్కలు, కరివేపాకు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి.
-కొంచెం మగ్గిన ఆలూలో 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్,రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించండి.
-ఆలూ మెత్తబడిన తర్వాత అందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యం, 1 టీస్పూన్ చక్కెర వేసి రంగు తేలికపడే వరకు మూతపెట్టి మగ్గనివ్వండి.
-తర్వాత అందులో దంచుకున్న పల్లీలు, కొత్తిమీర తరుగు, నిమ్మరసం, మిరియాల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే రుచికరమైన సగ్గుబియ్యం కిచిడి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












