Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
వేడి వేడి అన్నంలోకి పెసరపప్పు బంగాళదుంప కర్రీ, ఊరగాయతో నోరూరాల్సిందే
పప్పు పేరు వింటే చాలు చాలా మందికి ఇష్టం. అటువంటి పప్పులో మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విటమిన్లు మరియు ఇతర పోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి. అలాంటి పప్పులలో పెసరపప్పు ఒకటి, ఈ పప్పుతో ఈ రోజు ఒక సులభమైన వంటకాన్ని మీతో పంచుకుంటున్నాం. ఇది తయారు చేయడానికి కేవలం 20 నిమిషాలు పడుతుంది. ఈ రుచికరమైన దాల్ కర్రీని బంగాళదుంపతో తయారు చేస్తే మరింత పోషకమైనదిగా, రుచికరమైనదిగా మారుతుంది.
పెసరపప్పులో ఆరోగ్యాకినికి సంబంధించి ఇది కొలెస్ట్రాల్ను తగ్గించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, అలాగే మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ సూచికను కలిగి ఉంటుంది, అంటే చక్కెర క్రమంగా రక్తప్రవాహంలోకి విడుదల అవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో ఇది సహాయపడుతుంది కాబట్టి మధుమేహం ఉన్నవారికి ఇది సరిపోతుంది. అలాంటి పెసరపప్పును మన రెగ్యులర్ డైట్ చేర్చుకోవాల్సిందే.
ఇందులో ఉపయోగించే మసాలాలు మీ మధ్యాహ్న భోజనాన్ని మరింత రుచికరంగా మారుస్తాయి. ఇది కాకుండా, వైట్ రైస్కు పప్పు బెస్ట్ కాంబినేషన్ గా చాలా మంది ఇష్టపడతారు, ఇది సరైన కలయిక. వేడి అన్నం, వేడి వేడి పెసరపప్పు ఆలుగడ్డ పప్పు, ఒక చెంచా నెయ్యి మరియు ప్లేట్ లో ఓ మూలన మామిడి ఊరగాయతో పాటు తింటే ఓ అద్భుతమైన రుచిని మీకు అందిస్తుంది. ఈ కాంబినేషన్ ప్లేట్ లో చూడగానికి మీ నోట్లో నీళ్ళూ ఊరాల్సిందే. దీన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం.

ముగ్గురికి వడ్డించవచ్చు
*తయారీ సమయం: 15 నిమిషాలు
*వంట సమయం: 18 నిమిషాలు
కావాల్సినపదార్థాలు
*పెసరపప్పు- 1 కప్పు (పచ్చివి)
* బంగాళదుంపలు - 2 (ఉడికించినవి)
*టమోటో - 3 (తరిగినవి)
* పచ్చిమిర్చి - 5 (తరిగినవి)
* అల్లం - 1 ముక్క (చిన్న ముక్కలు)
*కరివేపాకు - కొద్దిగా
*కొత్తిమీర - కొద్దిగా
* రుచికి సరిపడా ఉప్పు
*నీరు - 1 కప్పు
పోపుకు
*ఆవాలు - 1 స్పూన్
* జీలకర్ర - 1 స్పూన్
*పసుపు - 1/2 స్పూన్
*నూనె/నెయ్యి - 1/2 tsp
తయారీ విధానం
*ఒక పెద్ద బాణలిలో నూనె వేసి, ఈ నూనె కాగే వరకు ఉంచి, తరువాత నెయ్యిలో
పోపుకు దినుసులను జోడించండి. 2-3 నిమిషాలు వేగనివ్వండి.
*ఇప్పుడు ఈ పాన్లో తరిగిన టొమాటో, తరిగిన పచ్చిమిర్చి,
అల్లం, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు వేసి మీడియం మంట మీద వేడి
చేయాలి.
* ఇప్పుడు ఉడికించిన బంగాళదుంపలు మరియు ఉడికించిన పెసెళ్లు
పాన్లో వేసి 10 నిమిషాలు ఉడికించాలి.
*తర్వాత కొంచెం నీళ్ళు కలపండి, ఎప్పుడైతే కూర చిక్కగా మారిందని మీకు
అనిపిస్తే అప్పుడు స్టౌ ఆఫ్ చేసి సర్వ్ చేయండి.
పోషకాహార సలహా
పెసరపప్పు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి, మధుమేహానికి మంచిది
మరియు గర్భిణీ స్త్రీలకు అవసరమైన ఐరన్ కంటెంట్ ను అందిస్తుంది.
సలహా
వంట చేసేటప్పుడు ఎక్కువ నీరు కలపకుండా జాగ్రత్త వహించండి. పెసళ్ళు
మరియు బంగాళాదుంప వంటకం కొంచెం కష్టం, అయినా ఇది రుచిమాత్రం అద్భుతంగా
ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications