Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
కశ్మీరీ స్టైల్ ఫిష్ ఫ్రై.. టేస్ట్ వేరే లెవల్.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు
నాన్ వెజ్ లో చేపలకు ఉండే క్రేజ్ వేరు. చికెన్, మటన్ తినడానికి ఇష్టపడని వారు సైతం, చేపల వంటకాలను లొట్టలేసుకుంటూ తింటారు. దానికి ప్రధాన కారణం చేపల్లో ఉండే ప్రత్యేకమైన రుచి,సువాసన. సాధారణంగా మనం చేపలను ఇంటికి తెచ్చుకోగానే పులుసు లేదా మన సంప్రదాయ పద్ధతిలో మసాలాలు దట్టించి ఫ్రై చేస్తుంటాం.
కానీ ప్రతీసారీ ఒకే రుచిని ఆస్వాదించడం బోర్ కొడుతోంది కదా? అందుకే రెగ్యులర్ ఫిష్ ఫ్రైకి బదులుగా, నోరూరించే కశ్మీరీ స్టైల్ ఫిష్ ఫ్రైని ప్రయత్నించండి. మీరు ఇప్పటివరకు తిన్న చేపల వేపుడు వేరు.. ఈ కశ్మీరీ స్టైల్ వేరు. దీని రుచి వేరే లెవల్ లో ఉంటుంది. కశ్మీరీ స్టైల్ ఫిష్ ఫ్రై ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
చేప ముక్కలు - 1 కిలో
పసుపు - 1 టీస్పూన్
సాధారణ కారం - 2 టీస్పూన్లు
కాశ్మీరీ కారం - 1 టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
సోంపు పొడి - ఒకటిన్నర టీస్పూన్లు
జీలకర్ర పొడి - ఒకటిన్నర టీస్పూన్లు
గరం మసాలా - 1 టీస్పూన్
బియ్యం పిండి - 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు -సరిపడా
నూనె -సరిపడా
తయారీ విధానం
-ముందుగా చేప ముక్కలను పసుపు, ఉప్పు వేసి నీటితో రెండు, మూడు సార్లు శుభ్రంగా కడగాలి. దీనివల్ల చేపల నీచు వాసన పోతుంది.
-ఒక వెడల్పాటి గిన్నె తీసుకోండి. అందులో పసుపు, సాధారణ కారం, కాశ్మీరీ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సోంపు పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, నిమ్మరసం, రుచికి సరిపడా ఉప్పు, బియ్యం పిండిని వేసి కలపండి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లి, మిశ్రమాన్ని చిక్కటి పేస్ట్ లా తయారు చేసుకోండి.
-ఇప్పుడు శుభ్రం చేసిన చేప ముక్కలకు ఈ మసాలా పేస్ట్ ను అన్ని వైపులా బాగా పట్టించండి. మసాలా దట్టించిన చేపలను కనీసం 45 నిమిషాల నుండి 1 గంట పాటు పక్కన పెట్టండి. ఫ్రిజ్ లో పెడితే మసాలా ముక్కల లోపలికి బాగా ఇంకి రుచి అద్భుతంగా ఉంటుంది.
-తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం కడాయి పెట్టి నూనె వేడి చేయండి. నూనె వేడెక్కిన తర్వాత మంటను మీడియంలో పెట్టి చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేయండి.
-చేపలు వేగుతున్నప్పుడు వాటిపై కొద్దిగా కాశ్మీరీ కారం పొడి, సోంపు పొడిని చిలకరించండి. ఇది ఈ వంటకం అసలైన సీక్రెట్. దీనివల్ల మంచి సువాసన వస్తుంది.
-ముక్కలు రెండు వైపులా బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకోండి. ఇలా చేయడం వల్ల చేప ముక్కలు బయట కరకరలాడుతూ, లోపల జ్యూసీగా, మృదువుగా ఉడుకుతాయి.
-అంతే వేడి వేడి కాశ్మీరీ ఫిష్ ఫ్రై రెడీ. వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవడమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications









