Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
Ragi Dosa: చాలా సింపుల్ గా కమ్మని రుచితో నిముషాల్లో రాగిదోసె రెడీ..
Ragi Dosa Recipe: ఇంట్లో దోసె పిండి అయిపోయిందా? ఉదయాన్నే ఏం వండాలి అని ఆలోచిస్తున్నారా? మీ ఇంట్లో రాగి పిండి, సేమియా ఉంటే చాలు? అప్పుడు మీరు వాటితో రుచికరమైన దోసెలను చేసుకోవచ్చు.
ఈ రాగి దోసె చేయడం చాలా సులభం. మరియు ఇది పోషకమైనది కూడా. రాగులను నిత్యం తీసుకుంటే శరీరం ఐరన్ లా స్టాంగ్ గా ఉంటుందని చెబుతారు. మరి ఈ రాగి దోసె కొబ్బరి చట్నీని సైడ్ డిష్ గా చేసుకుంటే మరింత అద్భుతంగా ఉంటుంది.
రాగి దోసె ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? రాగి దోస రెసిపీ కోసం ఒక సాధారణ వంటకం క్రింద ఉంది. చదివి రుచి చూసి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి.
కావాల్సిన పదార్థాలు:
* రాగి పిండి - 1 కప్పు
* సేమియా లేదా సూజి రవ్వ - 1 కప్పు
* బియ్యం పిండి - 1/2 కప్పు
* పెరుగు - 1/2 కప్పు
* అల్లం - 1 అంగుళం (సన్నగా తరిగినది)
* పచ్చిమిర్చి - 1 (సన్నగా తరిగినవి)
* కరివేపాకు - కొద్దిగా (సన్నగా తరిగినవి)
* కొత్తిమీర - కొద్దిగా (సన్నగా తరిగినవి)
* పెద్ద ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినవి)
* జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
* మిరియాల పొడి - 1/2 tsp
* నీరు - 3 1/2 కప్పులు
* నూనె - కావలసినంత
తయారుచేయు విధానం:
* ముందుగా ఒక గిన్నెలో రాగి పిండి, సేమియా లేదా సూజి రవ్వ,
బియ్యప్పిండి తీసుకోవాలి.
* తర్వాత పెరుగు, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు,
కొత్తిమీర, ఉల్లి, జీలకర్ర, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు
వేయాలి.
* తర్వాత అందులో 1-2 కప్పుల నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా
కలపాలి.
* తర్వాత 15-20 నిమిషాలు నానబెట్టాలి.
* తర్వాత అందులో 1 1/2 కప్పుల నీళ్లు పోసి పిండిని నీళ్లతో
కలపాలి.
*తర్వాత దోసె పాన్ ను స్టౌ మీద ఉంచి, పాన్ వేడి అయ్యాక ముందుగా కలిపి
పెట్టుకున్న పిండిని దోసెగా పోసి, నూనె వేసి బంగారు రంగు వచ్చేవరకు
ఉడికించుకుంటే రుచికరమైన రాగి దోసె రెడీ.దీనికి కొబ్బరి పచ్చడి బెస్ట్
కాంబినేషన్.
చిత్ర కృప: hebbarskitchen
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












