Latest Updates
-
బయట దొరికేలాగే.. ఇంట్లోనే ఆరోగ్యకరమైన రెడ్ సాస్ పాస్తా ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారు! -
బాధ పెడుతున్నా వదిలిపెట్టలేకపోతున్నారా? మనస్తత్వ శాస్త్రం చెప్పే కారణం ఇది -
నోరూరించే రొయ్యల కొబ్బరి గ్రేవీ.. రెస్టారెంట్ స్టైల్ రుచితో ఇంట్లోనే సులభంగా! -
యుక్త వయసులోనే వేధిస్తున్న తెల్ల జుట్టు సమస్య.. వీటిని నిర్లక్ష్యం చేస్తే అంతే.! -
ముఖానికి విటమిన్ ఇ క్యాప్సూల్స్ వాడుతున్నారా?.. ఈ స్కిన్ టోన్ ఉన్నవారు జాగ్రత్త.! -
దేవుడు మీకు సంకేతాలు ఇస్తున్నాడా? ఈ సూచనలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు -
ప్రేమ పేరిట జైలు జీవితం గడుపుతున్నారా? మీ భాగస్వామిలో ఈ లక్షణాలు ఉంటే అది విషపూరిత బంధమే! -
కొబ్బరి చేపల పులుసు ఇలా చేస్తే అద్భుతమైన రుచి..రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ కోసం ఆ సీక్రెట్ రివీల్! -
జూన్ 1, 2026: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. కెరీర్లో తిరుగులేని విజయాలు మీ సొంతం! -
లో బీపీ ఉన్నప్పుడు ఉప్పు నీళ్లు తాగడం సరక్షితమేనా? సమ్మర్ లో గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం..
Ragi Poori Recipe:రుచికరమైన రాగి పూరిలు ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు..
Ragi Poori Recipe: రాగి పిండిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రాగిపిండితో రాగి ముద్ద, రాగి రొట్టి, రాగి దోసె వంటి వివిధ రకాలు వంటకాలు తయారుచేసుకుని తింటారు. వేసవి కాలం వచ్చిందంటే రాగి అంబలి ఫేమస్. ఒంట్లో వేడి తగ్గించడానికి రాగి అంబలి రోజూ తాగుతారు. రాగిపిండితో తయారుచేసే వంటలు సాధారణ ప్రజల కంటే మధుమేహగ్రత్తులు ఎక్కువ మేలు చేస్తాయనడంలో అతిశయోక్తి లేదు.
ఎందుకంటే ఈ మిల్లెట్ మధుమేహుల్లో శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలో పెరగకుండా చేస్తాయి. డయాబెటిస్ పేషంట్స్ రోజూ రాగి జావా తాగమని డాక్టర్లు చెబుతుంటారు. మధుమేహాన్ని కంట్రోల్ చేసే శక్తి రాగులకు ఉంది. ఈ రోజు మైదాతో చేసిన పూరీలకు బదులుగా ఒకసారి రాగిపిండితో చేసి పూరీలను ప్రయత్నించండి. రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందుతారు. దీనికి ప్రత్యేకంగా కుర్మాలు, సాగులు అవసరం లేదా ఏకూరతో తిన్నా రుచిగా ఉంటుంది. అంతే కాదు వీటిని తయారుచేయడం కూడా చాలా సులభం. మరి ఇంకెందుకు ఆలస్యం రాగి పూరీలను ఎలా తయారుచేయాలో చూసేద్దాం.

Image Courtesy
రాగి పూరీకి కావాల్సిన పదార్థాలు
రాగి పిండి - 1 cup
గోధుమపిండి -1/2 tsp
బంగాళదుంప - 1
నువ్వులు - 1 tsp
కారం - 1/2 tsp
ఇంగువ - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత
నీరు - పిండికలుపుకోవడానికి సరిపడా
రాగి పూరి తయారుచేయు విధానం
1. ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని బంగాళదుంపలను కట్ చేసి వేసి బాగా శుభ్రంగా కడిగి మరో గిన్నెలో వేసుకోవాలి.
2. స్టౌ మీద పాన్ పెట్టి అందులో నీళ్లు పోసి బంగాళదుపంల ముక్కలు వేసి ఉడికించి మెత్తగా చేత్తోనే మెదుపుకోవాలి.
3. తర్వాత బంగాళదుపంల పేస్ట్ లో నే రాగిపిండిని, అరకప్పు గోధుమపిండిని వేయాలి.
4. అదే మిశ్రమంలో పైన సూచించిన విధంగా ఉప్పు, కారం, చిటికెడు ఇంగువ వేసి బాగా స్మూత్ గా కలుపుకోవాలి.
5. రుచికి సరిపడా ఉప్పును సరిచూసుకుని కలుపుకోవాలి. మొత్తం పిండిని గోరువెచ్చని నీటితో పూరీ పిండిలా కలుపుకోవాలి.
6. ఈ కలుపకున్న పిండిని కొద్ది సేపు పక్కన పెట్టి 15 నిముషాల తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీల ఆకారంలో ఒత్తుకోవాలి.
7. పూరీల్లా ఒత్తుకున్న తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి నూనె వేసి వేడెక్కనివ్వాలి.
9. నూనె వేడి అయ్యాక ఆ నీటిలో ఈ రాగి పూరీలను వేసి రెండు వైపులో తిప్పి వేయించాలి.
10. రెండు వైపులా పూరీల్లా పొంగి బాగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి.
11. అంతే రాగి పూరీలు రెడీ. ఈ రాగి పూరీలను ఏ కూరతో తిన్నా రుచిగా ఉంటాయి. కోడి కూరతో తింటే ఇంకా రుచిగా ఉంటుంది. ఎగ్ బుర్జీ కూడా ఇది మంచి కాంబినేషన్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications