Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
కోకోనట్ మిల్క్-సేమియా పాయసం: దీపావళి స్పెషల్
హిందువులు జరుపుకొనే అతి పెద్ద పండుగ దీపావళి. దీపావళి స్పెషల్ దీపాలంకరణ, లక్ష్మీ పూజ, రకరకాల పిండి వంటలు, స్వీట్స్ తో అందరినీ ఆనందపరచడమే. చిన్న పెద్ద, అని లేకుండా అందరూ సంతోషంగా ఎంజాయ్ చేసే దీపావళి పండుగ. దీపావళి వచ్చేస్తుంది..కళ్ళు మిరుమిట్లుగొలేపే దీపకాంతులతో ఇల్లంతా రంగురంగుల రంగోలీలతో.. ఇంటినిండా బంధువులు, స్నేహితులతో సందడిగా జరుపుకొనే పండుగ దీపావళి. పిల్లలు, పెద్దలతో సహా అంతా సరదాపడే పండుగ కూడా దీపావళే. దీపావళి ప్రత్యేకం దీపాలంకరణ అయితే, పిల్లలంతా టపాసులు కాల్చాక అమ్మ చేతి తీపి వంటకాలు ఆనందంగా ఆరగించడం.
దీపావళి స్పెషల్ దీపాలంకరణ, లక్ష్మీ పూజ, రకరకాల పిండి వంటలు, స్వీట్స్తో అందరినీ ఆనందపరచడమే. చిన్న పెద్ద, అని లేకుండా అందరూ సంతోషంగా ఎంజాయ్ చేసే ఈ దీపావళికి కొన్ని రకాల స్వీట్స్ తో ఆథిధ్యం ఇస్తే అథితులు మోచ్చుకోక ఉండలేరు. అటువంటి స్వీట్ డిష్లో పిల్లలకెంతో ప్రీతికరమైన స్వీట్ కోకోనట్ సేమియా పాయసం మరి దీన్నిఎలా తయారుచేయాలో చూద్దాం...

కావలసిన పదార్థాలు:
సేమ్యా: 1cup
పాలు: 1/2ltr
చిక్కని కొబ్బరిపాలు: 1/2cup(పచ్చికొబ్బరి తురిమి గ్రైండ్ చేసి వడగట్టిన కొబ్బరి పాలు)
పంచదార :11/2cup
నువ్వులు, మినప్పప్పు, పెసరపప్పు: 3tsp(అన్నీ కలిపి)
జీడిపప్పు పొడి: 2tsp
యాలకులపొడి: 1/2tbsp
ద్రాక్ష, జీడిపప్పు, బాదం: 1/4cup(అన్నీ కలిపి)
తయారు చేసే విధానం:
1. ముందుగా పాన్ లో నువ్వులు, మినప్పప్పు, పెసరపప్పు విడివిడిగా వేయించాలి. ఈ మూడింటినీ కలిపి మెత్తగా పొడి చేసుకోవాలి.
2. తర్వాత అదే పాన్లో కొద్దిగా నెయ్యి వేసి, జీడిపప్పు, ద్రాక్ష, బాదం దోరగా వేయించి, పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు అదే పాన్లో మరికొద్దిగా నెయ్యి వేసి, సేమ్యాను వేయించి పెట్టుకోవాలి.
4. అంతలోపు మరో పాన్ లో పాలు పోసి, కాగాక కొబ్బరిపాలనూ చేర్చి, మరోసారి మరగనివ్వాలి.
5. ఇప్పుడు సన్నని మంటపై ఉంచి, సేమ్యా వేయాలి. కొద్ది సేపటి తర్వాత పంచదార కలపాలి.
6. ఆతర్వాత అరకప్పు పాలల్లో ముందుగా సిద్ధంచేసిపెట్టుకున్న పొడిని కలిపి, మరుగుతున్న పాలల్లో వేయాలి.
7. పది నిమిషాలయ్యాక జీడిపప్పు, యాలకులపొడి వేసి బాగా కలపాలి. నువ్వులు, మినప్పప్పు, పెసరపప్పు వేయడం వల్ల రుచితో పాటు, చిక్కదనం వస్తుంది.
8. చివరగా జీడిపప్పు, ద్రాక్ష, బాదంతో గార్నిష్ చేయాలి. అంతే, కొబ్బరిపాల సేమ్యా పాయసం రెడీ! దీన్ని వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.



Click it and Unblock the Notifications











