Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే సోన్ పప్పిడి
భారతీయు జరుపుకొనే అతి పెద్ద పండుగ దీపావళి. ఉత్తర భారతదేశంలో ఈ పండుగను అంత్యంత వైభవంగా, ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటారు. విద్యుత్ దీపాళంకరణ ప్రతి ఇల్లు కళకళలాడుతుంటుంది. ప్రతి ఇంట్లోను రంగవల్లులు, పిండివంటలు, కొత్తబట్టలు, బందువులు, స్నేహితులు కిటకిటలాడుతుంటుంది. లక్ష్మీ పూజతో మొదలు పెట్టి టపాకాయలు కాల్చడంతో పూర్తి అవుతుంది. ఈ దీపావళికీ అథితులకు, కుటుంబ సభ్యలకు అత్యంత ఇష్టమైన స్వీట్ మీ కోసం....

కావలసిన పదార్థాలు:
శెనగపిండి/పెసరపిండి: 1.5cups
మైదా: 2cups
పాలు: 2tbsp
పంచదార: 3cups
యాలకులు: 1tsp
నీళ్ళు: 1.5cup
పాలిథిన్ షీట్:
నెయ్యి: 250grms
తయారు చేయు విధానం:
1. ఒక బౌల్ తీసుకొని అందులో శెనగపిండి, మైదాను జల్లించి పెట్టుకోవాలి.
2. తర్వాత ఫ్రైయింగ్ పాన్ స్టౌ మీద పెట్టి అందులో నెయ్యి వేసి కరిగించాలి. అందులో మైదా, శెనగపిండి మిశ్రమాన్ని వేసి తక్కువ మంట మీద కొన్ని నిముషాల పాటు వేయించాలి. మైదా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాక వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
3. అంతలోపు మరో గిన్నెలో నీళ్ళు పోసి మరిగించాలి. నీళ్ళు మరుగుతుండగా అందులో పంచదార, పాలు పోసి మీడియం మంట మీద సిరప్(పాకం)వచ్చేంత వరకూ కలుపుతూ బాగా మరిగించాలి. ఒక్కసారిగా పాకం చిక్కబడే సమయంలో స్టౌ ఆఫ్ చేసి క్రిందికి దింపుకొని చల్లారనివ్వాలి.
4. తర్వాత వేయించి పెట్టుకొన్న మైదా మిశ్రమాన్ని కూడా పేపర్ మీద లేదా తడిలేని ప్లేట్ లో వేసి ఆరనివ్వాలి.
5. తర్వాత బేకింగ్ డిష్ లేదా పాన్ కు నెయ్యి బాగా రాసి పెట్టుకోవాలి. ఇప్పుడు మైదా చల్లబడిన తర్వాత షుగర్ సిరఫ్ లో మైదా మిశ్రమాన్ని వేసి బాగా కలగలపాలి. మైదా షుగర్ సిరఫ్ తో బాగా కలిసిపోయి దారపు పోగుగా మరుతున్న సమయంలో పిండిపోయడం ఆపేసి మైదామిశ్రమాన్ని నెయ్యి రాసి పెట్టుకొన్న బేకింగ్ డిష్ లో పోయాలి.
6. తర్వాత యాలకుల పొడిని చల్లుకొని చల్లారనివ్వాలి. దాని మీద పిస్తా, బాదాం తో గార్ని చేసి పాలీథిన్ కవర్ తో పూర్తిగా కప్పి ఉంచాలి. అంతే సోన్ పప్పిడి రెడీ...



Click it and Unblock the Notifications











