Latest Updates
-
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు!
ఉప్పు చేప పప్పు చారు..రుచిలో దీనికి సాటి మరొకటి లేదు,ఎలా చేసుకోవాలంటే
చాలా సందర్భాలలో ఉప్పు చేప పప్పుచారు అనే పదం విని ఉంటాం. సినిమా పాటల్లో అయినా లేదా రెస్టారెంట్ కి వెళ్లినప్పుడు మెనూలో చూడటం ద్వారా ఇలా అనేక సందర్భాలలో ఈ పదం వింటుంటాం. వాస్తవానికి కోడికూర చిల్లుగారె మాదిరిగానే ఇది కూడా ఓ అద్భుతమైన కాంబినేషన్. ఉప్పు చేప పప్పు చారు అనేది ఒక సాంప్రదాయకమైన, రుచికరమైన వంటకం. ఇది ఏపీ,తెలంగాణ రాష్ట్రాలలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇది రుచికరమైనదే కాకుండా పోషకమైన ఆహారం కూడా. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఇది ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా కలిగి ఉంటుంది. శక్తిని అందిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఉప్పు చేపలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి, ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి. పప్పులో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది, ఇది కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది. చింతపండులో విటమిన్ సి ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రక్తహీనతను నివారిస్తుంది. కండరాలు, ఎముకలను బలపరుస్తుంది.ఇందులో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనత రాకుండా కాపాడుతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. ఆరోగ్యానికి పలు రకాలుగా మేలు చేసే ఉప్పు చేప పప్పు చారుని ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

ఉప్పు చేప పప్పు చారు తయారీకి కావలసిన పదార్థాలు
ఉప్పు చేప: 100 గ్రాములు
కందిపప్పు: 1 కప్పు
టమోటాలు: 2
ఉల్లిపాయలు: 1
పచ్చిమిర్చి: 4
చింతపండు: నిమ్మకాయ సైజు
కొత్తిమీర: 1 కట్ట
కరివేపాకు: 2 రెబ్బలు
ఆవాలు: 1 టీ స్పూన్
జీలకర్ర: 1/2 టీ స్పూన్
మెంతులు: 1/4 టీ స్పూన్
పసుపు: 1/2 టీ స్పూన్
కారం: 1 టీ స్పూన్
నూనె: 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడా
హైదరాబాదీ స్పెషల్ హలీం..దీని రుచికి సాటి మరేదీ ఉండదు,ఇంట్లోనే ఇలా చేసుకోండి
ఉప్పు చేప పప్పు చారు తయారీ విధానం
-ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి, ప్రెషర్ కుక్కర్ లో మెత్తగా ఉడికించాలి.
-తర్వాత ఉప్పు చేపను చిన్న ముక్కలుగా కోసి నీటిలో వేసి 10-15 నిమిషాలు నానబెట్టాలి.
-ఇప్పుడు చింతపండును నీటిలో నానబెట్టి గుజ్జు తీయాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ఆయిల్ పోసి వేడి చేశాక అందులో ఆవాలు,జీలకర్ర,మెంతులు,కరివేపాకు వేసి వేగిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు,పచ్చిమిర్చి వేసి వేయించాలి.
-తర్వాత అందులో టమోటాలు, పసుపు, కారం వేసి మెత్తగా అయ్యేవరకు వేయించిన తర్వాత ఇందులో ఉడికించిన కందిపప్పు, చింతపండు గుజ్జు, తగినంత నీరు పోసి బాగా కలపాలి.
-తర్వాత అందులో ఉప్పు చేప ముక్కలు వేసి 15 నిమిషాలు ఉడికించాలి.
-తర్వాత కొత్తిమీర వేసి, 2-3 నిమిషాలు ఉడికించి దించేయాలి. అంతే ఉప్పు చేప పప్పు చారు రెడీ. అన్నంలో వేడి వేడి ఉప్పు చేప పప్పు చారును తింటుంటే ఆ మజానే వేరుగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications