Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
ఉల్లిపాయలు వాడకుండా ఆలూకర్రీ: నవరాత్రి స్పెషల్
నవరాత్రి తొమ్మిది రోజులు సంతోషంగా సందడిగా జరుపుకునే ఈ పండుగ భారత సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. దసరా ఒక ముఖ్యమైన హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. ఉదయాన్నే మహిళలు లేచి ఇళ్ళు, వాకిళ్ళు కడిగి ముగ్గులు వేస్తారు. స్నానపానాదులు చేసి భాగ్యదాయిని, సౌభాగ్యదాయిని అయిన దేవి మాతను కొలుస్తుంటారు.
నవరాత్రులు ఒక్కో రోజు.. ఒక్కో పేరుతో అమ్మవారిని కొలిచి చివరి రోజున చేసుకునే వేడుక విజయదశమి.. ఈ నవరాత్రి సందర్భంగా ఇల్లలో స్పెషల్ గా కొన్ని వంటలు తయారుచేసుకుంటారు. అయితే వెజిటేరియన్ వంటలకు ఉల్లిపాయ, వెల్లుల్లి ఉపయోగించకుండా వంటలు తయారుచేసుకుంటారు. అటువంటి వంటల్లో ఆలూ కర్రీ ఒకటి. ఉపవాసం ఉండే వారికి ఇది ఒక హెల్తీ వెజిటేరియన్ ఫుడ్. మరియు త్వరగా తయారుచేసుకోవచ్చు. మరి ఈ ఆలూ కర్రీని ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
బంగాళదుంపలు: 4-5(ఉడికించి, పొట్టుతీసి, 4బాగాలుగా కట్ చేసుకోవాలి)
టమోటో: 2(సన్నగా కట్ చేసి పేస్ట్ చేయాలి)
పచ్చిమిర్చి: 3-4(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
పసుపు పొడి: 1tsp
కారం పొడి: 1tsp
ధనియాల పొడి: 2tsp
జీలకర్ర మరియు ఆవాలు: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2tbsp
నీళ్ళు : 1cup
కొత్తిమీర తరుగు: 2tbsp(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక బౌల్ తీసుకొని, అందులో కారం, ఉప్పు, పసుపు, ధనియాలపొడి మరియు కొద్దిగా నీళ్ళు వేసి చిక్కగా పేస్ట్ లా తయారుచేసుకోవాలి.
2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి, కాగిన తర్వాత అందులో జీలకర్ర మరియు ఆవాలు వేయాలి.
3. ఆవాలు చిటపటలాడిన తర్వాత ముందుగా తయారుచేసి ఉంచుకొన్న మసాలా పేస్ట్ ను వేసి మీడియం మంట మీద రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
4. తర్వాత టమోటో మరియు పచ్చిమిర్చి వేసి, మెత్తబడే వరకూ వేగించుకోవాలి. వేగిన తర్వాత అందులో నీళ్ళు పోసి బాగా ఉడికించాలి.
5. ఇప్పుడు ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకొన్నబంగాళదుంపలు వేసి వేసి గ్రేవీ చిక్కబడే వరకూ ఉడికించుకోవాలి.



Click it and Unblock the Notifications