Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
మళ్ళీ.. మళ్ళీ తినాలనిపించే ‘నీరు దోసె’
మళ్ళీ.. మళ్ళీ తినాలనిపించే ‘నీరు దోసె’
'దోసె' సౌత్ ఇండియన్ స్పెషల్ బ్రేక్ ఫాస్ట్. దోసెలో కూడా వివిధ రకాలున్నాయి. ప్లెయిన్ దోసె, ఆనియన్ దోసె, మసాలా దోసె, ఎగ్ దోసె, ఇలా... ఈ దోసెలు ఒక్కోరకమైన టేస్ట్ ను అందిస్తాయి. వీటితో పాటు మరో కొత్త రుచిని రుచిచూడాలిపిస్తే ఈ నీరు దోసె ప్రయత్నించవచ్చు. ఇది అన్ని రకాల దోసె ఐటమ్స్ కంటే కొంచె డిఫరెంట్ టేస్ట్ కలిగి ఉంటుంది. చూడాటానికి మల్లెపువ్వు కాంతితో మెరిసిపోతూ పేపర్ లా అతి పలుచగా ఉంటుంది.
ఈ నీరు దోసె అంత అద్భుతమైన రుచి అందించడానికి కారణం, అందులో కలుపుకొనే పచ్చికొబ్బరి పాలు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. లోక్యాలరీలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఈ నీరు దోసె కర్ణాటకలో చాలా ప్రసిద్ది. ఈ నీరు దోసెను టమోటో లేదా కొబ్బరి చట్నీలేదా ఫిష్ కర్రీతో తింటే చాలా అద్భుతమైన టేస్ట్ కలిగి ఉంటుంది. మరి ఇంకెదుకు ఆలస్యం....
కావల్సిన పదార్థాలు:
బియ్యం: 2 cups(బియ్యాన్ని శుభ్రం చేసి, నీళ్ళలో రాత్రంతా నాబెట్టాలి)
పచ్చి కొబ్బరి తురుము: 1cup
జీలకర్ర: 1 tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత
నీళ్ళు: పిండి రుబ్బుకోవడానికి సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా రాత్రంతా నానబెట్టి పెట్టుకొన్న బియ్యంలో నీరు వంపేసి ఆ బియ్యాన్ని మరియు కొబ్బరి తురుమును మెత్తని పేస్ట్ లా (తగినన్ని నీళ్ళు కలుపుతూ చిక్కటి పాలులా, పిండిని) గ్రైండ్ చేసి ఒక గంట పాటు పక్కన పెట్టేయాలి.(కొబ్బరి తురుము విడిగా కూడా గ్రైండ్ చేసి ఆ పాలను పిండిలో కలుపుకోవచ్చు).
2. ఒక గంట తర్వాత గ్రైండ్ చేసిన పిండిలో జీలకర్ర, ఉప్పు మరియు చెంచా నూనె వేసి బాగా మిక్స్ చేయాలి.
3. ఇప్పుడు దోస పాన్ స్టౌమీద పెట్టి వేడిఅయ్యాక దోసె పిండిని దోసెలా వేయాలి.
4. ఈ పలుచని దోసె పిండి పాన్ మొత్తం అమరేలా పాన్ ను మరో చేత్తో పట్టుకొని వంచి దోసె వేయవచ్చు.
5. తర్వాత దాని మీద కొద్దిగా ఆయిల్ చిలకరించి మరో నిముషం పాటు కాలనివ్వాలి. ఈ దోసెను రెండో వైపు కాల్చాల్సిన అవసరం లేదు. పలుచగా ఉండటం వల్ల పూర్తిగా కాలుంటుంది. అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది. అంతే సర్వ్ చేయడానికి టేస్టీ నీరు దోసె రెడీ.
ఈ రుచికరమైన నీరుదోసెను టమోటో చట్నీ లేదా కొబ్బరి చట్నీతో ఆరగించవచ్చు.



Click it and Unblock the Notifications











