Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
బంగాళదుంప-పచ్చిబఠానీ పులావ్
పీస్(పచ్చిబఠానీలు)-పొటాటో(బంగాళదుంప)ల పులావ్ ఇండియాలో చాలా పాపులర్ రిసిపి. దీన్ని నార్త్ ఇండియన్స్ మట్టర్ పీస్ కా పులావ్ అని కూడా పిలుస్తారు . ఎటువంటి సందేహం లేకుండా ఇది ఒక టేస్టీ డిష్ అంతే కాదు హెల్తీ కకూడా . ఆలూ మట్టర్ పులావ్ కు వివిధ రకాల ఇండియన్ మసాలా దినుసులు జోడించడం వల్ల ఆరోమా వాసనతో నోరూరిస్తుంటుంది.
ఆలూ మట్టర్ కా పులావ్ ను తయారుచేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. మీకు ఏదైన ఒక మంచి వంట చేయాలనుకొన్నప్పుడు ఇటువంటి సింపుల్ వంటకాలను ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా ఆలూ మట్టర్ కా పులావ్ రిసిపి పంజాబీయలు ఎక్కువగా వడుతుంటారు. ఈ టేస్టీ ఫుడ్ ను పెద్దలతో పాటు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి ఈ హెల్తీ అండ్ టేస్టీ ఆలూ మట్టర్ కా పులావ్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం....

కావల్సిన పదార్థాలు:
బాస్మతి రైస్: 2 cups
బంగాళదుంపలు: 2 (ఉడికించి ముక్కలు చేసి పెట్టుకోవాలి)
పచ్చిబఠానీలు: ½ cup(ఉడికించినవి)
ఉల్లిపాయలు: 2(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
జీలకర్ర : 1tbsp
యాలకలు: 2-4
లవంగాలు:- 2-3
దాల్చిన చెక్క : కొద్దిగా
పెప్పర్: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా బాస్మతి రైస్ ను శుభ్రంగా కడిగి 10నిముషాలు పక్కన పెట్టుకోవాలి .
2. ఇప్పుడు, పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత అందులో యాలకలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి సువాసన వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
3. తర్వాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న బంగాళదుంపలు, పచ్చిబఠానీలు మరియు ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.
4. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తర్వాత అందులో బియ్యం వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి 2 కప్పులు నీళ్ళు పోయాలి.
5. అలాగే రుచికి సరిపడా ఉప్పు, పెప్పర్ వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి. మీడియం మంట మీద 15నిముషాలు ఉడికించుకోవాలి.
అంతే ఆలూ మట్టర్ కా పులావ్ రెడీ. దీన్ని వేడి వేడిగా రైతా లేదా ఊరగాయతో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.



Click it and Unblock the Notifications