Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
భార్య భర్తల మధ్య సెల్ ఫోన్ల తంట...!
సెల్ ఫోన్లు మాటలను, మనుషులను కలుపుతాయని అనుకోవడం పొరపాటని అంటున్నారు శాస్త్రజ్ఞులు. ఇవి మనుషుల మధ్య సంబంధాలను తెంచి పారేస్తాయని అంటున్నారు. మొబైల్ ఫోన్లను ఖాళీగా గదిలో ఓ మూలన పడవేసినా ఇతరులతో మనం జరిపే సంప్రదింపులపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఎసెక్స్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. సెల్ఫోన్ వల్ల ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాల్లో వచ్చే తేడాలను గర్తించడానికి రెండు ప్రయోగాలను వారు చేశారు. ఈ ప్రయోగాలలో సెల్ ఫోన్ వల్ల వ్యక్తుల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నట్లు కనుగొన్నారు.
ఇద్దరు వ్యక్తుల మధ్యే కాదు, ఇద్దరు స్నేహితులు కావచ్చే, ప్రేమికులు కావచ్చు, రక్త సంబంధాలు కావచ్చు, భార్త భర్తల మధ్య బంధాలు దూరం అవుతున్నాయి. భార్యాభర్తల మధ్య అనురాగానికి, ఆత్మీయతలకు నడుమ... సెల్ ఫోన్లు వచ్చి చేరడంతోపాటు, అవి వారి సాంసారిక జీవితానికే చిచ్చుబుడ్డీలుగా మారుతున్నాయి. దాంపత్య జీవనంలో సాంకేతిక పరికరాల జోక్యం ఎక్కువ కావడం వల్లనే ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని పలువురు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదే విషయాన్ని భారతీయ గృహిణులు ఇలా చెబుతున్నారు... మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఎంపీ3 ప్లేయర్లు, ఐపాడ్లు, వీడియో గేమ్స్ లాంటివి తమ సంసారంలో అడ్డుగోడలుగా నిలుస్తున్నాయనీ, తమపచ్చని సంసారంలో చిచ్చు పెడుతున్నాయని వారు వాపోతున్నారు.

సాంకేతిక విప్లవంతో ఎన్నో రకాల యంత్ర పరికరాలు జీవన విధానంలో భాగమై పోవడమే కాకుండా, భారతీయ గృహిణులకు అక్రమ సంబందాలుగా తయారవుతున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తన భర్త తనతో కంటే ఎక్కువగా మొబైల్ ఫోన్తోనో, ల్యాప్టాప్తోనో గడిపేస్తున్నారని, తనకంటే ముందుగా అవి పడకగదిలోకి చేరిపోతున్నాయని చాలామంది మహిళలు ఆరోపిస్తున్నారు.
ప్రశాంతంగా, సరదాగా గడిపేందుకు అలా షికారుకెళితే... తనను పక్కన పెట్టేసి... ఫోన్తోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారంటూ భర్తల ఘనకార్యాలను దుయ్యబట్టని మహిళలు ఈరోజుల్లో చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. ఇక సెల్ఫోన్ ఇంట్లో వదిలేసి వెళ్ళడమే గాకుండా, తనకు వచ్చిన కాల్స్ ఎందుకు అటెండ్ చేశావనీ, తన ల్యాప్టాప్ ఎందుకు ఉపయోగించావని నానా యాగీ చేసే పురుష పుంగవులతో ఇంట్లో జీవితం నరకప్రాయం అవుతోందని గృహిణులు ఆవేదన చెందుతున్నారు.
ఈ మధ్యకాలంలో అనేకమంది దంపతులు సాంకేతిక పరికరాలకు సంబంధించిన సమస్యలతోనే తమవద్దకు వస్తున్నారని ప్రముఖ మానసిక వైద్యులందరూ కూడా చెబుతున్నారు. తమమధ్య అనేక విబేధాలకు, అపోహలకూ కారణమవుతున్న సెల్ఫోన్ల నుండి విముక్తి అనేది లేనే లేదా... తమ భర్తలు బాగుపడే మార్గమే లేదా..? అని గృహిణులు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారు.
నేటి స్పీడ్ యుగంలో సాంకేతిక పరికరాల అవసరం, వినియోగం ఎక్కువగా ఉన్నప్పటికీ... అవి దాంపత్య సంబంధాలనే విచ్చిన్నం చేసే పరిస్థితి మాత్రం ఎదురైతే సాధ్యమైనంతగా వాటి వాడకం నుంచి బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భర్తలు ఈ దిశగా ఆలోచించి అడుగులు వేసినట్లయితేనే... వారి సాంసారిక జీవితంలో సాఫీలేకుండా సాగిపోతుంది.



Click it and Unblock the Notifications