Latest Updates
-
కూరలను కూడా పక్కన పెట్టి కడుపు నిండా తినేలా చేసే కాలీఫ్లవర్ పచ్చడి.. ఆవకాయ కంటే ఈజీగా.! -
దివ్యమైన మంగళ గోచారం: 55 రోజుల పాటు ఈ నాలుగు రాశుల వారికి రాజయోగమే.! -
బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. ఇంట్లో ఉన్న వాటితోనే క్రిస్పీ పొటాటో రింగ్స్..ఎలా చేసుకోవాలంటే.. -
కొవ్వు తక్కువ, పోషకాలు ఎక్కువ..థైరాయిడ్ పేషెంట్లకు మఖానా ఎందుకు బెస్ట్? -
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది!
హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో నేల మీద పెట్టకూడని 5 వస్తువులు..!
హిందు దర్మశాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కొన్ని వస్తువులను కింద పెట్టకూడదు. అలా పెడితే అంతా అశుభమే జరుగుతుందని నమ్మకం. ఇంతకీ అస్సలు క్రింద పెట్టకూడని ఆ 5 వస్తువులు ఏమిటో తెలుసుకుందాం..
హిందూ దర్మశాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఎంతో పవిత్రంగా చూసుకుంటాం. వాటిని క్రింద కానీ, అశుభ్రమైన ప్రదేశాలలో కాని, మంచం మీద కాని పెట్టము. పూజకు ఉపయోగించే పూలు, కొబ్బరికాయ, అగర్ బత్తీలు, కర్పూరం...లాంటి వస్తువలును కింద పెట్టము, ఒక వేళ కింద పెడితే వాటిని పూజకు ఉపయోగించము. అలా ఉపయోగిస్తే అశుభం జరుగుతుందని హిందులవల నమ్మకం.
వీటితో పాటు హిందు దర్మశాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కొన్ని వస్తువులను కింద పెట్టకూడదు. అలా పెడితే అంతా అశుభమే జరుగుతుందని నమ్మకం. ఇంతకీ అస్సలు క్రింద పెట్టకూడని ఆ 5 వస్తువులు ఏమిటో తెలుసుకుందాం..

దీపం:
దేవుడి ముందు పెట్టే దీపాలను నేల మీద ఎట్టి పరిస్థితిలోనూ పెట్టరాదు. వాటిని వెలిగించినా, వెలిగించకపోయినా ఎల్లప్పుడూ వాటిని శుభ్రమైన వస్త్రంపైనే ఉంచాలి. ఇలా నేలపై పెట్టరాదు. అలా చేస్తే దేవుళ్లు, దేవతలను అవమానించినట్టే అవుతుందట.

బంగారం:
బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా చూస్తారు. అలాంటి బంగారాన్ని నేలపై పెడితే లక్ష్మీదేవి ఆగ్రహానికి లోనై అనేక కష్టాలు పడతారు. అలా చేస్తే వారి వద్ద ధనం నిలవదట. అన్నీ సమస్యలే వస్తాయట.

జంధ్యం:
హిందువుల్లో చాలా మందికి జంధ్యం ధరించే ఆచారం ఉంటుంది. అయితే దాన్ని నేలపై మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టరాదు. తల్లిదండ్రులు, గురువులకు ప్రతి రూపంగా దాన్ని భావిస్తారట. ఆ క్రమంలో జంధ్యంను కింద పెడితే వారిని అవమానించినట్టే అవుతుందట. అందుకని దాన్ని ఎప్పుడూ నేలపై పెట్టకూడదు.

శంఖువు:
శంఖువులో సాక్షాత్తూ లక్ష్మీ దేవి కొలువై ఉంటుందట. కాబట్టి దాన్ని కూడా నేలపై పెట్టరాదు. పెడితే ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.

సాలిగ్రామం:
నేపాల్లోని గండకీ నది తీరంలో ఓ రకమైన నల్ల రాయి దొరుకుతుంది. దాన్ని సాలిగ్రామం అంటారు. ఈ రాయి విష్ణువుకు ప్రతిరూపమని చెబుతారు. సాలాగ్రామం నేలపై అస్సలు పెట్టకూడదు. అలా చేస్తే అన్నీ సమస్యలే ఎదురవుతాయట. ఒక వేళ వాటిని నేలపై పెట్టాల్సి వస్తే చెక్కతో చేసిన శుభ్రమైన ఉపరితలంపై ఉంచాలట.

శివలింగం.
శివలింగం నేలపై అస్సలు పెట్టకూడదట. అలా చేస్తే అన్నీ సమస్యలే ఎదురవుతాయట. ఒక వేళ వాటిని నేలపై పెట్టాల్సి వస్తే చెక్కతో చేసిన శుభ్రమైన ఉపరితలంపై ఉంచాలట.



Click it and Unblock the Notifications
