Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
హిందూ పురాణాల ప్రకారం ఉత్తమ తండ్రి
తల్లిలాగే, తండ్రికూడా పిల్లల పెంపకంలో గొప్ప పాత్రను పోషిస్తాడు. తల్లి చాలా మృదువైన స్వభావం కలది, ప్రేమగా బిడ్డను పెంచుతుంది. మరోవైపు, తండ్రి చాలా బలవంతుడు, పిల్లలతో చాలా చనువుగా ఉంటాడు. చాలామంది పిల్లలకు వారి తండ్రే ఒక నాయకుడు, పిల్లలు వారి అడుగుజాడలను అనుసరించే ఒక రోల్ మోడల్.
హిందూ పురాణాలలో బలమైన, ఆకర్షణీయమైన కుమారులు, కుమార్తెలను పెంచిని గొప్ప తండ్రులు అనేకమంది ఉన్నారు. వారి పాత్రల ధర్మాలను, ఉదాత్తతను తెలియచేసే అనేక కధలు ఉన్నాయి. ఈ కధలు ఆకాలం కొడుకులు, కుమార్తెలు వారి తండ్రులను ఎలా గౌరవి౦చే వారో ప్రతి ఒక్కరూ ప్రతిఒక్కటీ తెలుసుకోవాలని చెప్పారు.
ఈరోజుల్లో, ఫాదర్స్ డే సందర్భంగా, తల్లిదండ్రులు, ముఖ్యంగా తండ్రులు గొప్ప గౌరవాన్ని పొందిన కొన్ని కధలు మేము తీసుకోచ్చము. తండ్రి మాట కోసం కొంతమంది చనిపోయారు, మరికొందరు తమ తండ్రిమాటను అనుసరించారు. మరిన్ని విషయాలు చదివి తెలుసుకోండి.

హిందూ పురాణాల ప్రకారం ఉత్తమ తండ్రి
దశరధుడు, రాముడు
అయోధ్యకు రాజు దశరధుడు, ఆయన మొదటి కుమారుడు రాముడు. దశరధుడి తరువాత రాముడు సింహాసనాన్ని అధిరోహించాలి. కానీ దశరధుడి రెండో భార్య కైకేయి రాముడిని రాజ్య బహిష్కరణ చేసి; ఆమె కుమారుడైన భరతుడికి పట్టాభిషేకం చేయమని కోరింది. పూర్వం దశరధుడు ఆమెకు ఇచ్చిన వరాలను ఆమె ఉపయోగించుకుంది. దశరధుడు ఏమీ చేయలేకపోయాడు. రాముడు వెంటనే ఎటువంటి బాధ లేకుండా తల్లి కోరికను అంగీకరించి, అడవులకు వెళ్ళిపోయాడు. రాముడు తన తండ్రి దశరధుడు సవతి తల్లి కైకకు ఇచ్చిన వరం కారణంగా తండ్రి మాటని గౌరవించడం కోసం ఇలా చేసాడు.

హిందూ పురాణాల ప్రకారం ఉత్తమ తండ్రి
శంతనుడు, భీష్ముడు
హస్తినాపురానికి రాజు శంతనుడు. ఇతనికి గంగ వల్ల దేవవ్రతుడు అనే కుమారుడు జన్మించాడు. తరువాత, శంతనుడు చేపలుపట్టే వాని కుమార్తె అయిన సత్యవతిని ప్రేమించాడు. శంతనునికి ఇప్పటికే ఒక కుమారుడు ఉన్నాడు, ఇతని తరువాత అతనే రాజు అని తెలుసుకుని సత్యవతి శాంతనుడిని వివాహం చేసుకోడానికి నిరాకరించింది. ఆమె శాంతనుడిని పెళ్ళిచేసుకుంటే, తన కుమారులు రాజ్యాన్ని స్వీకరించలేరు, దేవవ్రతుని కిందే ఉంటారు అని అనుకుంది. దేవవ్రతుడు ఈ విషయం తెలుసుకుని, తన సింహాసనాన్ని పరిత్యజించాడు. ఈ భయంకరమైన ప్రతిజ్ఞ కారణంగా, దేవవ్రతుడు భీష్ముడిగా పిలవబడ్డాడు. భీష్ముడు ఇదంతా తన తండ్రి సంతోషం కోసం చేసాడు.

హిందూ పురాణాల ప్రకారం ఉత్తమ తండ్రి
జమదగ్ని, పరశురాముడు
పరశురాముడు విష్ణుమూర్తి ఆరో రూపం. ఈయన జమదగ్ని, అనసూయలకు జన్మించాడు. ఒకసారి, రేణుక నీటికోసం నదికి వెళ్ళింది. అక్కడ, ఆమె ఒక రాజు తన ఉంపుడుగత్తేలతో ఉండడం చూసింది. ఆ వెంటనే, రేణుక మనసు చలించి, తీవ్రమైన లైంగిక వాంఛలకు దారితీసింది. ఆమె భర్త జమదగ్ని, తన శక్తి వల్ల అక్కడ ఏమి జరిగిందో తెలుసుకున్నాడు. కోపంతో, తన కుమారులను పిలిచి భార్యను చంపమన్నాడు. పెద్ద పిల్లలు అతని మాట వినలేదు, పరశురాముడిని ఈపని చేయమన్నాడు. పరశురాముడు వెంటనే తన తల్లి తలను నరికాడు. పరశురాముడి విధేయతకు సంతోషించి, జమదగ్ని ఒక వరం కోరుకోమన్నాడు. అప్పుడు పరశురాముడు తన తల్లిచేసిన తప్పును క్షమించి ఆమెకు తిరిగి ప్రాణదానం చేయమని అడిగాడు.



Click it and Unblock the Notifications











