Just In
- 2 hrs ago Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- 3 hrs ago గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- 5 hrs ago ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- 7 hrs ago ఈ 4 రాశులకు శుక్రుడు, రాహువు కలయిక గొప్ప ఫలితాలిస్తాయి, ఏప్రిల్లో డబ్బు వర్షం కురుస్తుంది
శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం మామిడి పండ్లు నైవేద్యం పెట్టండి!
శుక్రవారం అంటే.. అమ్మవారికి ఎంతో ప్రీతికరం. అందులోనూ లక్ష్మీదేవికి ప్రతిరూపం శుక్రవారం. కాబట్టి ఇంట్లో అమ్మవారికి రకరకాల పూలతో అలంకరించి, నైవేద్యం సమర్పించి పూజలు చేయడం వల్ల ఆ తల్లి ఆశీస్సు పొందవచ్చు. అలాగే శుక్రవారం మహిళలు ఎరుపు లేదా ఆకుపచ్చ వంటి రంగుల దుస్తులు ధరించి, కాళ్లూ, చేతులు, ముఖానికి పసుపు రాసుకుని లక్ష్మీదేవిని పూజిస్తే.. ఆ తల్లి కరుణా కటాక్షాలు ఉంటాయి. అలాగే ఆ ఇంటి సిరిసంపదలు, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.
శ్రీమహాలక్ష్మి విష్ణుమూర్తి గుండెల్లో ఉంటుంది అయితే ఆవిడా ఈ కలియుగానికి మూల స్తంభం అయితే శ్రీమహాలక్ష్మి కరుణ పొందాలంటే చాలా రకాలా పద్ధతులు ఉన్నాయి. అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోయాది ఆతి ముఖ్యమైనది మరియు చాలా శుభదాయాకం. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి మనం చాలా రకాల పూజలు, పువ్వులు, నియామాలు పాటించాము అయితే ఇప్పుడు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పని ఇప్పుడు మనం చెయ్యబోతున్నాం.
ప్రతి శుక్రవారం మనం లక్ష్మీదేవి ఫోటో లేదా ప్రతిమను శుభ్రం చేసి గంధం మరియు కుంకుమ బొట్టు పెట్టాలి అలాగే వివిధరకాల పరిమళం కలిగిన పువ్వులను సమర్పించాలి.
లక్ష్మీదేవికి నమస్కారం చెబుతూ ఆహ్వానించే స్తోత్రం మహాలక్ష్మి అష్టకం ఇది కనీసం ఒక్కసారైనా చదవాలి.
ఇప్పుడు పూజ లో ఆఖరి ఘట్టం నైవేద్యం సమర్పించడం, అయితే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నైవేధ్యాలలో మామిడి పండ్లు చాలా ప్రీతికరం, అవునండి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి మామిడిపండ్లను కనుక నైవేద్యంగా పెడితే అష్టైశ్వర్యాలు మీ సొంతం అంతే కాకుండా ఆ కుటుంబంలో ఎప్పుడు డబ్బుకి లోటు ఉండదు అలాగే వ్యాపారస్తులు కూడా ఇలాగా చెయ్యడం ద్వారా వ్యాపారాల్లో ఉన్నత స్తితికి వెళ్తారు.
అమ్మవారికి రెండు మామిడి పండ్లు (బాగా పండినవి) పచ్చివి అస్సలు వాడరాదు.
నైవేద్యంగా పెట్టి, అది కుటుంబం మొత్తం తీసుకుంటే ఆ ఇంట్లో డబ్బుకి లోటు ఉండదు, అలాగే ఆర్ధికంగా ఎదగాలి లేదా వ్యాపారం అభివృద్ధి అవ్వాలంటే నైవేద్యం పెట్టిన మరో రెండు తియ్యని మామిడి పండ్లను ఒక ముత్తైదువకి బొట్టు పెట్టి ఇస్తే మీ ఇంట్లో ధనం వర్షంలా కురుస్తుంది.
అలాగే శ్రీమహాలక్ష్మికి తియ్యని మామిడి రసం లేదా మామిడి ముక్కలు నైవేద్యంగా పెట్టి అది ఉదయాన్నే టిఫిన్ తినే ముందు మొదటి ఆహారంగా ఇవి తీసుకున్న లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలు సిద్దిస్తాయి.
అలాగే నైవేద్యం పెట్టిన మామిడిపండ్లు మొత్తం కుటుంబ సభ్యులకు ఇవ్వాలి ఇలాగా చేస్తే పిల్లల్లో చెడు గ్రహ దోషాలు మరియు కుటుంబంలో దారిద్ర్యం మొత్తం పోతాయి.
ఒకవేళ ఆర్ధిక భాదలు బాగా ఇబ్బంది పెడుతుంటే మాత్రం రోజు ఈ రకంగా చేస్తే చాలా త్వరగా అప్పుల బాధలు ఆర్ధిక సమస్యలు దూరం అవుతాయి.