Just In
- 12 min ago Today Horoscope 29 March 2024 :ఈరోజు ఈ రాశుల ఆర్థిక స్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది...
- 7 hrs ago Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- 9 hrs ago గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- 11 hrs ago ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
టెంపుల్స్ లో ఎంత టెక్నాలజీ దాగి ఉందో తెలుసా...
సనాతన ధర్మం ప్రకారం దేవాలయాల్లో ఎలాంటి టెక్నాలజీ ఉండేదో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచంలోని హిందువులలో మెజార్టీ శాతం మంది ప్రజలు దేవుడిని నమ్ముతారు. అందుకే ప్రతి ఒక్కరూ తమ కుల దైవం మరియు నచ్చిన దైవాన్ని కొలుస్తూ ఉంటారు. ఆ దేవుళ్లకు సంబంధించిన దేవాలయాలకు వెళ్తుంటారు.
అలా వెళ్లే వారిలో చాలా మంది తమ కోరికలన్నీ నెరవేరాలని.. తమ కష్టాలన్నీ తొలగిపోవాలని.. తాము ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు.
వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. హిందూ సనాతన సంప్రదాయంలో ఎంతో టెక్నాలజీ దాగి ఉంది. అందుకే మన పండితులు, పెద్దలు అనునిత్యం దేవాలయాలకు వెళ్లి రండి అని చెబుతూ ఉంటారు. వారు ఎందుకు అలా చెబుతారు. దాని వెనుక ఉన్న రహస్యాలేంటి.. అసలు అప్పట్లోనే దేవాలయాల్లో టెక్నాలజీ ఎలా వాడారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Kumbh Mela 2021: సరిగ్గా 83 ఏళ్ల తర్వాత కుంభమేళాలో మళ్లీ ఇప్పుడు అది రిపీట్ అయ్యింది...
తరంగాలు కలిసేచోట..
మన భూమిలో ఎక్కడైతే ఎలక్ట్రానిక్ మరియు విద్యుత్ అయస్కాంత తరంగాలు కలుస్తాయో అక్కడే దేవాలయంలోని మూల విరాట్ ఉంటుంది. వాటిని ఆలయాల్లో ప్రతిష్టించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు క్యాటలిస్టుగా పని చేస్తాయి.
దేవాలయ దర్శనం..
మనలో చాలా మంది దేవాలయాలకు వెళ్లినప్పుడు ప్రదక్షిణలు చేస్తుంటారు. అయితే చాలా మంది అందరూ ఎడమవైపు నుండి (Clockwise Direction) ప్రదక్షిణలు చేస్తారు. ఎవ్వరూ అందుకు యాంటీక్లాక్ వైపు నుండి చేయరు. అలా ఎందుకు తిరుగుతారంటే.. అలా తిరిగినప్పుడు అక్కడే ఉండే తరంగాల శక్తి మన దేహానికి వస్తుందని చాలా మంది నమ్మకం. ఇవి మన బాడీలోని షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి.
మంత్రాలు..
ప్రతి దేవాలయంలోనూ పూజారులు మంత్రాలను చదువుతూ ఉంటారు. అయితే ఈ మంత్రాలు ఎందుకు చదువుతారనే విషయం చాలా మందికి తెలియదు. పూజారులు మంత్రాలు ఎందుకు చదువుతారంటే.. అక్షర నియమంతో ఉండే మంత్రాలు ఒక లయగా ఉండి న్యూరాన్లను ఉత్తేజపరుస్తాయి.
Vastu Shastra Tips : రోజూ సాయంకాలం వేళ ఈ పనులు చేస్తే కష్టాలను కొనితెచ్చుకున్నట్టే...!
బంగారానికి తరంగాలకు లింక్..
మనం దేవాలయాలకు వెళ్లేటప్పుడు మన పెద్దలు మంచి ఆభరణాలు వేసుకోమని చెబుతూ ఉంటారు. అయితే వీటి ద్వారా మన ఆడంబరాలను చూపించడానికి అనుకుంటే మీరు పొరబడినట్లే.. ఎందుకంటే ఈ బంగారు ఆభరణాలు తరంగాలను బాగా గ్రహిస్తాయట.
గర్భగుడి గురించి..
మన హిందూ దేవాలయాల్లో చాలా వాటికి గర్భగుడులు ఉంటాయి. ఈ గర్భగుడి ఎప్పుడూ ఒక వైపుకు మాత్రమే ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే గర్భగుడిలో ఎదురుగా ఉండకుండా ఒకవైపుకే ఉండాలని మన పెద్దలు చెబుతుంటారు.
తడిబట్టలు ఎందుకంటే..
మనలో చాలా మంది దేవాలయాలకు తడి బట్టలతో వెళ్తుంటారు. దీన్ని మడి ఆచారం అని కూడా అంటూ ఉంటారు. సాధారణంగా తడి బట్టలకు ఆక్సీజన్ ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది. దీని వల్ల అనేక ఉపయోగాలు కూడా ఉన్నాయి.
హారతి..
ప్రతి దేవాలయంలో భక్తులకు హారతి ఇస్తుంటారు. పచ్చకర్పూరానికి ఎన్నో ఔషధగుణాలు ఉంటాయి. హారతి తీసుకునేటప్పుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి. దీనిని ఆయుర్వేద పరిభాషలో స్వేదకర్మ అని అంటారు. అయితే ఎక్కడో దూరంలో ఉండే హారతిని కళ్లకు అద్దుకుంటే మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు.
అభిషేకం తర్వాత..
ఇక మన దేవాలయాల్లో దేవుళ్లకు అభిషేకరం చేసిన తర్వాత తీర్థం ఇస్తుంటారు. ఆ తీర్థంలో పచ్చకర్పూరం, తులసి, లవంగాలు మరియు పంచామ్రుతంతో పాటు అభిషేకం చేసిన వాటిని తీర్థంగా ఇస్తుంటారు.
ఇంత ఆధునిక సాంతికేతికత ఉన్న మన దేవాలయాలు మానసిక, శారీరక సుఖాన్ని అందిస్తాయి.