Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్నెస్పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
మిమ్మల్ని ప్రేమించే వారే భాగస్వామి కావాలనుకుంటే... ఈ పరిహారాలను పాటించండి...
వివాహం ఆలస్యం అవుతుంటే ఈ రెమెడీస్ ట్రై చెయ్యాలంట.
పెళ్లి అనే రెండక్షరాలు చాలా మంది జీవితాల్లో ముఖ్యమైన ఘట్టం. ఆధ్యాత్మిక శాస్త్రాలను.. అనేక సంప్రదాయాలను, కటుబాట్లను అనుసరించి జరిపే ఒక ప్రధానమైన కారణం. ప్రస్తుతం మన దేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి మూడు పదుల వయసు దాటినప్పటికీ.. పెళ్లిళ్లు కావటం లేదు. కరోనా వైరస్ వంటి మహమ్మారి కూడా కళ్యాణం వంటి కమనీయ కార్యక్రమాలకు బ్రేకులేసింది.

కొంతమందికి వివాహం విషయంలో ఏవేవో కారణాల వల్ల ఆలస్యమవుతుంటే.. మరికొంతమందికి ఉద్యోగం, సంపాదన వంటి కారణాల వల్ల.. ఇంకొందరికి లాక్ డౌన్ ప్రభావం వల్ల పెళ్లి అనే తంతు వాయిదా పడుతూ వస్తోంది.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వివాహం ఆలస్యం కావడానికి కారణం జాతకాల్లో ఏవైనా దోషాలు ఉండటమేనని పండితులు చెబుతున్నారు. మీ జాతకంలో పంచమ స్థానంలో రాహువు గాని లేదా కేతువు గాని ఉండి ఎటువంటి శుభగ్రహ ద్రుష్టి లేకున్నా సంతానం ఆలస్యం కావడం.. సంతానం లేకపోవడం, గర్భం తొలగించడం వంటివి జరుగుతాయి. పంచమంలో రాహువు ఉంటే నాగదోషం ఉంటుంది. దీని నివారణకు ఏమి చేయాలో.. ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఈ దోషాలు తొలగిపోయి.. మీరు కోరుకున్న కోరికలు నెరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం...

నాగదోష నివారణకు..
నాగ దోష నివారణకు మీరు శుభతిథులను ఎంచుకోవాలి. నాగదేవతలకు శుక్ల చవితి, శుక్ల పంచమి తిథులు, శుక్రవారం, ఆదివారం విశిష్టం.ఇలాంటి పవిత్రమైన రోజులలో పూజలు చేస్తే మీరు దుష్ఫలితాల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. అయితే పౌర్ణమి, దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులు, క్రిష్ణ పక్షాలు నాగదేవతల పూజలకు అనువైనవి కావని గమనించాలి.

ఆలయాల దర్శనం..
అయితే నాగదోష ప్రభావాన్ని బట్టి మాత్రమే పరిహారాలు పాటించాల్సి ఉంటుంది. నాగదోషం తీవ్రంగా ఉంటే, మీకు దగ్గర్లోని దుర్గా మాత ఆలయంలో నిద్ర చేసి మరుసటి రోజున శివుని దర్శనం చేసుకుని, రాహు,కేతువుల పూజలు, దానధర్మాలు చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే ఆరు ముఖాలు, ఎనిమిది ముఖాల రుద్రాక్షలను ధరించుట వల్ల శుభం కలుగుతుంది.

మానసిక ఐక్యత పెరగడానికి..
కొందరు పెళ్లి చేసుకున్న కొద్ది నెలల్లోనే విడాకులు తీసుకుంటారు. అది కూడా జాతకంలో ఏదో దోషం వల్లే జరుగుతుంది. వివాహం అయిన మొదటి కొన్ని రోజులలో, విడాకులు తీసుకున్న జంట కన్నీళ్లు పెట్టుకోకుండా స్వయంవర పార్వతీ మంత్రాన్ని ప్రతిరోజూ పఠించవచ్చు. ఇది భార్యాభర్తల మధ్య మానసిక ఐక్యతను పెంచుతుంది. మీ ఇద్దరి మధ్య దూరం తొలగించబడినప్పుడు సాన్నిహిత్యం పెరిగేకొద్దీ పిల్లవాడు ఆశీర్వదించబడతాడు.

గ్రహ దోషాలు
స్త్రీ, పురుష గ్రహాలలోని లోపాలు వివాహా బంధంలో ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా, భార్యాభర్తల మధ్య దూరం పెరిగేలా చేస్తాయి. ఇలాంటి అడ్డంకులను అధిగమించి, ఆహ్లాదకరమైన ఇంటి వాతావరణాన్ని ఏర్పరచుకుకోవడానికి జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఓ పరిహారం చేయాలి. ఈ పరిహారాన్ని ఆత్మవిశ్వాసంతో చేయడం వల్ల భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. మంగళవారం మరియు శుక్రవారం నాడు రాహుపాద పూజలు చేయాలి. ఐదు ఆకులను, ఐదు పసుపు కొమ్మలను కలిపి పూజలు చేయాలి. స్వయంవర పార్వతీ మంత్రాన్ని పఠించాలి. అనంతరం సమీపంలోని సుమంగళిగా ఉండే మహిళలకు వాటిని దానం చేయాలి. ఈ విధంగా చేస్తే మీ అడ్డంకులన్నీ త్వరలో వివాహం జరుగుతుంది. అలాగే ఆలుమగల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.

ఈ రెండురోజుల్లోనే..
ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా చాలా వరకు దేవాలయాలను ఇంకా పూర్తిగా తెరవలేదు. కాబట్టి ఆలయాలకు వెళ్లడం దాదాపు సాధ్యం కాదు. ఎందుకంటే వివాహం త్వరగా కావాలనుకునేవారు దుర్గామాత ఆలయానికి వెళ్లి పూజలు చేయాలి. మిగిలిన దేవాలయాలన్నీ తెరిచిన తర్వాత రాహువుకు సంబంధించిన పూజలను కేవలం మంగళవారం, శుక్రవారాల్లో చేయాలి. అప్పుడే దుర్గామత, పార్వతీదేవి ఆశీర్వాదం లభిస్తుంది.

108 సార్లు ఈ మంత్రాన్ని..
వివాహం త్వరగా జరిగేందుకు ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. పత్నీం మనోరమాం దేహి మనోవరుత్తానుసారిణీమ్!
తారణీం దుర్గసంసారసాగరస్వకలోద్భువామ్!!
అలాగే కనకధారా స్తోత్రం 21 సార్లు 90 రోజులు పఠించండి. మీ జాతాక రీత్యా శని, కుజ, చంద్ర, గురు, దోషాలుంటే ఆయా గ్రహాలకు పరిహారాలు చేసుకోండి.

కుజ దోష నివారణకు..
కుజ దోషం ఉండే వారు.. ఈ దోష నివారణకు దేవీ అష్టోత్తర స్తోత్రం, కుజ స్తోత్రం 21 సార్లు జపించాలి. సౌందర్య లహరిలో 1 నుండి 27వ శ్లోకం వరకు పఠించాలి. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో రాహు, కేతు పూజలు చేయాలి.

ఇవి దానం చేయాలి..
కుజ దోషం ఉన్న వారు తియ్యని తండూరీ రొట్టెలు దానం చేయాలి. అలాగే పేదలకు వస్త్రాలు, ఇతర వస్తువులను దానం చేయొచ్చు. పై పరిహారాలను దేవుని మీద విశ్వాసంతో చేయండి. తప్పకుండా మీ వివాహం జరుగుతుంది. అలాగే మీ వివాహ బంధంలో సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది.



Click it and Unblock the Notifications